.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం

* ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ,  కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే... 

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి.

శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !

ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం ) 

#తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.
Read More

పొలాల అమావాస్య వ్రత కధ :



పొలాల అమావాస్య వ్రత కధ :




అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది , చనిపోయింది . ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది . అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు. పాలేర్లు కల్లు తెస్తారు. వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు. నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .

అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టిందని, పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని, మడి, తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది.

ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందిం
Read More

RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*



రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*




సమస్త హిందువులను కలిపి తల్లి భారత్ మాత ను ఈ ప్రపంచానికే విశ్వ గురువు గా నిలబెట్టలనే ఏకైక లక్ష్యం...




Rss లో రెండు రకాల పని చేసే విధానం ఉంటుంది..




1.ప్రచారక్

2.గృహస్థు




1. ప్రచారక్: ప్రచారక్ అంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం తో జీవిత కాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తల్లీ భారత్ మాత కీ జయము కలగాలని సమాజ శ్రేయస్సు కోరుతూ అను నిత్యం ఎలాంటి లాభాపేక్ష లేకుండా హిందూ సంఘటనము అను ధర్మ రక్షణ కార్యం చేస్తారు..




2.గృహస్థు: గృహస్థు అంటే స్వయం సేవక్ గా తన పనులు తాను చేసుకుంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎక్కువలో ఎక్కువ సమయం హిందూ సంఘటనము కోసం పని చేస్తారు. వీరు సొంత ఖర్చు తో ఈ కార్యం లో పాల్గొంటారు..




Rss శాఖ ద్వార వ్యక్తి నిర్మాణం జరుపుతుంది. ఈ సంవత్సరానికి 55 వేల గ్రామాలలో శాఖ లు మరియు 155 000 సేవా కార్యక్రమాలు చేపట్టారు..




Rss హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరు తో విశ్వ విభాగ్ ఆధ్వర్యంలో 46 దేశాలలో హిందూ సంఘటనము అను కార్యం చేస్తుంది..




Rss.. నాలుగు రకాల శిక్షణా ఇస్తుంది..




1.ప్రాథమిక శిక్షా వర్గ:




ఈ శిక్షణా లో జిల్లా యూనిట్ గా ఏడూ రోజుల శిక్షణాఇస్తారు నామమాత్రం రుసుము తోనే




2.ప్రథమ వర్ష: ఏడూ రోజుల శిక్షణా పూర్తి చేసుకున్న వారికీ రాష్ట్రం యూనిట్ గా 20 రోజుల శిక్షణ నామమాత్రం రుసుము తోనే




3.ద్వితీయ వర్ష: ప్రథమ వర్ష శిక్షణ పూర్తి చేసుకున్న ఎంపిక చేసిన వారికి మాత్రమే నాలుగు రాష్ట్రాలు యూనిట్ గా 20 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..




4.తృతీయ వర్ష : ద్వితీయ వర్ష పూర్తి చేసిన ఎంపిక చేసిన వారికి దేశం మరియు ప్రపంచం యూనిట్ గా నాగ్ పూర్ లో 25 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..




Rss సంవత్సరానికి ఆరు ఉత్సవాలు నిర్వహిస్తుంది..

1.హిందూ సామ్రాజ్య దినోత్సవం

2.శ్రీ గురు పూజోత్సవం

3.రక్షా బంధన్ ఉత్సవం

4.విజయదశమి ఉత్సవం

5.సంక్రాంతి ఉత్సవం

6.ఉగాది ఉత్సవం




Rss సంఘ కార్యాన్ని వ్యాప్తికి అనేక విభాగలని ప్రాభించింది. వీటిని సంఘ్ పరివార్ గా పిలుస్తారు..




వీటిలో ముఖ్యమైనవి...




స్వదేశి జాగరణ మంచ్

సేవా భారతి

విద్యా భారతి

Abvp

Vhp

భజరంగ్ దళ్

వివేకానంద కేంద్ర

హిందూ వాహిని

ధర్మ జాగరణ

భారతీయ కిసాన్ సంఘ్

భారతీయ మస్ధుర్ సంఘ్

న్యాయ వాద పరిషత్

వనవాసి కళ్యాణ పరిషత్

సామాజిక సమరసత

విజ్ఞాన భారతి

సంస్కార భారతి

యూత్ ఫర్ సేవ

శిశు మందిరరాలు

దుర్గ వాహిని

సేవికా సమితి

హిందూ స్వయం సేవక్ సంఘ్




ఇలాంటి అనేక క్షేత్రాల ద్వార హిందూ సంఘటన మరియు దేశ భక్తిని ప్రేరణ ఇస్తూ.. సమాజ హితం కోసం అను నిత్యం పని చేస్తున్నాయి.




రండి..




మీరు ఈ సమాజ కార్యము లో పాల్గోని తల్లీ భారతీ కి జయమునొనరిదము..




భారత్ మాత కీ జై




🙏




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




హిందువునని గర్వించు -హిందువుగా జీవించు
Read More

కనీ, విని ఎరుగని అద్భుత ఆవిష్కరణ ..వేద పురాణాలలో ఉన్న సైన్స్ మరో సారి నిరూపితం .వేల సంవచ్చా రాల క్రితమే గుర్తించిన మన మహా ఋషులు. మరిన్ని వివరములు కావలెనంటే, ఈ క్రింది వీడియో చూడండి

నీటికి ఎదురెళ్ళే మొక్క, పేరు పురాణాలలో చెప్పిన గరుడ సంజీవని మొక్క. గరుడ పురాణం లో, సుశ్రుతుని వైద్య శాస్త్రం లో దీని గురించి  వివరణ. మరిన్ని వివరములు ,కావలెనంటే  ఈ క్రింది వీడియో చూడండి


Read More

10, ఏప్రిల్ 2018, మంగళవారం

Why did Krishna not save the Pandavas when they played dice with Duryodhana & Shakuni?

Why did Krishna not save the Pandavas when they played dice with Duryodhana & Shakuni?

Wonderful explanation by Krishna himself:

From his childhood, Uddhava had been with Krishna, charioting him and serving him in many ways.
He never asked for any wish or boon from Sri Krishna.
When Krishna was at the verge of completing His Avatar, he called Uddhava and said,
'Dear Uddhava, in this avatar of mine, many people have asked and received boons from me; but you never asked me anything.
Why don't you ask something now? I will give you.
Let me complete this avatar with the satisfaction of doing something good for you also'.

Even though Uddhava did not ask anything for himself, he had been observing Krishna from his childhood.
He had always wondered about the apparent disconnect between Krishna's teachings and actions, and wanted to understand the reasons for the same.
He asked Krishna, 'Lord, you taught us to live in one way, but you lived in a different way.
In the drama of Mahabharat, in the role you played, in your actions, I did not understand many things. I am curious to understand the reasons for your actions. 
Would you fulfil my desire to know?'

Krishna said, 'Uddhava, what I told Arjuna during the war of Kurukshetra was Bhagavad Gita.

Today, my responses to you would be known as 'Uddhava Gita'. 
That is why I gave this opportunity to you. Please ask without hesitation.'

Uddhava starts asking – 'Krishna, first tell me who is a real friend?' 

Krishna says, 'The real friend is one who comes to the help of his friend in need even without being called'.

Uddhava: 'Krishna, you were a dear friend of the Pandavas.
They trusted you fully as Apadhbhandava (protector from all difficulties).
Krishna, you not only know what is happening, but you know what is going to happen. You are a great gyani.

 Just now you gave the definition of a true, close friend.

Then why did you not act as per that definition.
 Why did you not stop Dharmaraj (Yudhishtra)
 from playing the gambling game?

Ok, you did not do it; why did you not turn the luck in favour of Dharmaraj, by which you would have ensured that dharma wins. You did not do that also.

You could have at least saved Dharmaraj by stopping the game after he lost his wealth, country and himself.

You could have released him from the punishment for gambling.
Or, you could have entered the hall when he started betting his brothers.
You did not do that either.
At least when Duryodhana tempted Dharmaraj by offering to return everything he lost if he bet Draupadi (who always brought good fortune to Pandavas), you could have intervened and with your divine power, you could have made the dice roll in a way that is favorable to Dharmaraj.
Instead, you intervened, only when Draupadi almost lost her modesty and now you claim that you gave clothes and saved Draupadi's modesty;
how can you even claim this – after her being dragged into the hall by a man and disrobed in front of so many people, what modesty is left for a woman?
What have you saved? 

Only when you help a person at the time of crisis, can you be called 'Apadhbandhava'.
If you did not help in the time of crisis, what is the use?
Is it Dharma?' 
As Uddhava posed these questions, tears started rolling from his eyes.

These are not the questions of Uddhava alone.
All of us who have read Mahabharata have these questions.
On behalf of us, Uddhava had already asked Krishna.

Bhagavan Krishna laughed. 
'Dear Uddhava, the law of this world is: *'only the one who has Viveka (intelligence through discrimination), wins'.
While Duryodhana had viveka, Dharmaraj lacked it. 
That is why Dharmaraj lost'.

Uddhava was lost and confused. Krishna continues :
'While Duryodhana had lots of money and wealth to gamble, he did not know how to play the game of dice.
That is why he used his Uncle Shakuni to play the game while he placed the  bet.
That is viveka.
 Dharmaraj also could have thought similarly and offered that I, his cousin, would play on his behalf.
If Shakuni and I had played the game of dice, who do you think would have won?
Can he roll the numbers I am calling or would I roll the numbers that he is asking for.
 Forget this.
I can forgive the fact that he forgot to include me in the game.
 But, without viveka, he did another blunder. 
He prayed that I should not come to the hall as he did not want me to know that through ill-fate he was compelled to play this game.
He tied me with his prayers and did not allow me to get into the hall; 
I was just outside the hall waiting for someone to call me through their prayers.
 Even when Bheema, Arjuna, Nakula and Sahadeva were lost, they were only cursing Duryodhana and brooding over their fate; they forgot to call me.
 Even Draupadi did not call me when Dusshasan held her hair and dragged her to fulfil his brother's order. 
She was also arguing in the hall, based on her own abilities. 
_She never called me.€ 
Finally good sense prevailed; when Dusshasan started disrobing her, she gave up depending on her own strength, and started shouting 'Hari, Hari, Abhayam Krishna, Abhayam' and shouted for me.
Only then did I get an opportunity to save her modesty.
I reached as soon as I was called. 
I saved her modesty.
 What is my mistake in this situation?

'Wonderful explanation, Kanna, I am impressed.
 However, I am not deceived. 
Can I ask you another question', says Uddhava.
Krishna gives him the permission to proceed.

'Does it mean that you will come only when you are called!
Will you not come on your own to help people in crisis, to establish justice?', asks Uddhava.

Krishna smiles. 'Uddhava, in this life everyone's life proceeds based on their own karma. 
I don't run it; I don't interfere in it.
I am only a 'witness'. I stand close to you and keep observing whatever is happening. This is God's Dharma'.

'Wow, very good Krishna. In that case, you will stand close to us, observe all our evil acts; as we keep committing more and more sins, you will keep watching us. You want us to commit more blunders, accumulate sins and suffer', says Uddhava.

Krishna says. 'Uddhava, please realise the deeper meaning of your statements.
When you understand & realise that I am standing as witness next to you, how could you do anything wrong or bad. You definitely cannot do anything bad. You forget this and think that you can do things without my knowledge.

That is when you get into trouble. 
Dharmaraj's ignorance was that he thought he can play the game of gambling without my knowledge.

If Dharmaraj had realized that I am always present with everyone in the form of 'Sakshi' (witness), then wouldn't the game have finished differently?'

Uddhava was spellbound and was so very  overwhelmed by Bhakti.

 He said, 'What a deep philosophy, Kesava.
What a great truth!

Even praying and performing pooja and calling Him for help are nothing but our feelings / beliefs.
When we start believing that nothing moves without Him, how can we not feel his presence as Witness?
 How can we forget this and act?
Throughout Bhagavad Gita, this is the philosophy Krishna imparted to Arjuna. 

