.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

8, జులై 2023, శనివారం

నమః పార్వతి పతయే హర హర

 నమః పార్వతి పతయే హర హర

హర హర శంభో మహాదేవ

హర హర మహాదేవ

హర హర హర హర మహాదేవ

శివ శివ శివ శివ సదాశివ

మహాదేవ సదాశివ

సదాశివ మహాదేవ ||


💥శివాలయంలో పరమేశ్వరుని దర్శనం..


శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.

అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది.


శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.

అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి.

అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు.


శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి.

ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి.

🍁🍁🍁🍁🍁


🌹శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.. "పశ్చిమాభిముఖమైన" శివాలయం.


అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది.

అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని "సద్యోజాత శివలింగం" అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు "ఓం సద్యోజాత ముఖాయ నమః" అని స్మరించుకోవాలి.

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం.


🌹శివలింగం "తూర్పు వైపు"కు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని "తత్పురుష ముఖం" అని అంటారు.

తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం.

అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది.

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము.

ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.


సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.


🌹శివలింగం "దక్షిణానికి" చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు.

ఆ ముఖాన్నే "అఘోర ముఖం" అంటారు.


ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం.

ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు.

మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. 


🌹"ఉత్తరం" వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

ఈ వాసుదేవ ముఖాన్ని "ఓం వాసుదేవాయ నమః" అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.


🌹శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి.

ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. 


ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.

ఈ ఈశాన ముఖం ఆకాశమునకు అధిష్ఠానం అయి ఉంటుంది.


శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది.

అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

సేకరణ... 💐🙏


Read More

కపిలతీర్థం తిరుపతి

            కపిలతీర్థం తిరుపతి 

                  ➖➖➖✍️



శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది కపిలతీర్థము.


కపిల తీర్ధమునకు ‘చక్రతీర్థం‘ లేదా ‘ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు.


కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి,  భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు.


అందువలన ఇది 'కపిలలింగం'గా పేరొందింది.


త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది.


ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.


కార్తిక మాసం నందు వచ్చు కార్తీక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


ఈ ఆలయం తి.తి.దే. వారి ఆధ్వర్యంలో పని చేస్తున్నది.


శివరాత్రి పండుగ మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


తెలుగునాట వున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది వుండటం విశేషం. 


హరిహరులకు ఏ బేధం లేదని నిరూపిస్తూ నిలచిన ఈ తీర్థ రాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో వుంది.


శేషాచల పర్వతపాదాన వున్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు, యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు.


కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్రతీర్థంలో నిలచినట్లు స్థలపురాణం చెబుతోంది.


కపిలుని తపస్సుకు మెచ్చి నిలచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు.


కామాక్షీ సమేతుడై నిలచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు.


తిరుమల గిరుల నుంచి గల గల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25అడుగుల ఎత్తు నుంచి ఆలయపుష్కరిణిలోకి దూకే ఆకాశ గంగ శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు.


ఇప్పుడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెపుతారు.

అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.


వైష్ణవతీర్థం విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.


విజయనగర పరిపాలన చివరిరోజుల్లో అక్కడ్నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసమేర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్టగావించిందని చెబుతారు.


ఈ ఆలయప్రాంగణంలో కపిలేశ్వరస్వామితో పాటు, కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వ రుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు కూడాకొలువై వున్నారు.


తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం ‘కపిల తీర్ధం.’ ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశంలో ఉంది.


ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.


తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, పాపవినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది.


ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.


విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.

సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.


పుణ్య స్నానం ఇక్కడి తీర్థంలో ఆచరించిన వారి పాపాలు పటాపంచలౌతాయని భక్తుల విశ్వాసం.


విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.✍️

ఓం శివాయ నమః

ఓం నమో  వేంకటేశాయ !!

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


Read More

అష్టైశ్వర్యాలు:- --------------------------------- అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి

అష్టైశ్వర్యాలు:- 

---------------------------------

 అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి 


👉 సూక్ష్మరూపం ధరించగలగడం అణిమ.

👉 గొప్ప రూపం ధరించడం మహిమ.

👉 తేలికగా అయిపోవడం లఘిమ.

👉 బరువుగా అయిపోవడం గరిమ.


👉 పొందవలసిన వాటిని పొందడమే ప్రాప్తి.

👉 విశేషమైన కోరిక తీరడమే ప్రకామ్య.

👉 అందరి మీద పరిపాలనా శక్తి ఈశత్వ.

👉 అందరినీ వశపరచుకోవడం వశిత్వ.


 మొదటి నాలుగు.... అణిమ, మహిమ, గరిమ, లఘిమ .. ఇవి ధ్యానంలోంచి లభ్యమవుతాయి.


 చివరి నాలుగు ... ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ... ఇవి బ్రహ్మ జ్ఞానంలోంచి లభ్యమవుతాయి.

Read More

🌼శ్రీరామాష్టకం🌼

🌼శ్రీరామాష్టకం🌼 


భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |

స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్  ౧ 


జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |

స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్  ౨ 


నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |

సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్  ౩ 


సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |

నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్  ౪ 


నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |

చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్  ౫ 


భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |

గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్  ౬ 


మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |

పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్  ౭ 


శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |

విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్  ౮ 


రామాష్టకం పఠతి యస్సుఖదం సుపుణ్యం

వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః |

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం

సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్🙏🍒


Read More

🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯

  🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯


ఓం మంగళం దేవదేవాయ రాజరాజాయ మంగళం

మంగళం నాథనాథాయ కాలకాలాయ మంగళం. || 1 ||


మంగళం కార్తికేయాయ గంగాపుత్రాయ మంగళం

మంగళం జిష్ణుజేశాయ వల్లీనాథాయ మంగళం. || 2 ||


మంగళం శంభుపుత్రాయ జయంతీశాయ మంగళం

మంగళం సుకుమారాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. || 3 ||


మంగళం తారకజితే గణనాథాయ మంగళం

మంగళం శక్తిహస్తాయ వహ్నిజాతాయ మంగళం. || 4 ||


మంగళం బాహులేయాయ మహాసేనాయ మంగళం

మంగళం స్వామినాథాయ మంగళం శరజన్మనే. || 5 ||


అష్టనేత్రపురీశాయ షణ్ముఖాయాస్తు మంగళం

కమలాసనవాగీశ వరదాయాస్తు మంగళం. || 6 ||


శ్రీ గౌరీగర్భజాతాయ శ్రీకంఠ తనయాయచ

శ్రీ కాంత భాగినేయాయ శ్రీ మత్ స్కందాయ మంగళం. || 7 ||


శ్రీ వల్లీ రమణాపాద శ్రీ కుమారాయ మంగళం

శ్రీ దేవసేనా కాంతాయ శ్రీ విశాఖాయ మంగళం. || 8 ||


మంగళం పుణ్యరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం

మంగళం పుణ్యయశసే మంగళం పుణ్యతేజసే. || 9 ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం సంపూర్ణం.


శుభ శుభోదయం


Read More

Powered By Blogger | Template Created By Lord HTML