.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

13, సెప్టెంబర్ 2025, శనివారం

కుండలిని

 *కుండలిని:-*


*1. మూలాధారచక్రం* : 

☸️☸️☸️☸️☸️☸️☸️

మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.


2. *స్వాధిష్ఠాన చక్రం* : 


ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.


3. *మణిపూరక చక్రం* : 


బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.


4. *అనాహత చక్రం* : 


ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.


5. *విశుద్ధచక్రం* : 


ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.


6. *ఆజ్ఞాచక్రం* : 


ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.


7. *సహస్రారం* : 


ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

A Best Collection from Brahmana Samaakya.

=============||==============

Read More

శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏

 శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏


నమస్తే త్రిజగద్వన్ద్యే సంగ్రామే జయదాయిని ।

ప్రసీద విజయం దేహి కాత్యాయని నమోఽస్తుతే ॥


“మూడులోకాలచే పూజింపబడే కాత్యాయనీ దేవీ!

నీకు నా నమస్కారము,

యుద్ధరంగం లో నాకు విజయాన్ని ప్రసాదించు.


సర్వశక్తిమయే దుష్టరిపునిగ్రహకారిణి|

దుష్టజృమ్భిణి సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్తమైన శక్తుల రూపంలో నిండిన ఓ దేవీ!

నీకు నా నమస్కారములు.”

దుష్టులైన శత్రువులను సంహరించు, యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


త్వమేకా పరమాశక్తిః సర్వభూతేష్వవస్థితా|

దుష్టాన్సంహర సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్త భూతాలలో వ్యాపించి ఉన్న “ఓ పరమశక్తి నీకు నా నమస్కారం.”

యుద్ధ రంగములో దుష్టులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించుము.


రణప్రియే రక్తభక్షే మాంసభక్షణకారిణి।

ప్రపన్నార్తిహరే యుద్ధే జయందేహి నమోఽస్తుతే॥


రక్తమాంసాలను భుజించే భయానకరూపిణి! 

ఓ రణప్రియ! నీకు నా నమస్కారం.”

నిన్ను శరణుజొచ్చిన వారి కష్టాలను తొలగించు.

యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఖట్వాంగాసికరే ముండమాలాద్యోతితవిగ్రహే ।

యే త్వాం స్మరన్తి దుర్గేషు తేషాం దుఃఖహరా భవ ॥


చేతులలో ఖట్వాంగం (మృత్యుదండం) మరియు ఖడ్గం పట్టినదానవు, మెడలో కపాల మాలలతో ప్రకాశించే దివ్య స్వరూపిణివి. కష్ట సమయాల లోను, ప్రమాదపు అంచుల లోను నిన్ను స్మరించే వారి యొక్క దుఃఖాలను తొలగించు.”


త్వత్పాదపంకజాద్దైన్యం నమస్తే శరణప్రియే|

వినాశాయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


శరణాగతులను రక్షించుట యందు ఆసక్తికల ఓ దేవి , నీ పాద పద్మములను ధ్యానించి నమస్కరిస్తున్నాను నా శత్రువులను నశింపచేసి నాకు విజయాన్ని ప్రసాదించు.”


చిన్త్యవిక్రమేఽచిన్త్యరూపసౌన్దర్యశాలినీ ।

అచిన్త్యచరితేఽచిన్త్యే జయందేహి నమోఽస్తుతే॥


ఓ అచిన్త్యశక్తి! నీకు నా నమస్కారం.”ఆలోచించలేనంత మహావిక్రమం కలిగిన దానవు, మనస్సు తో ఊహించని నిగూఢ కార్యములు చేయు దానవు వర్ణించలేనంత సౌందర్యరూపిణివి , యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


యే త్వాం స్మరన్తి దుర్గేషు దేవీం దుర్గవినాశినీమ్ ।

నావసీదన్తి దుర్గేషు జయం దేహి నమోఽస్తుతే ॥


దుర్గవినాశినీ దేవీ! నీకు నమస్కారం.

కష్ట సమయాలలో నిన్ను స్మరించే వారు ఎన్నడూ కృశించరు. వారికి ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదించు.


మహిషాసృక్ప్రియే సంగ్యే మహిషాసురమర్దినీ ।

శరణ్యే గిరికన్యే మే జయం దేహి నమోఽస్తుతే ॥


మహిషాసురమర్దినివి , శరణాగతులకు ఆశ్రయమైన దానవు హిమగిరికుమార్తె అయిన ఓ పార్వతీ దేవి నీకు నమస్కారం.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ప్రసన్నవదనే చణ్డి చణ్డాసురవిమర్దినీ ।

సంగ్రామే విజయం దేహి శత్రూన్ జహి నమోఽస్తుతే ॥


ప్రసన్నమైన వదనముగల దానవు , చండాసురుని సంహరించిన దానవు అయిన ఓ చండికా దేవి నీకు నమస్కారం !

నా శత్రువులను జయించి యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


రక్తాక్షి రక్తదశనే రక్తచర్చితగాత్రకే ।

రక్తబీజనిహన్త్రీ త్వం జయందేహి నమోఽస్తుతే॥


ఎరుపు కళ్ళుగల దానవు 

ఎరుపు పళ్ళుగల దానవు 

 రక్తముతో అలంకరింపబడిన శరీరముగల దానవు 

రక్తబీజాసురుని సంహరించినవు అయిన దేవీ నాకు యుద్ధంలో విజయాన్ని ప్రసాదించు. 


నిశుమ్భశుమ్భసంహన్త్రి విశ్వకర్త్రి సురేశ్వరి ।

జహి శత్రూన్ రణే నిత్యం జయందేహి నమోఽస్తుతే॥


“ఓ సురేశ్వరి! నిశుంబుడు, శుంబుడను అను దుష్టులను సంహరించిన దేవీ!

జగత్తు నకు సృష్టికర్తవు నీవే. యుద్ధంలో నా శత్రువులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


భవాన్యేతత్సర్వమేవ త్వం పాలయసి సర్వదా ।

రక్ష విశ్వమిదం మాతర్హత్వైతాన్ దుష్టరాక్షసాన్॥


“ఓ భవాని! ఈ జగత్తు నంతా ఎల్లప్పుడూ నీవే పాలిస్తున్నావు.

మాతా! 

ఈ దుష్టరాక్షసులను సంహరించి మా విశ్వాన్ని రక్షించు.”


త్వం హి సర్వగతా శక్తిర్దుష్టమర్దనకారిణి ।

ప్రసీద జగతాం మాతర్జయం దేహి నమోఽస్తుతే ॥


 నీవు సర్వవ్యాపక శక్తివి, దుష్టులను సంహరించే దానవు, జగన్మాతా 

నీకు నమస్కారము 

కరుణించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


దుర్వృత్తవృన్దదమిని సద్వృత్తపరిపాలినీ ।

నిపాతయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


దుర్మార్గులను అణచివేసి దుష్టశక్తులను నశింపజేసి ఆపదల నుండి కాపాడి సద్గుణులను రక్షించే తల్లి”నీకు నమస్కారం 

నా శత్రువులను నశింపజేసి నాకు విజయాన్ని ప్రసాదించు. 


కాత్యాయని జగన్మాతః ప్రపన్నార్తిహరే శివే ।

సంగ్రామే విజయం దేహి భయేభ్యః పాహి సర్వదా ॥


“ఓ జగన్మాతా కాత్యాయనీ! శరణాగతుల యొక్క కష్టాలను తొలగించే శివస్వరూపిణి!

అన్ని భయాలనుండి ఎల్లప్పుడూ రక్షించు.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే శ్రీరామకృతా కాత్యాయనీస్తుతిః॥

సేకరణ

Read More

అంతర్వేది లక్ష్మీ నృసింహుడు*

 *అంతర్వేది లక్ష్మీ నృసింహుడు* 


విష్ణుమూర్తి అవతారాల్లో నృసింహ అవతారం విభిన్నమైనదే కాదు విశిష్టమైనది కూడా, సింగం మనిషి, సంగం మృగర కలిసిన అవతారం కనుక ఈ అవతారం అపురూపమైనది కూడా. భక్తుని కోసం విభిన్నమైన అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తుని నమ్మకాన్ని నిజం చేసిన స్వామికి అంతర్వేది కూడా ఓ వేదికయింది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీనరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.


అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కోవెల భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం ప్రస్థావన పురాణాలలో కూడా ఉంది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు. ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.


సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరం పొందుతాడు.


ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి కింద పడిన రక్తపు బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవిస్తారు. ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే వారిని, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరించాడు. వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తావలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడని ప్రతీతి.


ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్టాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు శిలా శాసనాలవల్ల తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జనుడు తీర్థయాత్రలు చేస్తూ 'అంతర్వేది' దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన 'విజయయ విలాసము'లో, శ్రీనాధ కవిసార్వభౌముడు 'హరి విలాసం'లో రచించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం 300 ఏళ్ళకు పూర్వం నిర్మంచినట్టు తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం శిథిలమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది.

Read More

శ్రీప్రత్యంగిరా_దేవి

 #శ్రీప్రత్యంగిరా_దేవి

శ్రీ ప్రత్యంగిరా దేవి రావణుని వంశ కుల దైవం.


ప్రత్యంగిరా దేవి కాళీ దేవి యొక్క ఉగ్ర రూపం. శరభ మరియు గండభేరుండ అవతారల మధ్య భీకర యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. వారి యుద్ధం కారణంగా మూడు లోకాలలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అప్పుడు మాత ఆదిశక్తి, విశ్వ క్షేమమే ధ్యేయంగా, సింహం వంటి ముఖం ఉన్న భీకర అవతారాన్ని ధరించింది. ఇందులో శివుని శరభ అవతారం, విష్ణువు యొక్క రెండు అవతారాలు (నరసింహ మరియు గండభేరుండ) శక్తులు ఉన్నాయి. ఈ రూపం చాలా విస్తృతమైనది, అతని ముందు విశ్వం చాలా సూక్ష్మంగా ఉంది. ప్రత్యంగిర యొక్క ఉగ్ర రూపాన్ని ధరించి, తల్లి ఆదిశక్తి శరభ మరియు గండభేరుండ అవతారం వద్దకు వెళ్లి పెద్దగా చప్పుడు చేసింది. వారిద్దరూ యుద్ధాన్ని ఆపి, వారి అసలు అవతారలకు తిరిగి వచ్చారు. ఆ విధంగా మాత ఆదిశక్తి శివుడు మరియు విష్ణువు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికింది. ఆమె రావణుడి వంశ దేవత కూడా. అక్కడ అమ్మవారిని నికుంబలా అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మాతా ప్రత్యంగిర గురించి చాలా తక్కువగా తెలుసు. దక్షిణాదిలో ఉపంగిర అమ్మల్ 

అని కూడా పిలుస్తారు.. ప్రత్యంగిరాను ఎక్కువగా పూజిస్తారు. అక్కడ చాలా దేవత ఆలయాలు ఉన్నాయి. ప్రత్యంగిర అనే పదం రెండు పదాల కలయిక. ఏ రకమైన దాడి / తంత్రం / చేతబడిని తిప్పికొట్టడం అంటే, తల్లి ప్రత్యంగిరాను పూజించడం ద్వారా, ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం, చేతబడి మొదలైనవి తొలగించబడతాయి.

Read More

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది..?*🙏

 *పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది..?*🙏


 *స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్ - గరుడ పురాణం*🙏🙏🙏


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. 


కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులోచెబుతున్నాడు.


*"ప్రేత రూపం విడిపించని కులాన్ని ( కులం = వంశం ) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు.*


శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. 


ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


*ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి పితృ దేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*🙏🙏🙏 


ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. 


*ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.*


తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు నైనా చేసి తీరాలి.


*శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ మహాలయ పక్షం పదిహేను  చేయలేని వారు కనీసం  మహాలయ అమావాస్య తిథి నాడు తర్పణం శ్రాద్ధం చేసి తీరాలి.*🙏🙏🙏


🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️

Read More

మానవ శరీరంలోని వివిధ అవయవాలకు అధిష్టాన దేవతలు,

 మానవ శరీరంలోని వివిధ అవయవాలకు అధిష్టాన దేవతలు, కొన్ని ముఖ్యమైన అవయవాలు, వాటికి సంబంధించిన దేవతలు..


గుండె: విష్ణువు


మెదడు: బ్రహ్మ


కళ్ళు: సూర్యుడు


చెవులు: దిక్కులు


చేతులు: ఇంద్రుడు


పాదాలు: విష్ణువు


పొట్ట: అగ్నిదేవుడు


మూత్రపిండాలు: వరుణుడు


శ్వాసకోశాలు: వాయువు


చర్మం: చంద్రుడు, భూమి


జ్ఞానేంద్రియాలు: బ్రహ్మ మరియు ఇతర దేవతలు


సప్త మాతృకలు శరీరం లో సప్త ధాతువులు కి మరియు 27నక్షత్రాలు వారికి యోగిని ఇవ్వడానికి ఉంటారు...

డైలీ 7 సార్లు సప్త మాతృకలు స్తోత్రం చదవడం వల్ల జాతకం లో ఉన్న యోగాలు దోషాలు వల్ల పని చేయక పోతే పని చేసేలాగా చేస్తారు...

Read More

మణిద్వీపవర్ణన

 మణిద్వీపవర్ణన

         


మహాశక్తి మణిద్వీప నివాసినీ

ముల్లోకాలకు మూలప్రకాశినీ |

మణిద్వీపములో మంత్రరూపిణీ

మన మనసులలో కొలువైయుంది || ౧ ||


సుగంధ పుష్పాలెన్నో వేలు

అనంత సుందర సువర్ణ పూలు |

అచంచలంబగు మనో సుఖాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨ ||


లక్షల లక్షల లావణ్యాలు

అక్షర లక్షల వాక్సంపదలు |

లక్షల లక్షల లక్ష్మీపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౩ ||


పారిజాతవన సౌగంధాలు

సూరాధినాధుల సత్సంగాలు |

గంధర్వాదుల గానస్వరాలు

మణిద్వీపానికి మహానిధులు || ౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


పద్మరాగములు సువర్ణమణులు

పది ఆమడల పొడవున గలవు |

మధుర మధురమగు చందనసుధలు

మణిద్వీపానికి మహానిధులు || ౫ ||


అరువది నాలుగు కళామతల్లులు

వరాలనొసగే పదారు శక్తులు |

పరివారముతో పంచబ్రహ్మలు

మణిద్వీపానికి మహానిధులు || ౬ ||


అష్టసిద్ధులు నవనవనిధులు

అష్టదిక్కులు దిక్పాలకులు |

సృష్టికర్తలు సురలోకాలు

మణిద్వీపానికి మహానిధులు || ౭ ||


కోటిసూర్యుల ప్రచండ కాంతులు

కోటిచంద్రుల చల్లని వెలుగులు |

కోటితారకల వెలుగు జిలుగులు

మణిద్వీపానికి మహానిధులు || ౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కంచు గోడల ప్రాకారాలు

రాగి గోడల చతురస్రాలు |

ఏడామడల రత్నరాశులు

మణిద్వీపానికి మహానిధులు || ౯ ||


పంచామృతమయ సరోవరాలు

పంచలోహమయ ప్రాకారాలు |

ప్రపంచమేలే ప్రజాధిపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౦ ||


ఇంద్రనీలమణి ఆభరణాలు

వజ్రపుకోటలు వైఢూర్యాలు |

పుష్యరాగమణి ప్రాకారాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౧ ||


సప్తకోటిఘన మంత్రవిద్యలు

సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు |

శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౨ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మిలమిలలాడే ముత్యపు రాశులు

తళతళలాడే చంద్రకాంతములు |

విద్యుల్లతలు మరకతమణులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౩ ||


కుబేర ఇంద్ర వరుణ దేవులు

శుభాల నొసగే అగ్నివాయువులు |

భూమి గణపతి పరివారములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౪ ||


భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు

పంచభూతములు పంచశక్తులు |

సప్తఋషులు నవగ్రహాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౫ ||


కస్తూరి మల్లిక కుందవనాలు

సూర్యకాంతి శిల మహాగ్రహాలు |

ఆరు ఋతువులు చతుర్వేదాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౬ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మంత్రిణి దండిని శక్తిసేనలు

కాళి కరాళీ సేనాపతులు |

ముప్పదిరెండు మహాశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౭ ||


సువర్ణ రజిత సుందరగిరులు

అనంగదేవి పరిచారికలు |

గోమేధికమణి నిర్మితగుహలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౮ ||


సప్తసముద్రములనంత నిధులు

యక్ష కిన్నెర కింపురుషాదులు |

నానాజగములు నదీనదములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౯ ||


మానవ మాధవ దేవగణములు

కామధేనువు కల్పతరువులు |

సృష్టి స్థితి లయ కారణమూర్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౦ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కోటి ప్రకృతుల సౌందర్యాలు

సకల వేదములు ఉపనిషత్తులు |

పదారురేకుల పద్మశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౧ ||


దివ్యఫలములు దివ్యాస్త్రములు

దివ్యపురుషులు ధీరమాతలు |

దివ్యజగములు దివ్యశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౨ ||


శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు

జ్ఞానముక్తి ఏకాంత భవనములు |

మణినిర్మితమగు మండపాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౩ ||


పంచభూతములు యాజమాన్యాలు

ప్రవాళసాలం అనేక శక్తులు |

సంతానవృక్ష సముదాయాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


చింతామణులు నవరత్నాలు

నూరామడల వజ్రపురాశులు |

వసంతవనములు గరుడపచ్చలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౫ ||


దుఃఖము తెలియని దేవీసేనలు

నటనాట్యాలు సంగీతాలు |

ధనకనకాలు పురుషార్ధాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౬ ||


పదునాలుగు లోకాలన్నిటి పైన

సర్వలోకమను లోకము కలదు |

సర్వలోకమే ఈ మణిద్వీపము

సర్వేశ్వరికది శాశ్వత స్థానం || ౨౭ ||


చింతామణుల మందిరమందు

పంచబ్రహ్మల మంచముపైన |

మహాదేవుడు భువనేశ్వరితో

నివసిస్తాడు మణిద్వీపములో || ౨౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మణిగణఖచిత ఆభరణాలు

చింతామణి పరమేశ్వరిదాల్చి |

సౌందర్యానికి సౌందర్యముగా

అగుపడుతుంది మణిద్వీపములో || ౨౯ ||


పరదేవతను నిత్యముకొలచి

మనసర్పించి అర్చించినచో |

అపారధనము సంపదలిచ్చి

మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||


నూతన గృహములు కట్టినవారు

మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |

చదివిన చాలు అంతా శుభమే

అష్టసంపదల తులతూగేరు || ౩౧ ||


శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి

మణిద్వీప వర్ణన చదివిన చోట |

తిష్టవేసుకుని కూర్చొనునంట

కోటిశుభాలను సమకూర్చుటకై || ౩౨ ||

 

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము

Read More

ఆయాఅద్భుతమైన దేవాలయాలజాబితా.!

 @ ఓం శ్రీ మాత్రే నమః @


.ఆయాఅద్భుతమైన దేవాలయాలజాబితా.!

 1.తిరుపరకుంద్రం

 2.తిరుచెందూర్

 3.పళని

 4.స్వామిమలై

 5.తిరుత్తని

 6.సోలైమలై(పాలముధిచోలై)

 7.మారుధమలై

 8.వడపళని(చెన్నై)

 9.వైదీశ్వరన్ కోవిల్ ముత్తుకుమారసామి

 10.నాగపట్నం సిక్కల్

 11.త్రిచి వయలూర్

 12.ఈరోడ్ సెన్నిమలై

 13.గోపి పచమలై

 14.కరూర్ వెన్నైమలై

 15.కర్ణాటకకుక్కేసుబ్రమణ్యఆలయం

 16.కర్ణాటకఘాటిసుబ్రమణ్యఆలయం

 17.కేరళహరిపాడ్ ఆలయం

Read More

అభిషేక_మహిమలు

 *అభిషేక_మహిమలు*


*గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలాలు పొందవచ్చో చెప్పబడినది.....!!*


రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం,మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.


వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ,రాజ్యాన్ని పొందవచ్చు.


స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.


నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.


యవగోదూమశాలిజలింగం అనగా 

జొన్నలు,గోధుమలు,బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది,ధనం వర్ధిల్లుతుంది.


సీతాఖండలింగం- పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.


తిలపిష్టలింగం- నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.


భస్మలింగం- భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.


గుడలింగం- బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.


వంశాంకురలింగం- వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.


పిష్ఠలింగం- పిండిలింగం విద్యాప్రదం.


దధిదుగ్ధలింగం-పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద,సుఖం వస్తాయి.


ధాన్యలింగం-ధాన్యప్రదం.


ధాత్రీలింగం-ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.


ఫలలింగం-ఫలప్రదం.


నవనీత(వెన్న)లింగం-కీర్తి,సౌభాగ్యకరం.

దూర్వాకుండజ(గరిక)లింగం-అపమృత్యునివారకం.


కర్పూరలింగం- ముక్తిప్రదం.


అయస్కాంతలింగం-అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.


మౌకికలింగం-ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.


సువర్ణలింగం-బంగారు లింగం మహాముక్తిప్రదం.


రజతలింగం- వెండిలింగం సంపత్కరం.


పిత్తలలింగం- కాంస్యలింగం(ఇత్తడి,కంచు లింగాలు)ముక్తినిస్తాయి.


త్రపులింగం- ఆయసలింగం,


సీసలింగం(తగరం,తుత్తం,ఇనుము) శతృనాశకాలు.


అష్టధాతులింగం- సర్వసిద్ధిప్రదం.


అష్టలోహలింగం- కుష్ఠు వ్యాధిహరం.


వైఢూర్యలింగం- శతృగర్వ నివారకం.


స్ఫటికలింగం-సర్వకామప్రదం.


పాదరసలింగం- మహైశ్వర్యప్రదం.

రాగి,సీసం,శంఖం,ఇనుము,గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.

లింగపూజ పార్వతీపరమేశ్వరుల పూజ.

Read More

ద్వాదశ రాశుల అబీష్ట సిద్ధి కోసం 🌺🕉️

 🕉️🌺ద్వాదశ రాశుల అబీష్ట సిద్ధి కోసం 🌺🕉️


🕉️మేష రాశి  వారికి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన తల్లి నామం


ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్దా పరమేశ్వరి

మూల ప్రకృతి రావ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ !!

చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా !

గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా!!

సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా!

సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ!!

నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ !!


మేష రాశి వారు ఎవరైనా కావచ్చు లలితా నామం లోని ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల సర్వ శుభాలు కలుగుతుంది.. మీకు ఇన్ని ఆటంకాలు తొలగి క్షేమంగా ఉంటారు ఈ రాసి వారికి ఇది అభిష్టసిద్ది మంత్రం....


*****************

🕉️వృషభ రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితానామం .


ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా

వరదావామనయనా వారుణీ మదవిహ్వాలా !!

కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ!

సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా!!

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ!

సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ!!

కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే!

వృతప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోస్తుతే!!


ఇది మీకు సకల కార్యములో విజయము కలిగించే అమ్మ నామం నమ్మకంతో జపించండి..

*********************

🕉️మిథున రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా!

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా!!

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా!

అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా!!

సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా!

కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ!!

యదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః!!


ఇది మిధున రాశి వారికి అన్నిటా శుభాన్ని కలిగించే మంత్రం నిత్యం జపించవలసిన తల్లి నామం.


********************

🕉️కర్కాటక రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన  లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం విదాత్ర్యైనమః

బాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా!

రోగపర్వతదంభోళి ర్మ్రుత్యుదారుకుఠారికా!!

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రరూపిణీ!

భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రపర్తినీ!!

పంచమి పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ!

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ!!

లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్ఠి స్వధే ధ్రువే!

మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తతే


ఇది కర్కాటక రాశి వారికి అన్నిటా అనుకూలమైన మంత్రం నమ్మకము గా జపించి అమ్మవారి అనుగ్రహము పొందండి.


************************

🕉️సింహ రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా!!

ధర్మాధరా ధనాధ్యక్షా ధనధాన్య వివర్థినీ!

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ!!

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ!

సుమంగళీ సుఖకరీ సువేషాడ్యా సువాసినీ!!

మేధే సరస్వతీ వారే భూతి భాభ్రవి తామసి!

నియతే త్వం ప్రసీదే నారాయణి నమోస్తుతే


ఇది ఈ రాసి వారికి సకల కార్య సిద్ది మంత్రం నిత్యం జపించుకోవడం వల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది.


*********************

🕉️కన్యరాశి  వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితా నామం..


ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వరై నమః

భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ!

పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ!!

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా!

రంజనీ రమణీ రస్యా రణత్మింకిణీమేఖలా!!

వజ్రేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ!!

సర్వస్య బుద్ధిరూపేణ జ్ఞానస్య హృది సంస్థితే!

స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే!!


ఇది ఈ రాశి వారికి అన్నిటా శుభాన్ని కలిగించే అమ్మ నామం..

*****************


🕉️తులా రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితానామం


ఓం ఐం హ్రీం శ్రీం సిద్దేశ్వర్యై నమః

అనాహతాబ్జనిలయా శ్యామభా వదనద్వయా!

దంష్ట్రోజ్వలా క్షమాలాదిధరా రుధిరసంస్థితా!!

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా!

మహానీయా దయామూర్తి సామ్రాజ్యశాలినీ !!

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా!

యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరా!!

ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్!

పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే!!


ఇది ఈ రాశి వారందరూ జపించవలసిన తల్లి నామం.

******************


🕉️వృశ్చిక రాశి వారి అభీష్టసిద్ది మంత్రం  జపించ వలసిన లలితా నామం


ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమః

కదంబమంజరీక్లుప్త కర్ణపూర్ణమనోహరా!

తాటంకయుగళీభూత తపనోడుపమండలా!!

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ!

సుదాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ!!

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా!

నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా!!

సృష్టిస్థితి వినాశనాం శక్తిభూతే సనాతని!

గణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే!!


ఈ నామం ఈ రాశి వారికి అన్ని బాధలు దూరం చేసి సకల శుభాలను కలిగిస్తుంది.


*************

🕉️ధనస్సు రాశి వారి అభిష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమః

ఆరుణారుణకౌసుంభవస్త్ర బాస్వత్కటీతటీ!

రత్నకింకిణికారంయ్యరశనాదామభూషితా!!

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ!

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ!!

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా!

సర్వేశ్వరీ సర్వమాయీ సర్వమంత్రస్వరూపిణీ!!

శరణాగత దీనార్తపరిత్రాణ పరాయణే!

సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే!!


ఈ రాశి వారికి సకల జయాలను కలిగించే తల్లి నామం.

****************


🕉️మకర రాశి వారి అభీష్ట సిద్ది మంత్రం జపించ వలసిన లలితానామం


ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమః

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా!

మహాబుద్ది ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ!!

శృతిసీమంతసింధూరీ కృతపాదాబ్జధూళికా!

సకలాగమసందోహశుక్తి సంపుటమౌక్తికా!!

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా!

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమన్డలవాసినీ!!

యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః


ఇది ఈ రాశి వారికి సకల శుభాలను కలిగించే తల్లి నామం.

****************


🕉️కుంభరాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం శుభాకర్యై నమః

నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా!

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా!!

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా!

నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామానిరుపప్లవా!!

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా!

పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా!!

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే!

భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గేదేవి నమోస్తుతే!!


ఈ రాశి వారికి సకల శుభాలను కలిగించే తల్లి నామం.

************

🕉️మీనరాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం..


ఓం ఐం హ్రీం శ్రీం సుధాసృత్యై నమః

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా!

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా!!

మహేశ్వరమహాకల్ప మహాతాండవసాక్షిణీ!

మహాకామేశమహిషీ మహాత్రిపుర సుందరీ!!

సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ!

స్వాహా స్వదా మతి ర్మేధా శృతిః స్మృతి రనుత్తమా!!


ఈ రాశి వారందరికీ శుభాలను కలిగించే తల్లి నామాన్ని అంత వరకైనా రోజు జపం చేసుకోండి 


🌹🙏శక్తి ఆరాధన శ్రీ చక్ర ఉపాసన.🙏🌹

Read More

గ్రహం సంచార సమయంలో సాధారణ ఫలితాలు:

 *ASTROWAYS* 


జ్యోతిషశాస్త్ర ప్రామాణిక పుస్తకాలలో పేర్కొన్న విధంగా, ప్రతి గ్రహం వేర్వేరు భావాల్లో  అంటే గ్రహం సంచార సమయంలో సాధారణ ఫలితాలు:


రవి సంచారము


జన్మరాశి నుండి 3వ, 6వ, 10వ మరియు 11వ భావాల్లో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు అనుకూలంగా ఉంటాడు.


చంద్రుని సంచారము


జన్మరాశి నుండి 1, 3, 6, 7, 10 మరియు 11వ  భావాల్లో చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు.


కుజ సంచారము


జన్మరాశి నుండి 3వ, 6వ మరియు 11వ భావాల్లో కుజుడు ప్రయాణిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. 


బుధ సంచారము


జన్మరాశి నుండి 2వ, 4వ, 6వ, 8వ, 10వ మరియు 11వ భావాల్లో బుధుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు.


బృహస్పతి లేదా గురు సంచారము


బృహస్పతి నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి, సంచార సమయంలో  బృహస్పతి  చాలా ముఖ్యమైనది. జన్మరాశి నుండి 2వ, 5వ, 7వ, 9వ మరియు 11వ భావాల్లో అనుకూలంగా ఉంటాడు.


శుక్ర సంచారము


జన్మరాశి నుండి 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 8వ, 9వ, 10వ, 11వ మరియు 12వ భావాల్లో శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.


శని సంచారము


శని తన సంచార సమయంలో 3వ, 6వ మరియు 11వ భావాల గుండా వెళ్ళినప్పుడు ప్రయోజనకరంగా ఉంటాడు. ఇతర ఇళ్ళు అతనికి ప్రతికూలంగా ఉంటాయి. శని సంచార సమయంలో చంద్రుని నుండి 7వ, 8వ మరియు 12వ భావాల్లో చాలా ప్రతికూలంగా ఉంటాడు. జన్మరాశి నుండి అష్టమ స్థానం మృత్యు-స్థానం. ఒక సామాన్యుడు కూడా తన జన్మ జాతకంలో ' అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు భయపడతాడు .


జన్మరాశి నుండి 12వ, 1వ మరియు 2వ గృహాల ద్వారా శని సంచారం చాలా అననుకూలమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఈ మూడు గృహాల ద్వారా శని సంచారాన్ని శని 'సాడే సతి' అంటారు అంటే శని  12వ  నుండి 2వ స్థానం వరకు సంచరించడానికి అనగా ఈ మూడు రాశులను అధిగమించడానికి 7 & 1/2 సంవత్సరాలు పడుతుంది - శని ఒక రాశి గుండా తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సగటున 2 & 1/2 సంవత్సరాలు పడుతుంది.


అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు శని యొక్క 'సాడే శతి' అపఖ్యాతి  దుష్ఫలితాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా ఈ 'సాడే శతి' మనిషి జీవితంలో మూడు సార్లు సంభవించవచ్చు. మొదటిసారీ జాతకుడు వయస్సులో చిన్నవాడు మరియు 'సాడే శతి' వల్ల కలిగే చెడు ప్రభావాలు జాతకుడికి పెద్దగా హాని కలిగించకపోవచ్చు కానీ అతని తల్లిదండ్రులు దుష్ప్రభావాలను అనుభవించవచ్చు మరియు వారి గృహ వాతావరణం ఆరోగ్యంగా మరియు సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. 'సాడే శతి' రెండవసారీ జాతకుడు మధ్య వయస్కుడిగా ఉన్నప్పుడు జరుగుతుంది మరియు రెండవ సారీ శని సంచారం యొక్క ప్రభావం అతని ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు  వృత్తికి సంబంధించి చాలా హానికరంగా ఉంటుంది.


మూడవసారీ జాతకుడికి దాదాపు 90 సంవత్సరాలు నిండుతాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఆ వయస్సు వరకు జీవిస్తారు. అయితే, శని 'సాడే సాతి' మూడవసారీ జాతకుడు తీవ్రమైన అనారోగ్యం,  ఆందోళనలతో బాధపడుతుంటాడు, ఇది జాతుడి మరణానికి కూడా కారణం కావచ్చు.


రాహు & కేతువుల సంచారాలు


సాధారణంగా  రాహువు శని మాదిరిగానే ఫలితాలను ఇస్తారని మరియు కేతువు ఫలితాలు కుజుడు మాదిరిగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. కానీ జన్మరాశి నుండి 10వ ఇంట్లో రాహువు సంచారం వల్ల జాతకుడికి ఆర్థిక లాభం పుష్కలంగా లభిస్తుందని కూడా వారు అంటున్నారు. అయితే, రాహు & కేతు సంచార ఫలితాలను రాసి చక్రంలో ఈ గ్రహాల స్థితి ఆధారంగా అంచనా వేయాలి.l

Read More

మరణం తర్వాత ఆత్మ సైజ్ ఎంత.?*

 *మరణం తర్వాత ఆత్మ సైజ్ ఎంత.?*


*మనిషి మరణించాక శరీరం వదిలి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడడు, రోదిస్తూ ఉంటాడు, భార్య బిడ్డలపై ప్రేమ, తల్లి తండ్రి పై ప్రేమ, స్నేహితుల పై ప్రేమ, డబ్బు పై ప్రేమ, జ్యూదం పై ప్రేమ, కామం పై ప్రేమ, ఒకడి నాశనం పై ప్రేమ, ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోదిస్తూ ఉంటాడు జీవుడు...*


*కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు, అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ఠ మాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజ్ లో ఉంటుంది,*


*శరీరం నుండి వేరు పరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతం అంటారు, వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు, ఆత్మకు కాళ్ళు చేతులు ఆకారం ఉండదు, ఎలాంటి శక్తి ఉండదు...*


*అలా అంగుష్ట మాత్రం ఆకారంతో 12 రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది, ఇష్టమైనవారితో మాటాడాలని చూస్తూ* *ఉంటుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వింటుంది కానీ, ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు.*


*12 రోజులు కర్మలు చేయాలి, వాటినే ద్వాదశ కర్మలు అంటారు, పిండ కర్మలు, తిల తర్పణాలు, దానాలు ధర్మాలు, గరుడపురాణ పారాయణం, ఇవన్నీ ఖచ్చితంగా 12 రోజులు చేయాలి, గరుడపురాణంలో చెప్పినవిదంగాచేయాలి.*


*కానీ, కొందరు మూడురోజులకు కలిపి ఒకరోజు చేస్తారు, కొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు, ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది, ధ్వదస దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజ్ ఉన్న ఆత్మ అరచేయి సైజ్ కి పెరుగుతుంట, అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అంటారు.*


*దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పాప పుణ్యాల విశ్లేషణ చేస్తారు, చిన్న వెలుగులా కనిపించే యముడి ముందు, ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి, పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసి పోతారు, లేదా మళ్ళీ భూమ్మీద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు, చివరగా మనిషి జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు, దాన్నే గత జన్మ వాసన అంటారు.*


*ద్వాదశ కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు, దాన్నే పున్నామ నరకం అంటారు, పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు, పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయట పడక ఇక్కడే భాదపడుతూ కొన్నాళ్ళు తిరుగుతా ఉంటుంది,*


*ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది, అలా ఆత్మ చింతిస్తే అది పితృ దోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది, వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికీ శిక్షపడుతుంది, కాబట్టి ద్వాదశ కర్మలు గరుడ పురాణంలో చెప్పినమాదిరి శాస్త్రోక్తంగ చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లేల కర్మలు చేయండి.*


*అందుకే ఎవరైన వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి, అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట,*


*ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు. ఆత్మకు ఆడఆత్మ మగ ఆత్మ అని లింగ బేధం ఉండదు, కాబట్టి జీవుడు అంటారు, ఇక్కడ శాంతిగ ఉండటం ఏంటి.?*


*ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వ లోకాలకు వెళుతుంది అలా వెళ్లాలని మనం కోరుకోవాలి.*


*కానీ, ఆత్మకు శాంతి కలగాలి అనడం అర్థం లేనిదీ.*


*కాబట్టి... "సద్గతిప్రాప్తిరస్తు" అని చెప్పండి...*

Read More

దేవతానుగ్రహం కోసం చేసే అభిషేక ద్రవ్యవిశేషాలు వాటి ఫలములు

*దేవతానుగ్రహం కోసం చేసే అభిషేక ద్రవ్యవిశేషాలు 
వాటి ఫలములు*

*శ్రీ శివాభిషేక ద్రవ్యాలు వాటి ఫలములు*
*శ్రీ మహావిష్ణు అభిషేక ద్రవ్య ఫలాలు *

క్షీరేణ పూర్వం కుర్వీత దధ్నాపశ్చాద్ధృతేన చ | మధునా చాథఖండేన క్రమోజ్ఞేయో విచక్షణైః ॥

జ్ఞానవంతు లైన భక్తులు ముందుగా పాలతో,
 ఆతర్వాత పెరుగుతో, నెయ్యితో, ఆపై తేనెతో, చివరగా చక్కెరతో (చెరుకు రసం లేక బెల్లం పానకం తో ) అభిషేకం చేయాలి. 

*పంచామృత సమర్పణ ఫలం* 
క్షీరేణ క్షీయతేపాపం దధ్నా ధనవివర్ధనమ్ | ఘృతేనాయుష్కరం ప్రోక్తం మధునా హంతికిల్బిషమ్ | 
శర్కరా సర్వసిద్ధిస్స్యాత్ పంచామృత ఫలంస్మృతమ్ ||

సమస్త దేవతల అభిషేకాలలో పంచామృతాలు అభిషేక ఫలాలు  ఇలా ఉంటాయి గోక్షీరo వల్ల పాపాలు నశిస్తాయి. పెరుగుతో ధనం వృద్ధి చెందుతుంది. నెయ్యితో ఆయుష్షు పెరుగుతుంది. తేనెతో పాపాలు నశిస్తాయి. పంచదారతో అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అందువల్ల ప్రతీ పూజలలో ఇవి ప్రధానంగా చెప్పబడ్డాయి  ,మరికొన్ని విశేష ద్రవ్యాలు వాటి ఫలాలు తెలుసుకుందాం .

పయసా సర్వసౌఖ్యాని దధ్నారోగ్యం బలం యశః | ఆజ్యేనైశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కరాః ॥ తేజోవృద్ధిశ్చమధునా ధనమిక్షు రనేన వై | సర్వసంపత్సమృద్ధిశ్చ నారికేళజలేన చ ॥ మహాపాపాని నశ్యంతి తత్క్షణాద్భస్మ వారిణా । గన్ధతోయేన సత్పుత్ర లాభశ్చాత్ర న సంశయః ||
భూలాభః పుష్పతోయేన భాగ్యం బిల్వజలేన వై | దూర్వాజలేన లభతే నాన్యథా నష్ట సంపదః ||

ఆవుపాలు అన్ని సౌఖ్యాలను ఇస్తాయి, పెరుగు ఆరోగ్యం, బలం మరియు కీర్తిని ఇస్తుంది. నెయ్యి ఐశ్వర్యాన్ని, శర్కరా  దుఃఖాన్ని నాశనం చేస్తుంది. తేనె తేజస్సును పెంచుతుంది, చెరుకు రసం ధనాన్ని ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు సర్వసంపదలను పెంచుతాయి. భస్మం  కలిపిన నీరు గొప్ప పాపాలను తక్షణమే నాశనం చేస్తుంది, గంధపు నీటితో సత్పుత్రులు లభిస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు,పువ్వులు కలిపిన నీరు భూలాభాన్ని, మారేడు ఆకుల నీరు అదృష్టాన్ని ఇస్తుంది. గరిక నీటితో పోగొట్టుకున్న సంపద తిరిగి లభిస్తుంది.

 అపమృత్యుహరంచైవ తిలతైలాభిషేచనం |
 రుద్రాక్ష సలిలేనైవ మహతీం శ్రియమాప్నుయాత్ || స్వర్ణోదకాభిషేకేన ఘోరదారిద్ర్య నాశనమ్ । అన్నేనరాజ్య సంప్రాప్తి ర్మోక్షమాయు స్సుజీవనమ్ ॥ ద్రాక్షారపేన సర్వత్ర విజయం లభతే ధృవమ్ | ఖర్జూర ఫలపారేణ శత్రుహాని ర్భవిష్యతి ॥
 వైరాగ్యం లభతే జంబూఫల సారేణ వై జగుః | కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశ్నుతే ॥

నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన అపమృత్యువు తొలగిపోతుంది , రుద్రాక్షల నీటితో అభిషేకం చేస్తే గొప్ప సంపద లభిస్తుంది , బంగారం  ఉంచిన నీటితో అభిషేకం చేస్తే తీవ్రమైన దారిద్రం నశిస్తుంది ,  అన్నం వలన రాజ్యసంపద, మోక్షం, దీర్ఘాయువు, మరియు సుజీవనం లభిస్తాయి , ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే అన్నిచోట్లా విజయం కలుగుతుంది , ఖర్జూర పళ్ళ రసంతో శత్రు నాశనం జరుగుతుంది, నేరేడు పళ్ల రసంతో వైరాగ్యం లభిస్తుంది. కస్తూరి నీటితో చక్రవర్తిత్వం లభిస్తుంది.

ఈ ద్రవ్యాలు నిత్యం లేక ఎక్కువ కాలం పాటు సమర్పించు భక్తులకు కామ్యసిద్ధి కలుగుతుంది. 
*మహాదేవ మహాదేవ*

 *శ్రీమహావిష్ణు దేవత అభిషేక ద్రవ్యములు వాటి ఫలం*

క్షీరేణస్నాపితేవిష్ణౌ ప్రజేద్విష్ణుపురం నరః | దధ్నాతుస్నాపితేవిష్ణా రూపీ విష్ణుపురం ప్రజేత్ ||

 పాలతో విష్ణువును అభిషేకిస్తే ఆ వ్యక్తి విష్ణులోకం చేరుకుంటాడు. పెరుగుతో విష్ణువును అభిషేకిస్తే, దేవతారూపం పొంది విష్ణులోకానికి వెళ్తాడు.

ఘృతేన స్నపనాథ్సర్వవంద్యో వైకుణ్ణగోభవేత్ | మథునాస్నాపనాద్విష్ణో రగ్నిలోకమవాప్నుయాత్ ||

నెయ్యితో అభిషేకిస్తే అందరిచే పూజింపబడి వైకుంఠానికి వెళ్తాడు. తేనెతో విష్ణువును అభిషేకిస్తే అగ్నిలోకం పొందుతాడు.

శుద్ధోదకేన స్నపనాన్నష్టపాపో హరిం ప్రజేత్ | మృజ్జల స్నపనాద్విష్ణోర్మనశ్శుద్ధి మవాప్నుయాత్ ||

 శుద్ధమైన నీటితో అభిషేకిస్తే పాపాలు నశించి హరిని చేరుకుంటాడు. మట్టి నీటితో విష్ణువును అభిషేకిస్తే మనస్సు శుద్ధి అవుతుంది.

బిల్వపత్రైశ్చ సజ్ఝర్షాత్ సర్వపాపక్షయోభవేత్ |
అఙ్గసౌలభ్య మాయుష్యం సుగంధామలకాద్భవేత్

 బిల్వ పత్రాలు కలిపిన నీటితో అభిషేకిస్తే సకల పాపాలు నశిస్తాయి. సువాసనగల ఉసిరికాయ నీటితో అభిషేకిస్తే సౌందర్యం, సౌలభ్యం మరియు ఆయుర్దాయం పెరుగుతాయి.

లక్ష్మీసౌభాగ్య కాంతీశ్చ
సర్వౌషధ్యంబునాప్నుయాత్ |
పఞ్చగవ్య బ్రహ్మకూర్చ 
స్నాపనాద్విష్ణు మాప్నుయాత్ ||

 సర్వ ఔషధులు కలిపిన నీటితో అభిషేకిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, సౌభాగ్యం మరియు కాంతి లభిస్తాయి.
 పంచగవ్యం మరియు బ్రహ్మకూర్చంతో అభిషేకిస్తే విష్ణువును చేరుకుంటారు.

గన్ధర్వలోక మాప్నోతి స్నపనా చ్చన్దనాంభసా ।
సుగన్ధితోయ స్నపనాద్వారుణం లోకమాప్నుయాత్

 చందనం కలిపిన నీటితో అభిషేకిస్తే గంధర్వలోకం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకిస్తే వరుణ లోకం పొందుతారు.

అలక్ష్మీనాశమాప్నోతి స్నపనాత్పల్లవాంభసా |
స్నపనాత్కుశపుష్పాద్భిర్ర్బహ్మలోక మవాప్నుయాత్

మావిడి మేడి మర్రి రావి జువ్వి ఇవి పంచ పల్లవులు అంటారు వారు  చిగుళ్ళు కలిపిన నీటితో అభిషేకిస్తే దారిద్రం నశిస్తుంది.  కుశగడ్డి పువ్వులు కలిపిన నీటితో అభిషేకిస్తే బ్రహ్మలోకం పొందుతారు.

పుష్పామ్బః స్నపనాల్లోకా
త్సావిత్రాద్విష్ణు మాప్నుయాత్ | 
ఫలామ్భః స్నపనాద్భక్త్యా
విష్ణులోకమవాప్నుయాత్|
స్వర్ణామ్భః స్నపనాద్విష్ణోః 
కౌబేరం పదమవాప్నుయాత్ | 
సావిత్రం లోకమాప్నోతి 
రత్నామ్భః స్నపనాత్తథా |
ఇహలోకాద్విష్ణులోకం 
కర్పూరాగురువారిణా ॥

పువ్వులు కలిపిన నీటితో అభిషేకిస్తే సావిత్ర లోకం నుండి విష్ణులోకం చేరుకుంటారు. పండ్ల రసంతో భక్తితో అభిషేకిస్తే విష్ణులోకం లభిస్తుంది ,
బంగారం కలిపిన నీటితో విష్ణువును అభిషేకిస్తే కుబేరుని స్థానం పొందుతారు  అలాగే, రత్నాలు కలిపిన నీటితో అభిషేకిస్తే సవిత్ర లోకం లభిస్తుంది.
కర్పూరం మరియు అగరు కలిపిన నీటితో అభిషేకిస్తే ఈ లోకం నుండి విష్ణులోకం చేరుకుంటారు.

ఘృతేన మధునావాపి దధ్నావా తత్ఫలం శృణు |
సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వపాపవిమోచితః ॥

నెయ్యి, తేనె, లేదా పెరుగుతో అభిషేకం చేసిన ఫలాన్ని వినండి. సమస్త యజ్ఞాల ఫలాన్ని పొంది, అన్ని పాపాల నుండి విముక్తులవుతారు.

వసేద్విష్ణుపురం కల్పం త్రిసప్త పురుషాన్వితం |
తత్రైవ జ్ఞానమాసాద్య యోగినామపి దుర్లభమ్

 21 తరాల వారితో కలిసి కల్పకాలం పాటు విష్ణులోకంలో నివసిస్తారు. అక్కడ యోగులకు కూడా దుర్లభమైన జ్ఞానాన్ని పొందుతారు.

 ఇక్షుక్షీరేణ దేవేశం యః స్నాపయతి కేశవమ్ | కులాయుతాయుతయుతో విష్ణునా సహమోదతే ॥

చెరుకు రసం మరియు పాలతో దేవుడైన కేశవుని అభిషేకించే వ్యక్తి, లక్షల కుటుంబాలతో కలిసి విష్ణువుతో ఆనందంగా ఉంటాడు.

క్షిప్వాగంధోదకం శంఖే యః స్నాపయతి కేశవమ్ | నమోనారాయణాయేతి ముచ్యతే యోనిసంకటాత్

శంఖంలో గంధం కలిపిన నీటితో *నారాయణ మంత్రం*  పఠిస్తూ కేశవుని అభిషేకించే వ్యక్తి యోని సంకటాల  అన్న  పునర్జన్మ నుండి విముక్తి పొందుతాడు.

వాదిత్రనినాదైరుచ్చైద్గీత మఙ్గల సంస్తవైః |
యః స్నాపయతి దేవేశం జీవన్ముక్తో భవేద్ధి సః ॥

మంగళ వాయిద్యాల శబ్దాలతో, గీతాలతో, మరియు మంగళ స్తోత్రాలతో దేవుడైన కేశవుని అభిషేకించే వ్యక్తి జీవన్ముక్తుడు అవుతాడు.

వాదిత్రాణామభావేతు పూజాకాలే చ సర్వదా | ఘణ్ణా శబ్దానరైః కార్య స్సర్వవాద్యమయోయతః ॥

పూజా సమయంలో వాయిద్యాలు లేకపోతే, ఘంటానాదం శబ్దాన్ని ఉపయోగించాలి, ఎందుకంటే ఘంటా శబ్దం అన్ని వాయిద్యాల శబ్దాలకు సమానం.
*శ్రీ గోవింద హరే జయ గోపాల హరే* 

గురువుల అనుగ్రహం 
సేకరణ
Read More

భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏🙏
భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు, ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
1.అర్జున విషాదయోగం.!
ఈఅధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. (పూర్వజన్మపాపాలు తొలగుతాయి)
2.సాంఖ్య యోగం.!
ఈఆధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది. 
(సుఖశాంతులు కలుగుతాయి)
3.కర్మయోగం.!
ఈఅధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. (తనవారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది)
4, 5.జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం.!
ఈఅధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి. 
నాల్గవ అధ్యాయంవలన భయద్వేషాలు, 
ఐదవ అధ్యాయంవలన మహాపాపాలు తొలగిపోతాయి.
6.ఆత్మ సంయమయోగం.!
ఈఅధ్యాయం చదివినవారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్తదానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు. 
(జ్ఞానసిద్ధి కలుగుతుంది)
7.జ్ఞాన విజ్ఞానయోగం.!
జన్మరాహిత్యం కావాలనుకునేవారు 
ఈఅధ్యాయాన్ని చదివితేచాలు ఉత్తమోత్తమైన 
జన్మ కలుగుతుంది)
8.అక్షర పరబ్రహ్మయోగం.!
ఈఅధ్యాయం చదివినా, విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి. (ముక్తికలుగుతుంది)
9.రాజవిద్యా రాజగుహ్యయోగం.!
ఈఅధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన ఏదైన వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది. (యజ్ఞం చేసినఫలం లభిస్తుంది)
10.విభూతి యోగం.!
ఈఅధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది. 
(మహా ఐశ్వర్యం లభిస్తుంది) 
11.విశ్వరూప సందర్శనయోగం.!
ఈఅధ్యాయం నిష్టగా పఠించడంవలన భూత, ప్రేత పీడలు తొలగుతాయి.
12.భక్తియోగం.!
ఈఅధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. 
జ్ఞానదృష్టి కలుగుతుంది. 
(ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది)
13.క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం.!
ఈఅధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది. (కోరిన ఫలము లభిస్తుంది)
14.గుణత్రయ విభాగయోగం.!
ఈ అధ్యాయం చదివితే వ్యభిచారదోషం, స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి. 
(మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)
15.పురుషోత్తము యోగం.!
ఈఅధ్యాయాన్ని భోజనం చేసేముందు పఠించాలి. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. 
జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షంసిద్ధిస్తుంది. (మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)
16.దైవాసుర సంపద్విభాగయోగం.!
ఈఅధ్యాయం చదివినచో చదివినవారితో పాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. 
ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. (రాజాధిరాజులా వెలిగిపోతారు)
17.శ్రద్ధాత్రయ విభాగయోగం.!
తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు 
ఈఆధ్యాయాన్ని పఠిస్తే మంచిది. 
సత్వరం ఫలితం కనిపిస్తుంది. 
(అనేక వ్యాధులు దూరం అవుతాయి)
18.మోక్ష సన్యాసయోగం.!
నిరుద్యోగులు ఈఅధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి. 
అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితంకూడా ఈఅధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది. 
(దాన, ధర్మ, యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది)
Read More

పితృ తర్పణ విధి

పితృ తర్పణ విధి

భాధ్రపద మాస కృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు అన్నంతో భోజనం పెట్టిన వారు దుర్గతిని పొందరు. భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు. ఈతడు భాద్రపద మాసంలో పితరులను ఉపాసించనందు వలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు. భాద్రపద మాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు. 

శుభమైన భాద్రపద కృష్ణపక్ష మందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో సర్వపావనుడైన అగ్ని సంతుష్టుడౌతాడు. అతడు చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో సహకూడి ఆనందిస్తాడు. అతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడు కూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని గృహమును, సంపదను, క్షేత్రాదికమును అగ్నిదహిస్తాడు కూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు దశకల్ప సహస్రముల కాలము తృప్తిని పొందుతారు. 

ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వాని భక్తికి భగవాన్‌, భవానీ పతియైన ఈశ్వరుడు సంతుష్టుడౌతాడు. ఆతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిస్తాడు సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని కోపించి శంభువు ఆతని బ్రహ్మవర్చస్సు నాశనం చేస్తాడు. కాల సూత్రమను రౌరవ నరకాన్ని ఆతనికిస్తాడు. మహాలయ ద్వితీయ తిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు.  పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది. 

తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి. దీనితో భగవాన్‌ లోకపాలుడైన ధనాధిపతి సంతుష్టుడౌతాడు. మహాపద్మాది నిధులు అతని వశంలో ఉంటాయి.  బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతీయ తిథి యందు మహాలయము చేయని నరుని  సంపదను భగవాన్‌  ధనరుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు. బహుదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు  తృతీయ తిథి యందు మహాలయము చేసిన నరుని కర్మతో, అతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తినందుతారు.

చతుర్థి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్‌ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు. గజవక్త్రుని అనుగ్రహం వల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థితి థి యందు మహాలయము చేయని నరునకు భగవాన్‌ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. చతుర్థి తిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి శ్రాద్ధ కర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు. 

పంచమి తిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని  మందిరమును భగవతి లక్ష్మి వదిలిపెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున కాధారమైన అలక్ష్మి పుడుతుంది.  పంచమి తిథి యందు మహాలయమాచరరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు.  తృప్తులై ఈతనికి అవిచ్ఛిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతి కూడా ప్రసన్నురాలౌతుంది.
 
షష్టితిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీసుతుడైన షణ్ముఖుడు భగవానుడు సంతుష్టుడౌతాడు.  ఆతని అనుగ్రహం వల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు  షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహాసేనుడు, విముఖుడౌతాడు. గర్భం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతనాది గ్రహముల సమూహములతో బాదింపబడతాడు.  వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠితిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని  పితరులు అరవై వేల కల్పసహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంపదను కూడా ఇస్తారు. 

సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. బంగారు చేతులు గల భగవాన్‌ ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు.  భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్‌ హిరణ్యపాణియైన వాడు స్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుష్టమనస్కుడై  మహాలయ శ్రాద్ధ కర్తకు ఇస్తాడు.. సప్తమి తిథి యందు భక్తితో మహాలయము చేయని నరుడు  క్షయ రోగాది వ్యాధులతో రాత్రింబగళ్ళు ఆతడు బాధింపబడుతాడు. క్రింద తీక్షధార అస్త్రశయ్య అను నరక మందు పడతాడు. సప్తమి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు డెబ్బది కల్పసహస్రములు సంతుష్టులౌతారు.  పితృగణము ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు కూడా.

అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి.  మృత్యుంజయుడు, కృత్తి వాసుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన అతనికి కైవల్యము చేతియందున్నట్లే  మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, పదునాల్గులోకములలో అతనికి దుర్లభమైనదేముంటుంది.  మూఢచేతనుడై అష్టమి యందు మహాలయము చేయని వాడు ఘోరమైన సంసార సాగరమందు దుఃఖితుడై మునుగుతాడు ఎప్పుడూను భూమి యందు ఆతని కోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు.  అష్టమి యందు శ్రద్ధతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు ఎనుబది కల్ప సహస్రము తృప్తి నందుతారు.  ఈతనిని ఆశీస్సులతో వృద్ధి పరుస్తారు. ఈతని విఘ్నము కూడా తొలగిపోతుంది. పితృ గణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.  

నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతుంది.  సంతుష్టి చెందిన దుర్గ మహిష నందిని అతని క్షయ, అపస్మార కుష్ఠాదులను క్షుద్ర ప్రేత పిశాచములను నశింపచేస్తుంది.  నవమి తిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్సుతో, అపస్మారముతో పీడింపబడుతాడు.  నిరంతరము అభిచార అర్థకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని  పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని గూడా ఇస్తారు. 
 
దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు  ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ వ్రీహ్యది ధాన్యములను ఇస్తాయి.  దశమి యందు ఉత్తమ ముఖ్యమైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్ఫలమౌతాయి.ఆతని కృషి కూడా నిష్ఫలమే.  దశమి తిథి యందు మహాలయ శ్రాదధము చేసిన నరుని, పితరులు శత కల్పసహస్రములు తృప్తినందుతారు.  పితృ గణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్ఛిన్న సంతతినిస్తారు. 

ఏకాదశి యందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. దానితో సర్వ లోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో  ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు పదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. అగ్నిష్టోమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశి యందు భక్తితో మహాలయము చేయని నరునిపై రుద్రుడు విముఖుడౌతాడు. అతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. బహు దక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనిని నిష్ఫలములే, బూడిదలో పోసిన హవ్యముల వలె ఔతాయి.  శ్రాద్ధము చేయని దోషము వలన బ్రహ్మఘాతకతుల్యుడౌతాడు. ఏకాదశి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు రెండు వందల కల్ప సహస్రములు తృప్తులౌతారు. పితృగణముల ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.  

ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీపతియైన జనార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు.  హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధి పరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మికూడా అతని ఇంటిలో వృద్ధి పొందుతుంది.  నారాయణుని చేతి యందున్న గద కౌమోదకి అనునది ఎప్పుడూ అపస్మారాది భూతములను నశింపచేస్తుంది.  తీక్షణమైన అంచులు గల చక్రము ఈతని శత్రువులను దహించి వేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది. ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని పీడను తొలగిస్తాడు. హహాలయమును ద్వాదశి యందు చేయని మను జాథముని యొక్క క్షేత్రములు సంపదలు నశిస్తాయి. అనుమానం లేదు. అపస్మారాది భూతములు, మహాబలవంతులైన శత్రువులు యాతుధానులు (రాక్షసులు, పుణ్యజనులు) కూడా విష్ణుపరాఙ్‌ముఖుడైన ఈతనిని బాధిస్తారు. అస్థి భేదనమను పేరుగల నరక మందు పడవేయబడుతాడు ద్వాదశి యందు భక్తియుక్తుడై మహాలయ శ్రాద్ధము నాచరించిన వాని పితరులు ఆరువందల కల్ప సహస్రములు సంతోషపడుతారు. ఈతని పితరులు ఈతనికి అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు. 

త్రయోదశి యందు నరుడు భక్తితో మహలయ శ్రాద్ధమును చేయాలి. అతనికి రతినాయకుడైన భగవాన్‌ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రక్చందనాది భోగములు మనోరమలైన స్త్రీలు కామదేవుని ప్రసాదం వల్ల అతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుక నుండి చావు వరకు ఆతడు సుఖమునే పొందుతాడు. త్రయోదశి యందు మహాలయ శ్రాద్ధము చేయని వానికి కామదేవుడు విముఖుడౌతాడు. స్త్రీలను భోగములను నశింపచేస్తాడు. ఈతనిని అంగార శయ్యా భ్రమణమనే నరకమందు పడవేస్తాడు. పితరుల నుద్దేశించి త్రయోదశి యందు మహాలయం మాచరించిన వాని పితరుల సహస్ర కల్పసహస్రములు సంతుష్టి నందుతారు. పితృగణములు అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు.

చతుర్దశి యందు నరుడ భక్తితో మహాలయ శ్రాద్ధము చేయాలి. అతని అభీష్టమును నెరవేర్చుటకై భగవాన్‌ శివుడు మేల్కొంటాడు. శివ జ్ఞానమును ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల సురాపానముల, పదివేల స్వర్ణప్తేయము బంగారం దొంగతనము /  పాపము చతుర్దశి మహాలయం శ్రాద్ధం వల్ల తత్‌క్షణ మందే నశిస్తుంది. చండాల వృషల స్త్రీల సమాగమ దోషం కూడా నశిస్తుంది.  అశ్వమేధ సహస్రముల పదివేల పుండరీక యాగముల పుష్కల ఫలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది.  చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధం చేయని నరుడు కల్పకోటి సహస్రము, అట్లాగే కల్పకోటి శతము కాలము  సంసారమనే పెద్ద చీకటి బావిలో పడిపోతాడు. నిష్కృతి లభించదు. బంగారం దొంగిలించకుండానే సురను తాగకుండానే సురాపానాది దోషములతో తాకబడుతాడు. ఆ మూఢ బుద్ధి కలవాడు. విధానం ప్రకారం చేసినా ఆతని యజ్ఞములు నిష్ఫలములౌతాయి చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు  కల్పములు తృప్తి నందుతారు. అనుమానం లేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు. పితృగణములు అవిచ్ఛిన్నమైన సంతతిని కూడా ఇస్తారు. అమాయందు నరుడు మహాలయ శ్రాద్ధ మాచరించాలి. ఆతని పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. అనుమానంలేదు. దేవలోకంలో దేవతలకు అమృతాస్వాదన వల్ల లభించేతృప్తి  అనంతమైన అట్టి తృప్తి అమావాస్య మహాలయ వల్ల లభిస్తుంది. 

పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది ఇది పరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రాద్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి.  అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది పంచ పాతకములు నశిస్తాయి. అన్ని యజ్ఞములు దక్షిణలతో కూడా విధానముగా చేసినట్లౌతాయి. సనాతన సర్వ ధర్మములు విధి ప్రకారము అనుష్ఠింపబడినట్లౌతాయి. అమావాస్యదినమందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుడు ప్రత్యక్‌ బ్రహ్మేకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు. అచేతనుడై మహాలయ అమావాస్య నాచరించని వాని పితరులు బ్రహ్మలోక గతులైన నరకమునకే వెళుతారు. ఈ మూఢుని సంతతి ఆక్షణంలోనే విచ్ఛిత్తి నందుతుంది. అమావాస్య తిథి యందు నరులు మహాలయము కొరకు విధి ప్రకారము బ్రాహ్మణులకు భోజనం పెట్టనట్లైతే అదే మహా అనర్థమౌతుంది (సంతతి విచ్చిత్తి). 

భాద్రపద మాసం వస్తే పితృదేవతలు నాట్యం చేస్తారు.  మమ్మల్ని ఉద్దేశించి మా పుత్రులు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడతారు. దాని వలన మాకు దారుణమైన నరకక్లేశము కలుగదు  చంద్ర తారలున్నంత కాలము స్వర్గలోక వాసము కల్గుతుంది. భాద్రపదమాసం వస్తే అది పితరులకు తృప్తినిచ్చేది కనుక ప్రతిరోజు భక్తి పూర్వకముగా ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. పితృ మాతృకుల మందు జన్మించిన పితరులు తృప్తి నందుతారు. విశేషించి కృషపక్ష మందు బుద్ధిమంతుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నేయిపప్పు మొదలగు సస్యములతో తైలా భ్యంగ పురస్సరముగా పెట్టాలి. దీనితో ఆ కల్పము ఆనందిస్తూ పితరులు అమృతము సేవిస్తారు. 

కృష్ణపక్ష సప్తమి మొదలుకొని ప్రతిరోజు నరులు అమావాస్య వరకు ముగ్గురు బ్రాహ్మణులను పూజించి భుజింపచేయాలి. ద్వాదశి నారంభించి (ఆనాటినుండి) ముగ్గురు బ్రాహ్మణులకు తప్పకుండ భోజనం పెట్టాలి. లేనిచో ఐశ్వర్య హాని కల్గుతుంది. మహా దారిద్ర్య వంతుడౌతాడు. విత్తలోభమును వదలి బ్రాహ్మణులకు సూపఘృతాదులతో వయస్సుతో పాయసాన్నముతో పెరుగు అపూపాదులతో పేయములు, లేహ్యములు, చోష్యములు(జుర్రేది) వివిధములైన భక్ష్యములు మొదలగు వానితో వేదవిదులైన ముఖ్యులను వారికి తృప్తి కలిగేటట్టుగా భుజింప చేయాలి. అందువల్ల బ్రహ్మవిష్ణు శంభులు తృప్తులౌతారు ఇందులో అనుమానం లేదు. అగ్నిష్వత్తాది పితరులు అట్లాగే ఇంద్రాది దేవతలు తృప్తులౌతారు. ఎక్కువగా చెప్పటం ఎందుకు దానితో జగత్త్రయము తుష్టమౌతుంది.  

మహాలయ శ్రాద్ధమును పార్వణ విధానంతో చేయాలి. నరుడు మహాలయ శ్రాద్ధమందు పితృవంశ మందలి పితరులను వలె మాతృ వంశమందలి పితరులను కూడా సంతోషంతో శ్రేయస్సు కొరకు భుజింప చేయాలి. తన విత్తమున కనుగుణంగా శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వాలి.  ఆ మహాలయ శ్రాద్ధంతో విత్త శాఠ్యము చేయరాదు. యజ్ఞములకు దక్షిణ ఆవులుగా చెప్పబడింది. (పురోగవునితో) మార్గంలో పురోగవులతో (ముందు ఆవులుంటే) శ్వాస హీనం చేయబడ్డట్టు (దుమ్మువల్ల) ఆ పితృయజ్ఞం కూడా దక్షిణ లేకపోతే హీనమౌతుంది.  అందువల్ల యజ్ఞము లందు తెలుసుకొని దక్షిణ అల్పంగానైనా ఇవ్వాలి. విధవలైన స్త్రీలు కూడా అపుత్రులైన వారుకూడా మహాలయమును తమ భర్తల గురించి అధిక భోజన కర్మతో చేయాలి. లేని పక్షంలో ధర్మహాని కల్గుతుంది. గొప్పనరకం సంభవిస్తుంది. 

భాద్రపద మాసం వచ్చాక మహాలయము చేయని నరుని కులము నాశనమౌతుంది. బ్రహ్మహత్యను పొందుతాడు శ్రద్ధగల వారు పితరుల గూర్చి మహాలయమాచరిస్తారు. వారికి సంతతిచ్ఛేదము కాదు. ఎడతగెని సంపద లభిస్తుంది. ఆలయము అనగా స్థానము మహా అనగా కల్యాణము కల్యాణమునకు స్థానమైనది కనుక మహాలయమని చెప్పబడింది. కనుక కల్యాణం కలిగే కొరకు నరుడు మహాలయమాచరించాలి. మహాలయమాచరించని పక్షంలో అతనికి అమంగలం కల్గుతుంది.  తల్లిదండ్రులు చనిపోయిన రోజున శ్రాద్ధం చేయకపోయినా, బుద్ధిమంతుడు స్మరించకుండానే మహాలయ శ్రాద్ధమాచరించాలి. 

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తి లేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి.  ధన దాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధన ధాన్యమును ఎప్పుడు కూడా పతితుల నుండి తీసుకోరాదు.  ధన ధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి.  రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో  పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికి పోయి అడవిలో ఏడవాలి.  చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశము లందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి. మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి  పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటం లేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. మీరు దయగల వారైనా ఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడు ఇట్లాగే అరణ్యప్రదేశము లందు ఏడవాలి. అతని ఏడుపును విని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు.  బ్రాహ్మణుల సమూహం మహాలయం కొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది.
Read More

లోకాలు- లోకాధిపతులు భూమినుండి పైన ఉన్న సప్తలోకాలు- అధిపతులు; 1.భూలోకం → భూమండలం, మనుషుల స్థానము. భూదేవి 2.భువర్లోకం→భూ మండల- స్వర్గం మండల మధ్య స్థలం. సూర్యుడు, నవగ్రహాలు 3.సువర్ణ లోకం (స్వర్గ లోకం) → ఇంద్ర స్వర్గం, దేవతలు నివసించే లోకము. దేవేంద్రుడు. 4.మహాలోకం → మహర్షుల స్థానం, జ్ఞానులు నివసించే స్థలం. సప్తఋషులు 5.జనలోకం → మునులు, ఉత్తమ జనుల నివాస స్థలం. నారదాది మునులు 6.తపోలోకం → తపస్సు అనుకూలమైన లోకము. బ్రహ్మ మానసపుత్రులు 7.సత్యలోకం → సర్వోన్నత స్థానం, పరబ్రహ్మ నివాస స్థలం. బ్రహ్మ భూమికి క్రింద ఉన్న సప్తలోకాలు అధిపతులు; 1.అతలము- బలుడు (మాయాదేవి కొడుకు) 2.వితలము- హరభావ 3.సుతలము- బలిచక్రవర్తి 4.తలాతలము- మయుడు, అనంతడు, వాసుకి 5.రసాతలము- దానవుడు 6.మహాతలము- కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేనుడు 7.పాతాళము-వాసుకి త్రిలోకాలు బ్రహ్మలోకము/సత్యలోకము- బ్రహ్మ దేవుడు శివలోకము / కైలాసము -ఈశ్వరుడు విష్ణులోకము/ వైకుంఠము- విష్ణుమూర్తి శంకరమంచి జ్యోతిష విద్య- డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి డా. శంకరమంచి శివ సిద్ధాంతి

 లోకాలు- లోకాధిపతులు


భూమినుండి పైన ఉన్న సప్తలోకాలు- అధిపతులు;

 1.భూలోకం → భూమండలం, మనుషుల స్థానము. భూదేవి

2.భువర్లోకం→భూ మండల- స్వర్గం మండల మధ్య స్థలం. సూర్యుడు, నవగ్రహాలు

3.సువర్ణ లోకం (స్వర్గ లోకం) → ఇంద్ర స్వర్గం, దేవతలు నివసించే లోకము. దేవేంద్రుడు.

4.మహాలోకం → మహర్షుల స్థానం, జ్ఞానులు నివసించే స్థలం. సప్తఋషులు

5.జనలోకం → మునులు, ఉత్తమ జనుల నివాస స్థలం. నారదాది మునులు 

6.తపోలోకం → తపస్సు అనుకూలమైన లోకము. బ్రహ్మ మానసపుత్రులు 

7.సత్యలోకం → సర్వోన్నత స్థానం, పరబ్రహ్మ నివాస స్థలం. బ్రహ్మ


 భూమికి క్రింద ఉన్న సప్తలోకాలు అధిపతులు;

1.అతలము- బలుడు (మాయాదేవి కొడుకు)

2.వితలము- హరభావ 

3.సుతలము- బలిచక్రవర్తి

4.తలాతలము- మయుడు, అనంతడు, వాసుకి

5.రసాతలము- దానవుడు 

6.మహాతలము- కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేనుడు

7.పాతాళము-వాసుకి

త్రిలోకాలు

బ్రహ్మలోకము/సత్యలోకము- బ్రహ్మ దేవుడు

శివలోకము / కైలాసము -ఈశ్వరుడు

విష్ణులోకము/ వైకుంఠము- విష్ణుమూర్తి


Read More

17, జూన్ 2025, మంగళవారం

మంత్ర విశిష్టత..ఫలితాలు

 #మంత్ర విశిష్టత..ఫలితాలు


#మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో మీ కోసం.....


#వ్యాపార లాభాలకు మంత్రం:.

1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని

జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ 

2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః


#మంత్రం::

శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త

ధనుజ పరామార హరయః 

అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా

భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం


#హనుమాన్‌ శత్రుంజయ మంత్రం:

ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ

భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ 

దుష్టజన మనోరథ స్తంభనాయ 

ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం


#ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం:


కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః

ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః

ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః

ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః

ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే

తన్నో కుబేర ప్రచోదయాత్‌


#విద్యా విజయానికి మంత్రాలు..

1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే

జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః

2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా 

త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా


#సంతాన గోపాల మంత్రం:

ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా

దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః


#విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం:

సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం

హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ

ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ

తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని

పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి

నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని

ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ

ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః

సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ 

సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ


#విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు......


#లక్ష్మీగణపతి:.

సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం 

సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే


#క్షమాపణకు:.

నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా 

దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా


#సర్వఫలప్రదభైరవ స్తోత్రం:

ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా

మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా 

జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా

సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా

స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా

సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా


#దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:

అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః

కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః

సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం 

జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః


#విద్యావిజయంకరీ మంత్రం:

ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః 

నీల సరస్వతే నమః 

(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు 

లేదా 108సార్లు జపిస్తే సత్వర విద్యాభివృద్ధి కలుగుతుంది)


#సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు...

1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ 

నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః

2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర

3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే

3 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే

గమనిక: రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా మంచిది


#మంగళచండికా స్తోత్రం:

రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే

హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే

హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే

శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే

మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే

సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే


#భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు...

ద్రాం ద్రవిణే బాణాయ నమః

ద్రీం సంక్షోభణ బాణాయ నమః

క్లీం ఆకర్షణ బాణాయ నమః

బ్లూం వశీకరణ బాణాయ నమః

సం సమ్మోహన బాణాయ నమః


#పురుషత్వం,సంతాన ప్రాప్తికి....

కథాకాళేమాతః కథయా కళితాలక కరశం

పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం

ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా 

యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం


#శీఘ్ర వివాహానికి..

కన్య నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 

12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27 శ్లోకాలలో 

ఏదో ఒకదాన్ని పఠించాలి. 

ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.🙏🙏🙏

Read More

సర్వ గాయత్రి మంత్రములు ... గాయత్రీ మంత్రం రకములు, రూపాలు

*శతగాయత్రి_మంత్రావళి_విశిష్ఠతలు*

బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//

వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//

ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//

శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

సర్వే జనాః స్సుఖినోభవంతు..!
Read More

15, జూన్ 2025, ఆదివారం

🎻🌹🙏 వేల ఏళ్ళుగా శివయ్య ను అభిషేకిస్తున్న నంది

 🎻🌹🙏 వేల ఏళ్ళుగా శివయ్య ను  అభిషేకిస్తున్న నంది...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఈ ఒక్క క్షేత్రం యొక్క విశిష్టత చాలు మన పూర్వ భారతీయులు ఎంతగా ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేశారో తెలుస్తుంది.


🌸నిజంగా ఎలాంటి మోటార్ సాయం లేకుండా వేల సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో ఉన్న నంది,కింద భాగంలో ఉన్న శివ లింగాన్ని నిరంతరం అభిషేకం చేస్తూనే ఉంది.


🌿ఈ పుణ్యక్షేత్రం పేరు దక్షిణాముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్రం. దీన్ని నంది తీర్థం అని మరియు బసవ తీర్థం అని కూడా పిలుస్తారు


🌸ఈ క్షేత్రం బెంగుళూరులోని మల్లేశ్వరం దగ్గరలో ఉంది.గంగమ్మ ఆలయం దగ్గరలో ఈ క్షేత్రం ఉంటుంది.


🌿ఈ క్షేత్రం లోపల పైన భాగంలో నంది,రాతికప్పు క్రింది భాగంలో శివ లింగం ప్రతిష్టించబడి ఉన్నాయి.


🌸 అయితే పైన నంది నోటి నుండి జాలు వారుతున్న నీరు రాతి కప్పుకున్న రంధ్రం ద్వారా శివలింగం పై పడి,అక్కడ శివలింగం నుండి కల్యాణి తీర్థంలోకి వెళ్ళిపోతాయి.


🌿 అయితే ఆ కల్యాణి తీర్థంలో ఒక సుడి గుండం ఉంది.ఆ సుడి గుండం ద్వారా నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో మాత్రం ఎవరికి తెలియదు. 


🌸ఇప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఈ తీర్థంలోని నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో కనిపెట్టలేకపోయారు.


🌿కానీ అలా సుడి గుండం ద్వారా వెళ్తున్న నీరు చాలా లోతు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి నంది నోటి నుండి వస్తాయని మన భారతీయ వేద శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


🌸ఇలాంటి పంపింగ్ పద్దతిని మన వేద జ్ఞానాన్ని ఉపయోగించి మన పూర్వ భారతీయ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు నిర్మించారని చెప్తున్నారు. 


🌿ఎందుకంటే కల్యాణి తీర్థంలో నీరు ఎప్పుడు నిండటం లేదు అలాగే తగ్గటం కూడా లేదు మరియు నంది నోటి నుండి నిరంతరం నీరు వస్తూనే ఉంది కానీ ఆగడం లేదు.


🌸ఇలా మోటార్ లేకుండా ప్రపంచంలో మొట్ట మొదటి పంపింగ్ సిస్టమ్ ని తయారు చేసింది మన పూర్వ భారతీయ ఇంజనీర్ లు,శాస్త్రవేత్తలే.


🌿ఇక్కడ నంది ఏ శివ క్షేత్రంలో లేని విధంగా దక్షిణ వైపుగా ముఖం పెట్టి ఉంటుంది ఇది ప్రత్యేకం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Read More

అరుణాచలేశ్వరుడు

అరుణాచలేశ్వరుడు 

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. 

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.  అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. 

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. 

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. 

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం

Read More

8, జులై 2023, శనివారం

నమః పార్వతి పతయే హర హర

 నమః పార్వతి పతయే హర హర

హర హర శంభో మహాదేవ

హర హర మహాదేవ

హర హర హర హర మహాదేవ

శివ శివ శివ శివ సదాశివ

మహాదేవ సదాశివ

సదాశివ మహాదేవ ||


💥శివాలయంలో పరమేశ్వరుని దర్శనం..


శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.

అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది.


శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.

అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి.

అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు.


శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి.

ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి.

🍁🍁🍁🍁🍁


🌹శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.. "పశ్చిమాభిముఖమైన" శివాలయం.


అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది.

అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని "సద్యోజాత శివలింగం" అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు "ఓం సద్యోజాత ముఖాయ నమః" అని స్మరించుకోవాలి.

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం.


🌹శివలింగం "తూర్పు వైపు"కు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని "తత్పురుష ముఖం" అని అంటారు.

తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం.

అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది.

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము.

ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.


సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.


🌹శివలింగం "దక్షిణానికి" చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు.

ఆ ముఖాన్నే "అఘోర ముఖం" అంటారు.


ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం.

ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు.

మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. 


🌹"ఉత్తరం" వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

ఈ వాసుదేవ ముఖాన్ని "ఓం వాసుదేవాయ నమః" అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.


🌹శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి.

ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. 


ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.

ఈ ఈశాన ముఖం ఆకాశమునకు అధిష్ఠానం అయి ఉంటుంది.


శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది.

అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

సేకరణ... 💐🙏


Read More

కపిలతీర్థం తిరుపతి

            కపిలతీర్థం తిరుపతి 

                  ➖➖➖✍️



శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది కపిలతీర్థము.


కపిల తీర్ధమునకు ‘చక్రతీర్థం‘ లేదా ‘ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు.


కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి,  భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు.


అందువలన ఇది 'కపిలలింగం'గా పేరొందింది.


త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది.


ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.


కార్తిక మాసం నందు వచ్చు కార్తీక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


ఈ ఆలయం తి.తి.దే. వారి ఆధ్వర్యంలో పని చేస్తున్నది.


శివరాత్రి పండుగ మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


తెలుగునాట వున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది వుండటం విశేషం. 


హరిహరులకు ఏ బేధం లేదని నిరూపిస్తూ నిలచిన ఈ తీర్థ రాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో వుంది.


శేషాచల పర్వతపాదాన వున్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు, యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు.


కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్రతీర్థంలో నిలచినట్లు స్థలపురాణం చెబుతోంది.


కపిలుని తపస్సుకు మెచ్చి నిలచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు.


కామాక్షీ సమేతుడై నిలచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు.


తిరుమల గిరుల నుంచి గల గల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25అడుగుల ఎత్తు నుంచి ఆలయపుష్కరిణిలోకి దూకే ఆకాశ గంగ శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు.


ఇప్పుడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెపుతారు.

అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.


వైష్ణవతీర్థం విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.


విజయనగర పరిపాలన చివరిరోజుల్లో అక్కడ్నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసమేర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్టగావించిందని చెబుతారు.


ఈ ఆలయప్రాంగణంలో కపిలేశ్వరస్వామితో పాటు, కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వ రుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు కూడాకొలువై వున్నారు.


తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం ‘కపిల తీర్ధం.’ ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశంలో ఉంది.


ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.


తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, పాపవినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది.


ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.


విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.

సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.


పుణ్య స్నానం ఇక్కడి తీర్థంలో ఆచరించిన వారి పాపాలు పటాపంచలౌతాయని భక్తుల విశ్వాసం.


విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.✍️

ఓం శివాయ నమః

ఓం నమో  వేంకటేశాయ !!

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


Read More

అష్టైశ్వర్యాలు:- --------------------------------- అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి

అష్టైశ్వర్యాలు:- 

---------------------------------

 అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి 


👉 సూక్ష్మరూపం ధరించగలగడం అణిమ.

👉 గొప్ప రూపం ధరించడం మహిమ.

👉 తేలికగా అయిపోవడం లఘిమ.

👉 బరువుగా అయిపోవడం గరిమ.


👉 పొందవలసిన వాటిని పొందడమే ప్రాప్తి.

👉 విశేషమైన కోరిక తీరడమే ప్రకామ్య.

👉 అందరి మీద పరిపాలనా శక్తి ఈశత్వ.

👉 అందరినీ వశపరచుకోవడం వశిత్వ.


 మొదటి నాలుగు.... అణిమ, మహిమ, గరిమ, లఘిమ .. ఇవి ధ్యానంలోంచి లభ్యమవుతాయి.


 చివరి నాలుగు ... ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ... ఇవి బ్రహ్మ జ్ఞానంలోంచి లభ్యమవుతాయి.

Read More

🌼శ్రీరామాష్టకం🌼

🌼శ్రీరామాష్టకం🌼 


భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |

స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్  ౧ 


జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |

స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్  ౨ 


నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |

సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్  ౩ 


సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |

నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్  ౪ 


నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |

చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్  ౫ 


భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |

గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్  ౬ 


మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |

పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్  ౭ 


శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |

విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్  ౮ 


రామాష్టకం పఠతి యస్సుఖదం సుపుణ్యం

వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః |

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం

సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్🙏🍒


Read More

🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯

  🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯


ఓం మంగళం దేవదేవాయ రాజరాజాయ మంగళం

మంగళం నాథనాథాయ కాలకాలాయ మంగళం. || 1 ||


మంగళం కార్తికేయాయ గంగాపుత్రాయ మంగళం

మంగళం జిష్ణుజేశాయ వల్లీనాథాయ మంగళం. || 2 ||


మంగళం శంభుపుత్రాయ జయంతీశాయ మంగళం

మంగళం సుకుమారాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. || 3 ||


మంగళం తారకజితే గణనాథాయ మంగళం

మంగళం శక్తిహస్తాయ వహ్నిజాతాయ మంగళం. || 4 ||


మంగళం బాహులేయాయ మహాసేనాయ మంగళం

మంగళం స్వామినాథాయ మంగళం శరజన్మనే. || 5 ||


అష్టనేత్రపురీశాయ షణ్ముఖాయాస్తు మంగళం

కమలాసనవాగీశ వరదాయాస్తు మంగళం. || 6 ||


శ్రీ గౌరీగర్భజాతాయ శ్రీకంఠ తనయాయచ

శ్రీ కాంత భాగినేయాయ శ్రీ మత్ స్కందాయ మంగళం. || 7 ||


శ్రీ వల్లీ రమణాపాద శ్రీ కుమారాయ మంగళం

శ్రీ దేవసేనా కాంతాయ శ్రీ విశాఖాయ మంగళం. || 8 ||


మంగళం పుణ్యరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం

మంగళం పుణ్యయశసే మంగళం పుణ్యతేజసే. || 9 ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం సంపూర్ణం.


శుభ శుభోదయం


Read More

5, డిసెంబర్ 2022, సోమవారం

ఇది పుర గ్రామం, సొరబ తాలూకా, షిమోగా జిల్లా లో

 👆ఈశ్వరుడు నందిపై 

గర్భగుడిలో  ఉండడం అనేది

 చాలా అరుదుగా కనిపించే శిల్పం!! 

16వ శతాబ్దానికి చెందిన

 అందమైన శిల్పం.  

ఇది పుర గ్రామం, 

సొరబ తాలూకా, 

షిమోగా జిల్లా లోని


 సోమేశ్వరాలయంలో ఉంది...


ఇక్కడ శివుడుకిరీట 

ముఖతలో వున్నాడు


🙏హర హర మహాదేవ్🙏

          శుభోదయం

Read More

4, డిసెంబర్ 2022, ఆదివారం

శ్రీ శంకరాచార్య విరచిత* *మీనాక్షి పంచరత్న స్తోత్రం.

 


    శ్రీ శంకరాచార్య విరచిత*
*మీనాక్షి పంచరత్న స్తోత్రం.!*


ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ |
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  1

ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ |
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  2

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ |
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  3

శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ |
వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  4

నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ |
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవా 

Read More

*ఆచమనం అంటే..

 *ఆచమనం అంటే..?

       ➖➖➖


పూజలు, వ్రతాల్లో ”ఆచమనం” అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.


కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. 

కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు…


సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడో, పూజా సమయంలోనో మనం ఈ ఆచమనాన్ని పాటించి ఉంటాం. సాంప్రదాయబద్ధంగానైతే రోజులో పలుమార్లు పాటిస్తారు.


ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.


సంస్కృతంలో ”గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్” అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, నీటిని పోసి, వాటిని తాగడం అన్న మాట.


చేతిలో పోసేనీళ్ళుకి కూడా కొలత ఉంటుంది. మూడు ఉద్ధరిణిల నీటిని మాత్రమే పోయాలి. అంటే ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు కొలత అంతే ఉండాలి.


ఎందుకు చేయాలి? ఏమిటి దాని వలన ప్రయోజనం అంటే, గతంలో మనం అనేక మార్లు భారతీయత, దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పది.


భక్తి మాత్రమే కాదు అణువణువునా శాస్త్రీయత, ఆరోగ్య సూత్రం ఇనుమడింపజేస్తాయి. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఆచమనంలో కూడా అదే దాగి ఉంది.


మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది.


కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది.


ఏ చిన్న గాయం అయినా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.


ఇవి ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారంలో మిళితమై ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి.


స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.


స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,


గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి.


వీటికి బలం, వ్యాయామం కలిగించి ఉత్తేజ పరచడమే ఆచమనం ప్రక్రియ. సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.


ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఆచమనం పద్దతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది.


“కేశవాయ స్వాహా” అనడంలో ఆంతర్యమేమిటి అంటే అది గొంతునుండి వెలువడుతుంది. ఇక “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.


చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదాలు మాత్రమే పలుకుతాయి. ఆచమనం ద్వారా గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.


ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలుగవచ్చు. మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది.


చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.


ఉద్దరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.


ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట


*సంధ్యా వందనము ఎందుకు?

*మరియు ఫలము:


ఎన్నోవేల కోట్ల జీవరాసుల మధ్య జడమై,అజరమై, జడపదార్థం కాని ఎన్నెన్నో జీవరాసుల మధ్యలో ఉన్న తేజస్సుకొరకు సంధ్యావందనం. లోకంలో స్థావరమై, జంగమమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యున్నతమైనది. జీవన సాఫల్యం చెందడానికి,(ఎందుకు జన్మించాము) తన చుట్టూ ఉన్న సమాజమును ఉద్దరించ డానికి, ఒక వ్యక్తిగా ఉపాసించడమే సంధ్యావందనము. 


గాయత్రి అనగా భూదేవియే ఉపస్తుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపి తముగా ఉండే దేవి పరదేవత. విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయిత్రి మాత. ఒక యోగిగా, ఒక ఋషిగా మనము ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. ప్రతి రోజు ఒక 25 ని||ములు ఈ గాయత్రీ జపం చేయడం వలన తన జన్మకు సాఫల్యం చేకూర్చినవాడు కాగలడు. 


మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనాన్ని, కుటుంబాలని, సమాజాన్ని, నవోన్వేషణము వైపుకు నడపడం, అమ్మకు(తల్లి) నాన్నకు(తండ్రి) గురువులకు, పితృదేవతలకు, మాతృ దేవతలకు, మనకు కనిపించని హితోపదేశులకూ, అందరికీ వారిని స్మరించుచూ వారి శ్రేయస్సుకు, వారి పురోగమనానికి, ఒక నీటి చుక్క విడువడమే, సంధ్యావందన పరమార్థం. 

మరియు ఈ మానవ ఉపాధిని ప్రసాదించిన తల్లి తండ్రులకు, ఈ ఉపాధిని సన్మార్గంలో నడపడానికి చుక్కానియైన గురువు గార్లకు, హితులకు,సన్నిహితులకు, మిత్రులకు, దైవోపగతులకు, ఆత్మీయులకు, ఆత్మజులకు, మన ఇరుగు పొరుగులకు, సర్వులకు నమస్కరించి వారి అభ్యున్నతిని, శ్రేయస్సును, త్రికరణ శుద్ధిగా అభిలషిస్తూ చేయడమే సంధ్యావందనము.✅



*సంధ్యావందనము:

సంద్యావందన సమయ వివరణ:

**************************


ప్రాతః సంధ్యాసమయము 

ఉదయం 5-12 AM నుండి 6.00 AM వరకు


మద్యాహ్నసంధ్యాసమయము ఉదయం 11-12 AM నుండి 12.00 noonవరకు


సాయం సంధ్యాసమయము సా II 5-12 PM నుండి 6.00 PM వరకు.


ప్రతి రోజూ ప్రాతః సంధ్యావందనము, ఉత్తర సంధ్యావందనము విధిగా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశములో(దేశములో) ఉన్నా సంధ్యావందనము తప్పనిసరి.

సూర్యోదయమునకు ముందు శౌచముతో శుచిగా(స్నానం చేసి)తూర్పు దిశగా కుడి కాలును సగం మడచి ఎడమకాలును పూర్తిగా మడచి, గొంతుకు కూర్చొని అంటే (ఎడమ కాలు మడిము మీద పృష్టభాగము పిర్రలు ఆనించి) పృష్టభాగము(ముడ్డి,గుదము) నేలను(భూమిని) తాకకుండా కూర్చొని, ఆచమనం చేయాలి. అలా ఆచమనం చేయడం వలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరము యందలి తాపములు, వెంటనే ఉప శాంతిని పొందుతాయి.అపుడు మనస్సు నిలబడుతుంది.


ఎప్పుడు ఆచమనం చేసినా ఇదే విధానంలో చేయాలి.


ముఖ్య గమనిక :-

********************************

సంద్యావందనసమయములో తుమ్మడం, దగ్గడం, అపానవాయువును (పిత్తులు, చెడు గాలిని) వదలడం జరిగిన వెంటనే ఆచమనము చేసి కుడిచేతితో కుడిచెవినితాకలి లేదా తడిగా ఉన్న భూమిని తాకాలి.


“ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా!

యస్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిరి!”

అంటూ శిరస్సు మీద జలము(శుద్ద జలము)కుడి చేతి బొటన వ్రేలితో శిరస్సు మీద చల్లుకొనుచూ

ఓం పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః”

కేశవ నామాలు ఆచమనం.

కుడి కాలును సగం మడచి ఎడమ కాలును పూర్తిగా మడచి రెండు కాళ్ళ మీద పృష్టభాగము భూమికి తగులకుండా కాళ్లపైనే కూర్చొని(గొంతుకు)కూర్చొని ఆచమనం చేయాలి.


కుడిచేతి చూపుడు వ్రేలుకు, మధ్య వ్రేలుకు మధ్య, బొటన వ్రేలును ఉంచి, చూపుడు వ్రేలుతో బొటన వ్రేలిని అదిమి పట్టుకొని మిగతా వ్రేళ్లను చాపి ఉంచి, అంటే గోకర్ణాకృతిలో ఉంచి, ఎడమ చేతితో పంచపాత్రలోని శుద్దజలమును కేవలం మినపగింజ మునుగు నంత జలమును, ఉద్ధరణితో కుడిచేతిలో వేసుకొని (తీసుకొనేటప్పుడు కుడి చేతి అరచేతి చివరి భాగమును క్రింది పెదవికి ఆనించి శబ్దము రాకుండా) ముందుగా

“ఓం కేశవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం నారాయణాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. 


అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం మాధవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. 


అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం గోవిందాయ నమః” అని చెప్పుకొనుచూ కుడిచేతిలోని జలమును, ఎడమ వైపు కాలు ప్రక్కన వదలవలయును.

ఎప్పుడు ఆచమనము చేసినా ఇదే పద్దతిన చేయవలయును.


నమస్కారము చేయుచూ ఈ క్రింది నామములు, భక్తితో త్రికరణ శుద్దిగా అంటే మనము ఉచ్ఛరించే ప్రతినామమూ యొక్క రూపమును, హృదయమునందు ఊహించుకొనుచూ శ్రద్ధాభక్తులతో మనో నేత్రముతో స్వామి వారి రూపమును చూచుచూ తదేక ధ్యానముతో ఉచ్చరించవలయును. (కరన్యాస ప్రక్రియ కూడా కలదు) చేయ దలచిన వారు చేయవచ్చు లేదా నామములను మాత్రమే కూడా ఉచ్ఛరించవచ్చు.


ఓం విష్ణవే నమః

ఓం మధుసూధనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోధరాయ నమః

ఓం సంకర్షనాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అదోక్షజాయ నమః

ఓం నరసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీ కృష్ణాయ నమః


భూశుద్ది :- 

*******************************

ఈ మంత్రం చెప్తూ కొద్ది శుద్దజలమును కుడిచేతిలోనికి తీసుకొని మన చుట్టూ చల్లుకోవలయును. ఎందుకంటే మన గృహంలో నిన్నటి రోజున సింహాసనమునకు చేసిన అలంకారము మరియు భగవంతునికి సమర్పించిన ధూపదీప నైవేద్య ఫల పుష్పఫలాది నిర్మల్యాన్ని మనకంటే ముందు భూత పిశాచములు ఆ నిర్మాల్యాన్ని తీయడానికి ప్రయత్నిస్తాయి. 


అందుకొరకు మనము సూర్యోదయానికి పూర్వమే ఆ పని చేయాలి. అందుకొరకు ఈ మంత్రం.


“ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః


ఏ తేషా మా విరోధేన బ్రహ్మ కర్మ 

సమారంభే ||”

ఈ మంత్రం చెప్పుకొన్న తర్వాత రెండు అక్షింతలు తీసుకొని వాసన చూచి వెనుకకు వేసుకోవలయును.


శ్లో || శుక్లాం భరధరం విష్ణుమ్ శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||

శ్లో|| అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ||

అని చెప్పుకొని వినాయకుని కి కొద్ది అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, సమర్పించాలి.

శ్లో || ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్.

శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యేత్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే||


ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః

ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః

ఓం శ్రీ వాణీ హిరణ్యాగర్భాభ్యాం నమః

ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః

ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః

ఓం శ్రీ సీతారామాభ్యాం నమః

ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత యాజ్ఞ వల్కాభ్యాం నమః

ఓం శ్రీ సర్వదిగ్దేవతాభ్యాం నమః

ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః

ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః

ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః

ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః


ప్రాణాయామం:- తూర్పు వైపుకు తిరిగి గొంతుకు కూర్చొని ప్రాణాయామం చేయాలి.

పూరకం:- కుడి బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో, ముక్కును పట్టుకొని, మధ్య వ్రేలినిలోనికి ముడువ వలెను. బొటన వ్రేలును కుడి ముక్కు పైన ఉంగరపు వ్రేలును ఎడమ ముక్కుపైన ఉంచి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.

“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”

కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ

“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!

ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”

రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.

కుడిముక్కునుండి గాలిని వదులుతూ

“భూర్భువ స్సువరోమ్ ”

అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.


ఎప్పుడు ప్రాణాయామము చేసినా ఇదేవిధముగా చేయాలి. సందర్భము ఏదైనా ఇందుకు భిన్నముగా ప్రాణాయామము చేయరాదు.

సంకల్పము:-

కరన్యాసము :- ఎడమ అరచేతిపై కుడి అరచేతిని అడ్డముగా బోర్లించిరెండు చేతులు కలిపి కుడి మోకాలుపై ఉంచి సంకల్పము చెప్పవలయును.


మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యాయా ప్రవర్తమా నస్య ఆద్య బ్రాహ్మణ, ద్వితీయ, పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వర, మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరుహో, దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య, ఈశాన్య ప్రదేశే, సమస్త బ్రాహ్మణ, హరి హర, గురు చరణ, సన్నిధౌ, అస్మిన్, వర్తమానస్య, వ్యావహారిక చాంద్రమనేనా, 


శ్రీ .........................(శుభకృత్) నామసంవత్సరే, ..................(ఉత్తరాయణే) ఆయనే, .............. (వర్ష) ఋతౌ, ................ (వైశాఖ) మాసే,...........(శుక్ల) పక్షే, ........... (చవితి) తిధౌ, ........ (శుక్ర) వాసరే, శుభ నక్షత్రే, (బ్రాకెట్లలో చూపిన సంవత్సర, ఆయన,ఋతు, మాస, పక్ష, తిధి, వారములు పేర్లు ఉదాహరణకు మాత్రమేనని గ్రహింప గలరు) శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ, విశిష్టాయామ్, శుభ తిధౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః సంధ్యా, (ఎడమ చేతిలోని ఉద్దరిణితో జలము తీసుకొని కుడిచేతిని పాత్ర పైన ఉంచి ఉద్ధరిణిలోని జలమును కుడిచేతి మీదుగా పాత్రలోనికి వదలుతూ) ముపాశిష్యే, (అనిచెప్పుకోవాలి).


శుద్ధోదక స్నానం:-

ఉద్దరిణితో జలము తీసుకుని కుడి చేతి బొటన వ్రేలిని ఉద్దరణిలోని జలములో ముంచి తలపై చల్లుకొనుచూ ఈ క్రింది మంత్రమును అను సంధానము చేయవలయును. బ్రాకెట్లో (జ) అని ఉన్న చోటుకు ముందు ఆపి జలమును తలపై చల్లుకొనుచూ ఈ మంత్రమును అను సంధానము చేయవలయును.

ఓం “ ఆపోహిష్ఠమయో (జ) భువహ తాన ఊర్జే (జ)

తధా తన! మహేరాణా య చక్షసే (జ) యోవ శ్శివత యో రస్సః (జ)

తస్య భాజయతే హనః (జ) ఉశ తీరివ (జ) మాతరః (జ)

తస్మా ఆరంగ మామ వో (జ) యస్యక్షయాయ జిన్వథ! (జ)

అపో జనయథా చనః!” (జ)

ప్రాతఃస్సంధ్యా వందనములో 


అనుసంధానించవలసిన మంత్రము

గోకర్ణాకృతిలో ఉంచుకుని యున్న కుడి చేతిలో జలము తీసుకుని

“ సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః, ప్రకృతీ బంధః

సూర్య మామన్యు పాతయ రాత్రిర్దేవతాః జలాభి మంత్రణే వినియోగః”

మంత్రము:-

“ ఓం సూర్యశ్చ మామ న్యుశ్చ మన్యు పతయశ్చ మన్యు కృతేభ్యః

పాపే భ్యో రక్షన్తాo యద్రా త్ర్యా పాపమ కారుషం

మనసా వాచా హస్తా భ్యాం పద్భ్యా ముదరెణ శిశ్నా

రాత్రి స్తద వలుంపతు యత్కించ దురితం మయి

ఇద మహం మామ మృత యోనౌ సూర్యేజ్యోతిషి జుహోమిస్వాహా !!”

అని సంధానించుకొని చేతిలోని జలమును త్రాగవలెను.

ప్రాతః సంధ్యావందనం సంపూర్ణం✍️


ధన్యవాదాలు చదివినవారికి.🙏

(తప్పులు వుంటే మన్నించ ప్రార్ధన)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

Powered By Blogger | Template Created By Lord HTML