He was the charioteer as well as guide for Arjuna, but he did not fight Arjuna's War':-
Realize that the Ultimate Sakshi / the one who is the Witness is within & within you!

And Merge in that God Consciousness!

Discover Thy Higher Self- The Pure Loveful & Blissful Supreme.
Please realise that God is with us all the time at the time when u do good as well as when you commit mistake📝
Every time I read this gives a smile on my face🙂
Please spread knowledge by sharing this with whom u love as well as whom you hate
Read More

పదిహేడవ శ్లోక భాష్యం

పదిహేడవ శ్లోక భాష్యం

సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభఙ్గరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చింతయతి యః!
స కర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః!!

వాగ్దేవి అని ఏకవచనంలో సరస్వతి చెప్పబడుతోంది. వాగ్దేవతలు అని బహువచనంలో వాడితే ఎనిమిది మంది చెప్పబడుతున్నారు. "అ" తో మొదలయే అచ్చులు పదహారు మొదటి వాగ్దేవత. అలాగే "క" వర్గము (అంటే క, ఖ, గ, ఘ, ఙ) ఒక వాగ్దేవత – ఈ రకంగా 51 వర్ణములు కలిసి ఎనిమిది మంది వాగ్దేవతలు. అచ్చుల వర్గపు వాగ్దేవత "వశిని". ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు వశిన్యాది వాగ్దేవతలుగా పిలవబడుతున్నారు. వీరు శ్రీచక్రంలో ఏడవ ఆవరణలో ఎనిమిది కోణములలో సంస్థితులై ఉన్నారు. అంటే అంబికను చుట్టి ఉన్నారన్నమాట. వీరే అంబిక ఆజ్ఞతో లలితా సహస్రనామ స్తోత్రమును పాడారు.

వారు సమస్త శబ్దజాలానికి తల్లులు కాబట్టి ఆచార్యులవారు "సవిత్రీభిర్వాచామ్" అంటూ శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు. చంద్రకాంత శిల అనే స్ఫటికము ఒకటుంటుంది అని పుస్తకాలలో ఉల్లేఖించబడి, అది చంద్రకాంతికి కరిగిపోతుందని నమ్మబడుతోంది. ఈ వాగ్దేవతలు చంద్రకాంతిని తమలో ప్రతిబింబించుకొనే చంద్రకాంత శిలలవంటివారట. ఒక శ్లోకంలో ఆచార్యులవారు అంబికను "శరజ్జ్యోత్స్నా శుద్ధం" అని, తరువాత శ్లోకంలో "అరుణామ్" అని ప్రస్తుతించారు. ఇక్కడ వాగ్దేవతల మధ్య పరివేష్టించి ఉన్న అరుణ అయిన అంబిక చెప్పబడుతోంది. వాగ్దేవతలతో కూడిన ఆ మహారాజ్ఞి ఎవరు "సంచింతయతి" చక్కగా చింతనచేస్తాడో, ధ్యానిస్తాడో అతడు "మహతాం భఙ్గి (భంగి) రుచి" మహాత్ములవలె కావ్యములు చేయగలిగిన వాడవుతాదు. అతని వాక్కులు మహాత్ముల వాక్ఝరి యొక్క రసపుష్టిని సంతరించుకొని ఉంటాయి. రుచి అనే మాట తినే వస్తువులు విషయంలో వాడబడేది. ఏ భాషలోనైనా కవితా రసాస్వాదన చేయగలిగే శక్తికి కూడా తినుబండారాల విషయంలో ఉపయోగించే "రుచి" అన్న మాట ఉపయోగించబడుతుంది. నాలుకతో తెలియబడే రుచిని మాత్రమే ఎందుకు వాడాలి. అందుకే ఆచార్యులవారు నాసికతో ఆఘ్రాణింపబడే వాసన గురించి కూడా చెబుతున్నారు. అటువంటి సాధువుల చేత పలుకబడిన కవిత్వం తేనె, పాలు, ద్రాక్షలవలె తీపిదనాన్ని మాత్రమే కాదు వాసన కూడా కలిగి ఉంటాయట. ఎనిమిది మంది వాగ్దేవతల సమిష్టి రూపమైన సరస్వతీ ముఖకమలం నుండి నిర్గమించే దైవికమైన వాసన అది. ఆ సువాసన పరమ ప్రేమను రేకెత్తిస్తుంది.

"వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః". సరస్వతీ దేవి మూర్తీభవించిన నిర్మలత్వము. శుద్ధత. సమస్త సాత్విక లక్షణములకు ఆలవాలమైనది. కళలకు పుట్టినిల్లు. అటువంటి తల్లి నోరు తెరిస్తే మనం పీల్చే గాలి సువాసన భరితమవుతుంది. ఆమె దానికై సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలము వేసుకోనక్కరలేదు. ఆమె పూలు ధరించకుండానే ఆమె కేశపాశములు నలుదిక్కులా సువాసనలను వెదజల్లుతాయి. సరస్వతీ కటాక్షమున్న మహాకవుల పద్యాలు, కవిత్వము అటువంటి సువాసనలను వెదజల్లుతుంది. అమ్మవారి నోటి సువాసనే ఈ కవిత్వపు సువాసన. పరమేశ్వరుని పాడిన కొద్దీ నోరు సువాసనా భరితమవుతుంది అంటారు వళ్ళలార్ అనే కవి.

అంబిక కవితా శక్తిని అనుగ్రహిస్తుందని ఆచార్యులవారు సౌందర్యలహరిలో అనేక శ్లోకాలలో చెప్పారు. ఒక శ్లోకంలో అంబికచే అనుగ్రహింపబడిన స్తన్యం అపారమైన కవితశక్తిని ఇస్తుందని చెబుతారు. వేరొక శ్లోకంలో అంబికా కటాక్షం బ్రహ్మకే అసూయ కలిగించే విధంగా కవితా వైభవాన్ని కలిగిస్తుంది అని చెబుతారు. మరొక శ్లోకంలో అంబిక పాదోదకము వానిని పరవళ్ళు తోక్కే కవితా ప్రవాహం గలవానిగా చేస్తుదని చెబుతారు. అంబికను దర్శించిన తన ఆనందాన్ని ఆచార్యులవారు అనుపమానమైన శైలిలో తమ వాక్ప్రవాహంతో మనలను ఓలలాడిస్తున్నారు. అయితే తిరిగి తిరిగి ఆమె ప్రసాదించే కవితా శక్తి గురించి ముచ్చటించడమెందుకు. ఈ స్తోత్రాన్ని చదివే వారు అటువంటి అంబికా కటాక్షాన్ని తాము కూడా పొంది ఆమె దయతో మళ్ళీ ఆమెపై స్తోత్రములు వ్రాసి తాము తరించి ఇతరులను తరింపచేయాలని ఆచార్యులవారి ఆకాంక్ష.
Read More

శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నారసింహ  ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరి
తృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవం
పంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనం
సప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమం
నవమం మంత్రరాజంచ దశమం భయభంజనం
ఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం ||

        సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు




శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం ఏకదంతంచ  ద్వితీయం షణ్ముఖాగ్రజం
తృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం మోదకప్రియం
పంచమం ఆద్యపూజ్యంచ షష్ఠం విఘ్ననివారకం
సప్తమం వేదవేద్యం చ అష్టమం స్ఫూర్తిదాయకం
నవమం కవిరాజం చ దశమం నాట్యకౌశలం  
ఏకాదశం గణనాథం చ ద్వాదశం శూర్పకర్ణకం  ||

      సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు




        శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం ఆంజనేయంచ ద్వితీయం లంకనాశనం 
తృతీయం  రామభక్తంచ చతుర్ధం యోగిపుంగవం 
పంచమం కార్యదీక్షంచ షష్ఠం వాక్యవిశారదం
సప్తమం ధ్యానమగ్నంచ అష్టమం బుద్ధికౌశలం
నవమం సురవంద్యంచ దశమం భానుతేజసం
ఏకాదశం  మిత్రశిష్యంచ ద్వాదశం భక్తకామదం  || 

        సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు





శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం షణ్ముఖంచ  ద్వితీయం గజాననానుజం
ద్వితీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||

     సర్వం శ్రీ శరవణభవ చరణారవిందార్పణమస్తు




శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం
ప్రథమం  భారతీనామ  ద్వితీయం జ్ఞానరూపిణీం
తృతీయం వేదపూజ్యంచ చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ షష్ఠం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం  ||  

       సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు





              శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం
ప్రథమం మహాలక్ష్మీ నామ ద్వితీయం హరివల్లభం
తృతీయం తమోపహారిణీంశ్చ చతుర్ధం చంద్రసహోదరీం
పంచమం దారిద్ర్యనాశినీం నామ షష్ఠం భార్గవకన్యకాం   
సప్తమం బిల్వసుప్రీతాంశ్చ అష్టమం మదనమాతరం
నవమం వేదవేద్యంశ్చ దశమం శశిశేఖరానుజాం 
ఏకాదశం కమలమధ్యాంశ్చ  ద్వాదశం మంగళప్రదాం  ||    

      సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు    




శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం 

ప్రథమం వాసుదేవం నామ ద్వితీయం బలరామానుజం
తృతీయం అకౄరవరదంచ  చతుర్ధం మురళీగానలోలనం
పంచమం సుదామమిత్రంచ షష్ఠం గోవర్ధనోద్ధరం
సప్తమం హాస్యచతురంశ్చ అష్టమం కంసమర్దనం
నవమం పీతాంబరధరంచ దశమం తులసీప్రియం  
ఏకాదశం చందనచర్చితంచ ద్వాదశం యోగీశ్వరేశ్వరం ||   

          సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు 




శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం రాఘవం నామ ద్వితీయం దశరథాత్మజం 
తృతీయం సామీరిసేవ్యంచ చతుర్ధం లక్ష్మణాగ్రజం 
పంచమం సుగ్రీవమిత్రంచ షష్ఠం రావణమర్దనం
సప్తమం కాలరుద్రంచ అష్టమం పురుషోత్తమం
నవమం సత్యధర్మరతంచ దశమం మైథిలీప్రియం
ఏకాదశం అహల్యాశాపమోచనంశ్చ ద్వాదశం కరుణార్ణవం || 

          సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు




శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ దశమం భక్తవత్సలం 
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం  || 

          సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు




శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం వేంకటేశ్వరం నామ ద్వితీయం సప్తగిరీశం
తృతీయం పద్మావతీప్రియంచ చతుర్ధం ఆనందనిలయం
పంచమం స్కందసన్నుతంచ షష్ఠం త్రయీనుతం
సప్తమం యశోదానందనంచ అష్టమం మౌక్తికమండపస్థితం 
నవమం  సాలగ్రామధరంచ దశమం శేషశాయినం  
ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ ద్వాదశం వకుళాత్మజం ||

సర్వం శ్రీ వేంకటేశ్వర చరణారవిందార్పణమస్తు




శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం హయగ్రీవం నామ ద్వితీయం జ్ఞానపంజరం
తృతీయం ప్రణవోద్గీధం చతుర్ధం భక్తకామదం
పంచమం సౌమనస్కశ్చ షష్ఠం హయగ్రీవభంజనం
సప్తమం లలితాఉపాసకశ్చ  అష్టమం శుద్ధస్ఫటికం 
నవమం కంబుకంఠంచ దశమం అక్షమాలాధరం
ఏకాదశం జాడ్యనాశనంశ్చ ద్వాదశం వాగీశ్వరేశ్వరం  ||

       సర్వం శ్రీ హయగ్రీవ చరణారవిందార్పణమస్తు




            శ్రీ వరాహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం 
తృతీయం మహారౌద్రంచ  చతుర్ధం శాంతమానసం 
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ  షష్ఠం హిరణ్యాక్షభంజనం  
సప్తమం గదాధరంశ్చ  అష్టమం క్రోడరూపిణం      
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ  ద్వాదశం విశ్వమంగళం ||  

     సర్వం శ్రీవరాహదేవ చరణారవిందార్పణమస్తు




శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం 
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||

       సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు 




శ్రీ రాజరాజేశ్వరి ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ  షష్ఠం హరిసోదరీం
సప్తమం  వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం  ||

        సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు




శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం 
తృతీయం వటవృక్షనివాసంచ చతుర్ధం సనకసనందనాదిసన్నుతం 
పంచమం నిగమాగమనుతంచ షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ దశమం కైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ  ద్వాదశం మేధార్ణవం ||

    సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు   




శ్రీ సూర్య ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం  సూర్యనారాయణం నామ ద్వితీయం రోగనాశనం 
తృతీయం అహస్కరంచ చతుర్ధం జ్ఞానవర్ధనం
పంచమం పర్జన్యమిత్రంచ షష్ఠం కశ్యపనందనం
సప్తమం సర్వశుభదంచ అష్టమం శతృభంజనం  
నవమం  కిరణకారణంచ దశమం విశ్వతేజసం
ఏకాదశం వేదవాహనంచ ద్వాదశం రామసేవితం || 

      సర్వం శ్రీ సూర్యనారాయణ చరణారవిందార్పణమస్తు




శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం 

ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం 
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం 
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం  
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం   
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం   
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం  ||

   సర్వం శ్రీ అయ్యప్ప చరణారవిందార్పణమస్తు
Read More

ఓం నమః శివాయ శివోదయం నేస్తాలు ....

ఓం నమః శివాయ 
శివోదయం నేస్తాలు ....

మహా మృత్యుంజయ మంత్రం:
"""""""""""""""""""""""""""""""
త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. 

ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. 
ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. 

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి.   ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.

మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి.  మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. 

తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. 

ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు,

 మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. 

ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం
నమః పార్వతీ పతయే హర హర మహా దేవా నమో నమః
Read More

శివుడే స్వయంగా పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి"

శివుడే స్వయంగా పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి" 

ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు . స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు . గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీ కి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాశేవారు. అది తరువాత 'బవారస్'గా మారింది. వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.

సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. పూరాతత్వ పరిశోధనల లెక్కల ప్రకారం వారణాశి పరిసర ప్రాంతాలలో క్రీస్తు పూర్వం 11-12 శతాబ్ధాలలోనే నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తోంది. ఇది ఆర్యుల మత, తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతోంది. 

ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా... ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 

వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. అయితే 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని రెండు గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.

కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో 'సంకట్ మోచన్ హనుమాన్ మందిరం' కూడా అతి ముఖ్యమైనది . ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు .. కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం
Read More

ధర్మం గుఱించి “కర్ణ-శ్రీకృష్ణ” సంవాదం

ధర్మం గుఱించి "కర్ణ-శ్రీకృష్ణ" సంవాదం

ఓ కృష్ణా!  నేను పుట్టి పుట్టక ముందే నా తల్లి కుంతి నన్నువదిలి వేసింది,
అలా పుట్టడం నా తప్పా? నా పాపం కాదు గదా ?
నేను సూతుడనైనందున ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు 

పరశు రాముడు నాకు యుద్ద విద్య నేర్పాడు కాని, అవసర సమయంలో నాకు మంత్రప్రేరిత  అస్త్రాలు ఏమీ గుర్తు రావు అని శపించాడు 

పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు 

ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించబడ్డాను 

చివరికి నా తల్లి కుంతి కుడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణం లోనే నా జన్మ రహస్యం నాతో చెప్పింది , అదీ కుడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం

ఇంత వరకు నేను ఏదైనా పొందాను, గౌరవించబడ్డాను అంటే, అది దుర్యోధనుని దయాబిక్ష !!!

ఇప్పుడు చెప్పు కృష్ణా! నేను దుర్యోదనుని పక్షాన నిలబడం లో తప్పేంటి ?

ఓ కర్ణా! నేను చెరసాల లో పుట్టాను 

నేను పుట్టక ముందు నుండే నన్ను చంపడానికి చూసారు 

నేను పుట్టిన రాత్రే,  నేను నా జననీ జనకుల నుండి నుండి వేరుచేయ బడ్డాను 

నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము, కర్రసాము , రథారోహణ, అశ్వచాలనం, ధనుస్సు, బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు

నేను ఆల మందలను కాస్తూ పెరిగాను, పైగా నడక రాక మునుపే, నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి 

నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు, నాకు ఏ ప్రాధమిక విద్యా లేదు 

"జనమంతా వాళ్ళ భాదలకు కారణం నేనే  కారణం అట" కొన్నిసార్లు జనాలు అనడం నేను విన్నాను 

నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువుల చేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు, కనీసం నాకు ప్రాధమిక విద్య కుడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా!  నా 16వ ఏట !

నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు  నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు, రాక్షసుల / దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను

జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం, నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది.  దానికి కొందరు పిరికి వాడు అనికూడా అన్నారు 

ఒక విషయం గుర్తుంచుకో కర్ణా!

జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూల పాన్పు కాదు..ధర్మరాజు కుడా ఎన్నో సార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ అతను నమ్మిన ధర్మాన్ని అతను ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో? నీ అంతరాత్మకు తెలుసు.

ఎన్ని సార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు  ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం .

ఆరోపణలు ఆపు కర్ణా!

 దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు. ఇది నీకు పూర్తిగా  తెలుసు అయినా అతని పక్షం వహించావు. నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు, నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు కాకూడదు

"ధర్మోరక్షతి రక్షితః"  అనే సూక్తి ని అందంగా అర్ధం అయ్యేలాగ వివరించారు. ఎంత కఠోర పరిస్థితుల కారణం గానైనా ధర్మం తప్పితే అధర్మం.

ధర్మోరక్షతి రక్షిత:
Read More

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...
🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.

ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే.
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

గరుడ పురాణం:

గరుడుని పుట్టుక:
 ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు , బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను . ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి . అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను . అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను ,మరొకటి ఆకాశముగాను అయ్యెను.ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను . అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా "తప తప "అను మాటలు విన వచ్చెను . అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను .
బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని , దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి , వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి , మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు
 కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత ,కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె ,గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను.ఆమె సంతోష భరితురాలయ్యేను .
ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ , వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ "గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న " దనెను. వినత " అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?" అనెను. కద్రువ ,"కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను .తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను " అనెను .వినత " అయినచో పోయి చూతము రమ్మ "నెను. కద్రువ " ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.
రేపు ప్రొద్దున చూత " మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి ,"మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు " డనెను . "విషయమే" మని వారడుగగా ,జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి .ఆమె వారిని సర్పయాగాములో నశింపు చేసెను .
వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది .తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని
 త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు.
ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి," మనకీ దురవస్థయే" మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి " ఏమిచ్చినచో నీవు నా
 తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద " నని యడిగెను. ఆమె " దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు " ననెను.
గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి , తన తల్లి దాస్యమును ,దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి ,ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను.
కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి ,అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి .వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో " దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు
" మనెను. దానికి గరుడుడు " నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును." అనెను . " ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె ,నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే , అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను .దీనికి నీవంగీకరింపుము" అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి , " మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !" అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి ," కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు." అని చెప్పెను.
తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై "గరుడా ! నీ భక్తికి మెచ్చినాను .నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము." అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
 ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట ,అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను . శ్రీ హరి ప్రసన్నుడయ్యెను .
నవగ్రహములు – రత్నములు
సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను ,మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. 

ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .

1 .సూర్యుడు — పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు — ముత్యము
3 .అంగారకుడు – పగడము
4 .బుధుడు — ఆకుపచ్చ
5 .గురుడు –పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు –వజ్రము
7 .శని — నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు – గోమేధికము
9 . కేతువు — వైడూర్యము
 పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను.

 ఈ యజ్ఞములు ఐదు

1 . దేవ యజ్ఞము 
2 . పిత్రు యజ్ఞము 
3 . భూత యజ్ఞము 
4 . మనుష్య యజ్ఞము   5 . బ్రహ్మ యజ్ఞము .

1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు . గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు .(గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము ) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.

2 . పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది . పితృ వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని , తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .

3 . భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి . ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .

4 . మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు ) జరుగునపుడు
 యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .

5 .బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట ,లేదా !
అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును.
శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను ,సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. " అహరహ స్సంధ్యా ముపాసీత " అని పెద్దల యాదేశము.
శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .
దానములు – ధర్మములు
దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును.
అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.
సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును.
దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును .
ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును.
వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు
 ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము .అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి ,పదునెనిమిది పురాణములు రచించినది ,దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి .ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము ,అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు.
అంతే కాదు ; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి.
గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువు
 రెండవ ద్వాపరములో ప్రజాపతి
 మూడవ ద్వాపరములో ఉశ నసుడు
 నాలుగవ ద్వాపరములో బృహస్పతి
 ఐదవ ద్వాపరములో సవితృడు
 ఆరవ ద్వాపరములో మృత్యువు
 ఏడవ ద్వాపరములో ఇంద్రుడు
 ఎనిమిదవ ద్వాపరములో వసిష్టుడు
 తొమ్మిదవ ద్వాపరములో సారస్వతుడు
 పదవ ద్వాపరములో త్రిధాముడు
 పదునొకండవ ద్వాపరములో త్రివృషుడు
 పండ్రెండవ ద్వాపరములో శత తేజుడు
 పదమూడవ ద్వాపరములో ధర్ముడు
 పదునాలుగవ ద్వాపరములో తరక్షుడు
 పదునైదవ ద్వాపరములో త్ర్యారుణి
 పదునారవ ద్వాపరములో ధనంజయుడు
 పదునేడవ ద్వాపరములో కృతంజయుడు
 పదునెనిమిదవ ద్వాపరములో ఋతంజయుడు
 పందొమ్మిదవ ద్వాపరములో భరద్వాజుడు
 ఇరువదవ ద్వాపరములో గౌతముడు
 ఇరువదొక్కటవ ద్వాపరములో రాజశ్రవుడు
 ఇరువది రెండవ ద్వాపరములో శుష్మాయణుడు
 ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందుడు
 ఇరువది నాలుగవ ద్వాపరములో వాల్మీకి
 ఇరువది ఐదవ ద్వాపరములో శక్తి
 ఇరువది యారవ ద్వాపరములో పరాశరుడు
 ఇరువది యేడవ ద్వాపరములో జాతూకర్ణుడు
 ఇరువది ఎనిమిదవ ద్వాపరములో కృష్ణ ద్వైపాయనుడు
ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు , వైశంపాయనులను శిష్యులకు భోదించి ,అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .


శ్రీ హరి దశావతారములు
🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

1 .మత్స్యావతారము
 వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను . అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను ,చెరువులోను, సరస్సులోను వేసెను .
అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు . ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు ) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి ,వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను .

2 . కూర్మావతారము
దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా ,విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి .
ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను . అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను . దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను ,అమృతమును పుట్టెను.

3 .వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెన

4 . నృసింహావతారము
అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.

5 .వామనావతారము
 బలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి , బలిని మూడడుగుల నేల యడిగి , వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను .

6 .పరశురాముడు
 శ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.

7 . శ్రీరాముడు
రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి ,సీతను పెండ్లాడి , సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను .రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి ,అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను . లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత ,అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను .

8 .శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి ,కృష్ణావతారము నెత్తెను.
దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి ,వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి , దుష్ట రాక్షసులను సంహరించెను.
మధురా పురమునకు పోయి కంసుని సంహరించి ,మాతామహుని రాజ్యమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్ట మహిషులను వివాహ మాడెను. నరకుని జంపి 16000 మందిని వాని చెర నుండి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి బార్యా పుత్ర బంధు మిత్ర పరివారముతో నూట పాతిక యేండ్లు భూలోకమున నివసించెను . భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించు చుండగా ముసలము వంకతో వారిని గూడా సంహరించి తాను పరమ పదమునకు చేరెను .

9 బుద్దావతారము
 ఒకప్పుడు రాక్షసులు విజ్రుంభించి దేవలోకము పై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి ,దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయా మోహ స్వరూపముతో శుద్దో దనుని కుమారుడుగా జన్మించెను. వేద విరుద్దములైన బోధలతో రాక్షసుల నందరును సమ్మోహ పరచి వారిని వేద బాహ్యులను జేసెను.ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను గూడా భ్రమింపజేసెను . రాక్షసులు పాషండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారి నోడించి స్వర్గమును చేజిక్కించు కొనిరి.

10 కల్క్యవ తారము
 బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును .వారు ధర్మ పరులై ప్రజా కంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగములో విష్ణు యశుడను వానికి శ్రీ హరి ,కల్కి రూపముతో జన్మించును .ధర్మమును తిరిగి ప్రతిష్టించును .
ఈ దశావతారముల కధను విన్నవారికి అనంతమైన పుణ్యము గలుగును.
శ్రీ మన్నారాయణుడింకను ఎన్నో అవతారము లెత్తెను. అవి యన్నియు ధర్మ సంస్థాపనము చేయుటకే యని గ్రహింపవలెను.
ఇది గరుడ పురాణము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.!
Read More

హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..? 🔥

 హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..? 🔥
హిందూ ధర్మచక్రం

 దేవునికి  హారతి ఇవ్వడానికి కారణం ఏంటి? హారతి రహస్యం ఏంటి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే... భగవంతునికి హారతి ఇచ్చేప్పుడూ... 'స్వామీ... ఈ జన్మని ఇచ్చావ్. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకా ఎన్నో పరిణామక్రమాలు చూడాల్సి ఉంది. అందుకే.. ఎలాంటి కష్టాలు కలుగనీయకుండా... ఈ హారతి కర్పూరం మాదిరిగానే... నీలో  ఐక్యమైపోయే అదృష్టాన్నిప్రసాదించు తండ్రీ'  వేడుకోవడమే హారతి  ఇవ్వడంలోని ఆంతర్యం.
....✍ హిందూ ధర్మచక్రం
Read More

ధ్వజస్థంభం పుట్టుక

ధ్వజస్థంభం పుట్టుక

మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

ఇది అన్ని మీ గ్రూప్ లకు షేర్ చేయండి 
అందరు తెలుసుకోవలసిన విషయం ఇది..!
Read More

భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది


ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి.  ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది.   

పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు.  "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని చెప్పాడు. 

పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు.

పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని  చెప్పాడు.

" నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతాలు  వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది.

అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేస్తాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది.

జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది.

మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. 

పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

పార్వతీదేవి "మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయ త్నాలు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది.

అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు" అని చెప్పాడు శివుడు. స్వస్తి.

జైగురుదేవ్🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Read More

శ్రీ ఆంజనేయ స్తుతి

శ్రీ ఆంజనేయ స్తుతి

1.ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం | 
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం | | 

2.గోష్పదీకృత వారాశిం 
మశకీకృత రాక్షసమ్. 
రామాయణ మహామాలా 
రత్నం వందే నిలాత్మజమ్. 

3.యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ 
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. 
బాష్పవారి పరిపూర్ణలోచనమ్ 
మారుతిం నమత రాక్షసాంతకమ్. 

4.బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా| 
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాద్భవేత్‌||

ఓం శ్రీ ఆంజనేయ నమో నమః

శుభోదయం
Read More

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?
యుద్ధంలో మైరావణుని తలపడే సమయంలోఅనుకోని విధంగా లక్ష్మణుడు,కొంతమంది వానరులు మైరావణుని శరాఘాతాలకి మూర్ఛపోతాడు .ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక నిరుత్సాహంగా,దిగులుతో ఉవ్న శ్రీరాముని వంక చూసినహనుమ తన వంతు సహాయం కోసం,రామచంద్రుని అజ్ఞకోసం ఎదురచూడసాగాడు .

దీన్నిగమనించిన రాములవారు మునీశ్వరులు తదితరులు చెప్పిన విధంగా సంజీవిని పర్వతం తీసుకురమ్మని చెప్పారు రామచంద్రుని అజ్ఞరాగానే హనుమ వాయువేగంతో ఆకాశమార్గానికేసి పయనమయ్యాడు.

దిన్ని గమనించిన శుక్రాచార్యులు (రాక్షసుల కుల గురువు) వారు ఎలాగైనాసరే హనుమ పయనాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు .కార్యసాధకుడని పేరుగల హనుమ సంజీవిని మూలికలను తీసుకువస్తే ముర్చపోయిన అందరికి తిరిగి శక్తి అపరిమితంగా వస్తుంది .ఇక వారితో తలపడటం ఎవరివల్లాకాదు అని దుర్బుద్ధితో నవగ్రహాల్లో అత్యంతభయోత్పాతకుడైన శనిని హనమను ఇబ్బందిపాలుచేసి అతని కార్య సాధనకు భంగం కలిగించమని అజ్ఞ జారీ చేసాడు.

గురువుగారు చెప్పిందే తడవుగా శనేశ్వరుడు తన ప్రతాపాలన్నిటిని హనుమమీదప్రయోగించటానికి సిద్ధమవుతాడు .

ఈ లోగ హనుమ తాను వెళ్ళిన ప్రదేశమంతా వెతికి వెతికి ఆ సంజీవిని మూలిక ఏదో తెలీక మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని ఆకాశ మార్గాన వస్తుంటాడు, దీన్నిచూసిన శని హనుమని మర్గమధ్యన ఆపి ,తను రావణాసురుడు పంపగా వచ్చానని ,ఈ పర్వతాన్ని తీసుకు వెళ్ళడానికి వీల్లేదని గొడవ చేస్తాడు .ఈ మాటలకి హనుమకు విపరీతమైన కోపం వచ్చి తన ఆవేశాన్ని ఆపుకుంటూరామనామ జపం చేస్తూ తన పాదాలతో శనికి ఊపిరికూడా ఆడకుండా నొక్కి పెడతాడు .

హనుమ మహిమ తెలుసుకున్న శని చివరకు తను తప్పుగా అడ్డుకున్నానని హనుమకు క్షమాపణలు చెప్పి తనను వదిలేయమని ప్రాదేయపడతాడు.
తన కాళ్ళక్రింద  శని పడే బాధను చూసి, తప్పు తెలుసుకున్న శనిని హనుమ విడిచిపెడుతూ .....కొన్ని షరతులు పెడతాడు .

ఎవరైతే ప్రతిరోజు మూడుపూటలా రామనామ జపం జపిస్తూ౦టారో వారి జోలికి, ఎవరైతే తనను ఎల్ల వేళలాపూజిస్తుంటారోవారి జోలికి వెళ్ళటంకానీ ,వారి మీద కనీసం నీ చూపు కూడా పడటానికి వీల్లెదని శని భయపడేవిధంగా అజ్ఞ జారీ చేస్తాడు .దానికి శనేశ్వరుడు తన అంగీకారం తెలియజేస్తూ తనూ ఓ కోరిక కోరతాడు .అది ఏమిటంటే .....

మీ దేవాలయాలు ఉండేచోట నా విగ్రహం ఉంటూ ,ప్రతి శనివారం మీతోపాటునాకు అభిషేకాలు జరిగేలా చూడాలని అప్పుడే భక్తుల పాలిట జాగ్రత్తగా వుంటానని తన కోరికను హనమకు చెప్తాడు.

హనుమ శని కోరికకు తధాస్తు పలికి శనేశ్వరుని అశ్వీర్వదించి పంపిస్తాడు .అప్పట్నించి శని దశ నడుస్తున్నవారు ,మాములుగా భక్తులు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు ,పూజలు తప్పకచేస్తుంటారు అలా చేస్తేనే శని మహారాజు వీరిపట్ల తన తీక్షణతను విరమిస్తాడని పురాణ కధనం .

జై భజరంగబలి కి జై
Read More

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం


నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.
తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.
అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి' ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏
Read More

18, మార్చి 2018, ఆదివారం

ఎవరు ముందు చెప్పినట్లు..?🤔


ఎవరు ముందు చెప్పినట్లు..?🤔

స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!

మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాద సంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!

మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం  ...అంటే 2018 నాటికి 197,29,49,120 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!

మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పకం అంతమందు సకల ప్రాణులూ తన యందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!

అంతకు ముందు భారతీయులకు ఉన్న విమాన శాస్ర్తాన్ని కూడా కాస్త పక్కన పెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారు చేసిన "మరుత్సబి" గాలిలో ఎగిరింది కదా.. మధ్యలో ఆగిపోయిన ఆ విమాన ప్లాన్ ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!

మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్ర్తం కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటే.... మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజిస్తారెందుకబ్బా!......

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!

మరి మన పురాణాలకాలం వారికి "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

భారతీయ గోవు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ యుగాలకాలం నుంచి ఎందుకుందబ్బా!.....

లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!

మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం (విష్ణు ద్వజం) ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం తుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!

మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!

మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం" అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరు వచ్చినట్లు తెలుస్తోంది...ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!

మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!

మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః" అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!

విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ప్రస్తుతం భారతదేశం న్యాయవ్యవస్ద విదేశాలను అనుసరించిది అని వాదిస్తుంటారే!
మరి క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం విఘ్నేశ్వరుడు రచించిన "మితాక్షర" గ్రంధం లోని అంశములను తెలియబరుస్తూ యాజ్ఞవల్క ఋషి రచించిన  స్మృతులను, 13వ శతాబ్దంనాటి తెలుగు కవి కేతన రచించిన విఘ్నేశ్వరం అనే గ్రంధంలోని అంశములను, ఇప్పటికి హిందూ న్యాయ వ్యవస్ద అనుసరిస్తున్నదని న్యాయ పుస్తకాల్లోనే ఎందుకుంది?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...
ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం..```
నేడు నీచులచే వక్రీకరింపబడ్డ మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో ఉన్నాం...

ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈ లోకానికి లౌక్యం..?
  
 ఇలాంటి మరుగునపడిన భారతీయ చరిత్ర గురించి చిన్నతన్నం నుండి పాఠ్య పుస్తకాలలోగాని పాఠశాలల ద్వారాగాని పిల్లలకు తెలియనియక మెకలె  విద్యా  విధానం ద్వారా వక్రీకరించబడ్డ చరిత్ర చదివి ప్రతి ఒక్కటీ విదేశీవాడే కనుగొన్నాడన్న ధోరణిలో విదేశాలకు జేజేలు పలుకుతూ మన భరత మాతను భారతదేశాన్ని పనికిమాలిన దేశం ఇక్కడ ఏమున్నదని తిట్టే స్దాయికి చేరుకున్నాం. కనుక మన దేశ ఘన చరిత్ర గురించి భావితరానికి తెలియజేయండి మన పూర్వీకుల జ్ఞాన భాండాగారాన్ని తిరిగి పంచండి అప్పుడే దేశం పట్ల జాతి పట్ల సంస్కృతి పట్ల ఆచార వ్యవహారాల పట్ల గౌరవ భావం తోపాటుగా దేశ భక్తి పెరుగుతుంది.

మేరా భారత్ మహాన్ 
భారత్ మాతాకి జై...🙏

Virus-free. www.avast.com
Read More

Powered By Blogger | Template Created By Lord HTML