.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

చనిపోయిన వారి పేరుతో కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా..?






చనిపోయిన వారి పేరుతో కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా..?

RELATED NEWSపేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ వరకు..!సకల శుభాలను ఒసగే మాసం...శ్రావణంతీజ్ ఉత్సవం విశిష్టత !!!!వందేమాతరం ఆలాపన తప్పనిసరి..!“స్వరాజ్యం నా జన్మహక్కు” అని మొదటగా ప్రకటించింది ఎవరో తెలుసా..?భక్తికి మతంతో సంబంధం లేదంటున్న ముస్లిం మహిళ..!గాయత్రి మంత్రం పఠిస్తే బుద్ధిని వికసింపజేస్తుందా ?ఇలా చేస్తే లక్ష్మీదేవత మీ వెంటే….!విబూదిని ధరిస్తే ప్రయోజనం ఏంటి? విబూది ఎలా తయారు చేస్తారు..?జనన మరణాలకు అతీతులైన జీవన్ముక్తులు వీరు!!!

హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదో రోజు వరకు పక్షులకు (కాకులకు) పిండం (ఆహారం) పెట్టడం చూస్తుంటాం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది. ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు మృతి చెందినప్పుడు పిండం పెట్టడం హిందూ సంప్రదాయం. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, ఒక వేళ కాకి ముట్టనట్లైతే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అసలు విషయమేమిటంటే. హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో రకంగా సహాయం చెయ్యాలి. అందుకే హిందూ కుటుంబాలలో చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు. చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు కర్మకాండలు జరిపించి పిండప్రదానం చేస్తారు. కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అనే మంత్రాన్ని చదువుతారు. ఆ మంత్రానికి అర్థం “గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృ దేవతలకి ఆహారం అందించాలి ” అని..!




కాకులకు పిండం పెట్టడంలో పరమార్థం :

పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం చాలా ఉంది. పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవట. అందుకే మన పూర్వికులు పిండప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది.




రామాయణం ప్రకారం…రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు…కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.




వికిర పిండం/నీటిలో వదిలే పిండం:

నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం. చాలామంది చనిపోయిన వారి ఆస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు. ఆస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుతుంది అని నమ్మకం.




గోవుకు పెట్టే పిండం:

పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం. ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? అని మీకు సందేహం రావొచ్చు. వాటికి కూడా సమాధానం లేకపోలేదు. ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు. అంతే కాదు ఆరోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు. అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం. ఇంకా చనిపోయిన వారి పేరిట వారి ఆత్మకి శాంతి చేకూరాలని బంధువులకు, ఊరి ప్రజలందరికి అన్నదానం చేస్తారు. మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML