.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం

* ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ,  కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే... 

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి.

శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !

ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం ) 

#తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.
Read More

పొలాల అమావాస్య వ్రత కధ :



పొలాల అమావాస్య వ్రత కధ :




అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది , చనిపోయింది . ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది . అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు. పాలేర్లు కల్లు తెస్తారు. వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు. నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .

అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టిందని, పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని, మడి, తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది.

ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందిం
Read More

RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*



రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*




సమస్త హిందువులను కలిపి తల్లి భారత్ మాత ను ఈ ప్రపంచానికే విశ్వ గురువు గా నిలబెట్టలనే ఏకైక లక్ష్యం...




Rss లో రెండు రకాల పని చేసే విధానం ఉంటుంది..




1.ప్రచారక్

2.గృహస్థు




1. ప్రచారక్: ప్రచారక్ అంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం తో జీవిత కాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తల్లీ భారత్ మాత కీ జయము కలగాలని సమాజ శ్రేయస్సు కోరుతూ అను నిత్యం ఎలాంటి లాభాపేక్ష లేకుండా హిందూ సంఘటనము అను ధర్మ రక్షణ కార్యం చేస్తారు..




2.గృహస్థు: గృహస్థు అంటే స్వయం సేవక్ గా తన పనులు తాను చేసుకుంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎక్కువలో ఎక్కువ సమయం హిందూ సంఘటనము కోసం పని చేస్తారు. వీరు సొంత ఖర్చు తో ఈ కార్యం లో పాల్గొంటారు..




Rss శాఖ ద్వార వ్యక్తి నిర్మాణం జరుపుతుంది. ఈ సంవత్సరానికి 55 వేల గ్రామాలలో శాఖ లు మరియు 155 000 సేవా కార్యక్రమాలు చేపట్టారు..




Rss హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరు తో విశ్వ విభాగ్ ఆధ్వర్యంలో 46 దేశాలలో హిందూ సంఘటనము అను కార్యం చేస్తుంది..




Rss.. నాలుగు రకాల శిక్షణా ఇస్తుంది..




1.ప్రాథమిక శిక్షా వర్గ:




ఈ శిక్షణా లో జిల్లా యూనిట్ గా ఏడూ రోజుల శిక్షణాఇస్తారు నామమాత్రం రుసుము తోనే




2.ప్రథమ వర్ష: ఏడూ రోజుల శిక్షణా పూర్తి చేసుకున్న వారికీ రాష్ట్రం యూనిట్ గా 20 రోజుల శిక్షణ నామమాత్రం రుసుము తోనే




3.ద్వితీయ వర్ష: ప్రథమ వర్ష శిక్షణ పూర్తి చేసుకున్న ఎంపిక చేసిన వారికి మాత్రమే నాలుగు రాష్ట్రాలు యూనిట్ గా 20 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..




4.తృతీయ వర్ష : ద్వితీయ వర్ష పూర్తి చేసిన ఎంపిక చేసిన వారికి దేశం మరియు ప్రపంచం యూనిట్ గా నాగ్ పూర్ లో 25 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..




Rss సంవత్సరానికి ఆరు ఉత్సవాలు నిర్వహిస్తుంది..

1.హిందూ సామ్రాజ్య దినోత్సవం

2.శ్రీ గురు పూజోత్సవం

3.రక్షా బంధన్ ఉత్సవం

4.విజయదశమి ఉత్సవం

5.సంక్రాంతి ఉత్సవం

6.ఉగాది ఉత్సవం




Rss సంఘ కార్యాన్ని వ్యాప్తికి అనేక విభాగలని ప్రాభించింది. వీటిని సంఘ్ పరివార్ గా పిలుస్తారు..




వీటిలో ముఖ్యమైనవి...




స్వదేశి జాగరణ మంచ్

సేవా భారతి

విద్యా భారతి

Abvp

Vhp

భజరంగ్ దళ్

వివేకానంద కేంద్ర

హిందూ వాహిని

ధర్మ జాగరణ

భారతీయ కిసాన్ సంఘ్

భారతీయ మస్ధుర్ సంఘ్

న్యాయ వాద పరిషత్

వనవాసి కళ్యాణ పరిషత్

సామాజిక సమరసత

విజ్ఞాన భారతి

సంస్కార భారతి

యూత్ ఫర్ సేవ

శిశు మందిరరాలు

దుర్గ వాహిని

సేవికా సమితి

హిందూ స్వయం సేవక్ సంఘ్




ఇలాంటి అనేక క్షేత్రాల ద్వార హిందూ సంఘటన మరియు దేశ భక్తిని ప్రేరణ ఇస్తూ.. సమాజ హితం కోసం అను నిత్యం పని చేస్తున్నాయి.




రండి..




మీరు ఈ సమాజ కార్యము లో పాల్గోని తల్లీ భారతీ కి జయమునొనరిదము..




భారత్ మాత కీ జై




🙏




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




హిందువునని గర్వించు -హిందువుగా జీవించు
Read More

కనీ, విని ఎరుగని అద్భుత ఆవిష్కరణ ..వేద పురాణాలలో ఉన్న సైన్స్ మరో సారి నిరూపితం .వేల సంవచ్చా రాల క్రితమే గుర్తించిన మన మహా ఋషులు. మరిన్ని వివరములు కావలెనంటే, ఈ క్రింది వీడియో చూడండి

నీటికి ఎదురెళ్ళే మొక్క, పేరు పురాణాలలో చెప్పిన గరుడ సంజీవని మొక్క. గరుడ పురాణం లో, సుశ్రుతుని వైద్య శాస్త్రం లో దీని గురించి  వివరణ. మరిన్ని వివరములు ,కావలెనంటే  ఈ క్రింది వీడియో చూడండి


Read More

Powered By Blogger | Template Created By Lord HTML