.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

9, అక్టోబర్ 2017, సోమవారం

"గరుడ పురాణం"!! "గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!

"గరుడ పురాణం"!!

"గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!

"ఈ ఇద్దరు భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్యాసూయాలు ఎక్కువే! కద్రువ స్వభావం తెలిసిన వినత, తానే ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానం ఉంది."!!
"శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన, వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది. తనకు చాలామంది పుత్రసంతానం ఉన్నప్పటికీ -వినత గర్భందాల్చడం , కద్రువకు ఈర్ష్యా కారణమైంది"!!

"ఒకరోజు సవతులిద్దరూ క్షీరసాగరతీరానికి విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చైశ్శ్రవం కన్పించింది."

"అసుర సంధ్యవేళలో -కనుచీకట్లు పడుడతుండగ ఆ గుర్రాన్ని చూశారు వినత,కద్రువులు. "తెల్లని తెలుపు రంగులో ఆ గుఱ్ఱం ఎంత అందంగా ఉందో చూశావా అక్కా "అంది వినత. "ఆ చూశా !తోక దగ్గర మాత్రం నలుపురంగు ఉంది.అదే లేకుండా ఉంటే , అది అందమైనదే అనడానికి సందేహించనక్కర్లేదు" అంది కద్రువ. ఇక్కడ చెల్లెలు చెప్పిందాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలీదు. ఇంతలో గుర్రం వెల్లిపోయింది"!!

"అదేమిటక్కా !అలా అంటావేం? తోకకూడా తెల్లగానే ఉందికదా!!" అంది తెల్లబోయిన వినత. కొట్టిపారేసింది కద్రువ."!!

"కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది. "మన పతిదేవునికి సాయం సంధ్యానుష్టానం ఏర్పాటు చూడాల్సి ఉంది. పద! రేపు కూడా ఆగుర్రం మేతకు ఇటే వస్తుంది కదా అప్పుడైనా బాగాచూడు " అంది వినత.""

"బాగాచూడాల్సింది నేనుకాదు నువ్వే సరే నేను చెప్పినట్టుగా తోకభాగం మాత్రం నల్లగా ఉంటే , నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలాగాకాకుండా నువ్వుఅన్నట్టు పూర్తితెల్లగాఉంటే, నేనునీకుదాస్యం చేస్తా అంది కద్రువ"!!

"సరేనన్నది వినతి. చాకటిపడడంతో ఇద్దరూ ఎవరి గ్రుహాలకు వాళ్ళువెల్లిపోయారు. కద్రువకూడా వినత చెప్పిందే నిజమని తెలుసు అయిన మాత్సర్యం కొద్దీ అలాఅన్నది. కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆరాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్టుల్ని పిలిచి 'మీలోనల్లనివాళ్ళువెల్లి ఆ ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకుని ఉండండి. రేపుమేము గుర్రాన్ని చూసేవేళకు తోకభాగం నల్లగా కన్పించేలా చెయ్యండు" అని ఆజ్ఞాపించింది"!!

"ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మక్రుత్యం చెయ్యడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మసూక్షాలు చెప్పసాగారు కోపించిన కద్రువ 'మీరంతా అగ్ని గుండాన పడిచస్తారు' అని శపించింది"!!

"వాసుకి అనే సర్పరాజు 'అమ్మా ఇది అధర్మం అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీశాపం తగలదు' అని ప్రతిక్రియగా అన్నాడు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరి ఆమెపంతం నెగ్గేలా చేసారు"!!

"అమాయకురాలైన వినతకూ శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికీ దాస్యవ్రుత్తి తప్పలేదు. తండ్రి వద్దకువెల్లి గరుడుడు మొరపెట్టుకోగా నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను ఇంద్రునితో మైత్రి సంపాదించు నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు 'అని వలం ఇచ్చాడు కశ్యప్రజాపతి. దాస్యవ్రుత్తికి అమ్రుతం తెచ్చివ్వమంది కద్రువ."!!

"గరుడుడు దేవలోకానికి వెల్లి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది , తనతల్లి దాస్యం సంగతి చెప్పాడు. అంతావిన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం , దాస్యవిముక్తి జరగగలదని ఆ ఉపాయం గరుడునికి ఉపదేశించాడు. పాములకు అమ్రుతం పోయడం కూడా మంచిది కాదన్నాడు కూడా"!!

"ఇంద్రుడు చెప్పినట్టే అమ్రుతభాండం తీసుకెళ్ళీ కద్రువ చేతిలో పెట్టి దాస్యవిముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు. వినతను స్వేఛ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే, ఇంద్రుడు అద్రుశ్యరూపంలో వచ్చి ఆ అమ్రుతభాండాన్ని మాయం చేశాడు. తల్లీకొడుకులకు దాస్యవిముక్తి లభించింది. తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడుడు."!!

"కశ్యప్రజాపతి పుత్రుడి శిరస్సు నిమిరి 'సర్పాల్లాంటి పుత్రులు వేనకువేలు ఉన్నా ప్రయోజనం శూన్యం. నీవంటి ఒక్క పుత్రునివల్ల నాకీర్తి కూడా ఇనుమడించింది. నువ్వు శ్రీహరి వాహనమై, నిరంతర విష్ణులోక వాసి వవుతావు'అని దీవించాడు"!!

"శ్రీహరిని గూర్చి కఠోరతపస్సు చేసిన గరుడుడు, ఆయనను మెప్పించి , తనతండ్రి ఇచ్చిన దీవెన నిజం చెయ్యమన్నాడు. గరుడుని అసాధారణ భక్తిశ్రద్దలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోడానికి అంగీకరించాడు. ఇదీ గరుడుడు విష్ణువుకు వాహనవైన విధం"!!
'సమాప్తం'

"ఓంనమఃశ్శివాయ"
"జై శ్రీరాం"!!
Read More

కలిసంతానం వినాయకుడిపై పడింది...



కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు.
నా వాల్ లో.విఘ్నేశ్వరుడి గురించి రాయడం అద్రుష్టంగా భావిస్తూ వీటన్నిటికి సమాధానంగా ఈ పోస్ట్ రాస్తున్నాను..
మీ సందేహాలు అన్ని తీరిపోయాక కూడా మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తే మీరు ఒకే తల్లి,తండ్రులకి పుట్టలేదని భావించాల్సి ఉంటుంది..

పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు...వీడు మహా శివభక్తుడు..ఎంతటి భక్తి అంటే శివుడు తన ఒక్కడికే సొంతం కావాలని..ఘోర తపస్సు చేసి మహాదేవుడిని తన ఉదరంలోనే ఉండమని వరం కోరుకున్నాడు..శివుడు సరేనన్నాడు..మహాదేవుడే అచేతనంగా ఉండటంతో సృష్టిధర్మం గతి తప్పింది..విష్ణువు ఒక ఉపాయం ద్వారా గజాసురుడికి బుద్ది చెప్పి శివుడు బైటకు వచేలా చేసాడు..
అలా బైటకు వచేటప్పుడు గజాసురుడి ఉదరం చీలింది..
అప్పుడు మహాదేవుడు "గజాసురా నీది గొప్పభక్తి.కాని స్వార్ధం వల్ల వినాశనం కొనితెచ్చుకున్నావు..ఇంకేదైనా వరం కోరుకో" అన్నాడు...అందుకు ఆ రాక్షసుడు దేవా! నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ మీ సమక్షంలో ఉండేలా అనుగ్రహించమన్నాడు.శివుడు 'తధాస్తు' అన్నాడు.
ఆ తర్వాత కైలాసానికి వస్తున్న శివుడిని వినాయకుడు అడ్డుకోవడం,వద్దని వారించిన దేవతలను పరాజితులని చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో శివుడు వినాయకుడిని దండించాడు...మళ్లీ గజాసురుడి శిరస్సుతో బ్రతికించాడు..


కైలాసంలో జరగబోయే సంఘటన ముందే తెలుసుకనుకే గజాసురుడికి నువ్ ఎల్లప్పుడూ మా సమక్షంలో ఉంటావని వరమిచ్చాడు..అలాగని ఏ చెట్టుగానో చీమగానో కైలాసంలో ఉండమని చెప్పవచ్చు..కాని అతని అనితరసాద్యమైన భక్తికి మెచ్చుకుని ఏకంగా తన పుత్రుడి స్థానాన్నే ఇచ్చాడు..
అది మహాదేవుడి కరుణ..అపారం.....

ఏనుగు మదించిన బలానికి,బుద్దికి గుర్తు....
వర్షాకాలంలో అడవిఅంతా దట్టంగా అల్లుకుపోతుంది...అప్పుడు అన్ని జీవులు ఏనుగు కోసం చూస్తాయి...ఏనుగు నడుస్తూ పోతుంటే దారి ఏర్పడుతుంది..ఆదారిలో ఇతర జీవులు తేలికగా ప్రయాణం చేయగలుగుతాయి.."అందువల్ల వినాయకుడు దారి చూపించేవాడు".
ఎలుక చపల చిత్తానికి,తామస బుద్దికి ప్రతీక.ఎలుక మీద స్వారి చేయడమంటే కామ,క్రోదాలని అదుపులో ఉంచడమే..
భూత,భవిష్య,వర్తమాన కాలాలను బొజ్జలో దాచుకుంటాడు కనుక లంభోదరంతో ఉంటాడు.
ఒకపక్క విరిగిన దంతం త్యాగాబుద్దిని సూచిస్తుంది.
.
వినాయకుడు అంటే "విశేషమైన నాయకుడు" అని అర్ధం... ప్రమదగణాలకు,దేవగణాలకు నాయకత్వం వహించడానికి అత్యంత సమర్ధత ఉండాలి..అంతటి సమర్ధుడు కనుక శివుడు ఆ భాద్యతని వినాయకుడికి ఇచ్చాడు.
ఉపాసనా సాంప్రదాయంలో దైవరూపంలోని శక్తిని భార్యలుగా ఆరాధిస్తారు..సిద్ది,బుద్ధి ని కలిగించే దైవం కనుక వాటిని ఆయన భార్యలుగా,స్త్రీదేవతా రూపంలో ఆరాధిస్తారు
గణపతి ఆరాధన చాలా తేలిక. గడ్డిపరకతో పూజించినా ప్రసన్నుడౌతాడు.
ఇంకా చాలా చెప్పవచ్చు కాని లెంగ్త్ ఎక్కువవుతుంది కనుక ఇక్కడితో ముగిస్తున్నాను..

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే.
Read More

ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?"..



ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?"..
"స్త్రీలకి దైవత్వం ఉండదని, అలాగే దైవానికి స్త్రీ తత్వం ఉండే అవకాశమే లేదని బైబిల్ రచయతల నమ్మకం".
అందుకే వారు దైవాన్ని పురుషుడుగానే సంభోదించారు..ఎక్కడా స్త్రీ దేవత అనే పదం వారి ఊహలో కూడా చేయలేకపోయారు..
స్త్రీకి దైవత్వం ఇవ్వకపోయారు సరే కనీసం మనిషిగానైనా గుర్తించారా???
"క్రీ.శ.581 లో స్త్రీలకూ కూడా ఆత్మలు ఉంటాయా?" అనే తీవ్రచర్చ యూరప్ లోని చర్చ్ లో జరిగింది..జంతువులు మాదిరి స్త్రీలకూ ఆత్మలు లేకుంటే ...స్త్రీ జంతువుతో సమానమే కదా.మరి జంతువుకు ఏసులాంటి మహనీయుడు జన్మించాగాలడా?అనే ప్రశ్న వచ్చి వారు "మేరీ ని పవిత్రకన్య గా అంగీకరించి పూజించేవారు క్యాథలిక్కులు...దీనిని వ్యతిరేకించి కేవలం యెహోవా,జీసస్ లను పూజించేవారు ప్రోతెష్టేంట్ లుగా చర్చి విడిపోయింది"


ఆదికాండం- 3;16..పురుషుడు స్త్రీని ఏలును..
తిమోతి -2;12..స్త్రీ మౌనంగా ఉండవలసిందేగాని ఉపదేశించుటకైనా,పురుషుని మీద అదికారము చేయుటకైననూ ఆమెకు సెలవీయను..
పురుషుడి ముందు స్త్రీ మాట్లాడటానికి కూడా ఒప్పునేది లేదని బైబిల్ సెలవిస్తుంది...

ఇది బైబిల్ రాయబడిన 2000 సంవత్సరాల క్రితంనాటి "రోము-గ్రీసు" సంస్కృతులకు దర్పణం పడుతుంది..

పాశాత్య దేశాలలో దీనిని వ్యతిరేకించి స్త్రీ స్వేఛ్చ కోసం పోరాటాలు జరిగి అవి ఇప్పుడు విశృంఖలంగా మారాయి..

"స్త్రీని జగన్మాతగా, ఆదిశక్తిగా పూజించే" హైందవధర్మాన్ని విడిచి సుమంగళి రూపం ఐన పసుపు కుంకుమ, బొట్టు గాజులు తీసి ఇలాంటి బైబిల్ ని దైవగ్రంధం అని నమ్మి.. చర్చిల్లో నెత్తిమీద ముసుగేసుకుని చేతులు పైకెత్తి శోకాలు పెట్టే మిమ్మల్ని చూసి........

మీకు తగినశాస్తి జరిగిందని ఆనందపడాలో, మా భారతీయ ఆడపడుచులకి పట్టిన ఈ దుస్థితికి భాదపడాలో అర్ధంకావడం లేదు....


Read More

యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..



యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..
ఈ ప్రశ్నకి సమాదానం బైబిల్ లో దొరుకుతుంది.....ఒకటి కాదు రెండు దొరుకుతాయి...పరిశుద్దగ్రందం అంటే మాటలా..
1)అతడు పశ్చాతాపం చెంది యేసుని అమ్మగా వచ్చిన ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునెను..(మత్తయ్-27;3,4,5)
2)యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను..అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బైటకు వచ్చెను..ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చెను..(అపోస్తులుల కార్యములు-1;18)


చూశారా ఎంత అద్భుతంగా రెండు రకాలుగా ఉందో....ఈ రెండు వెర్షన్ లే కాక మూడోది కూడా ఉంది..
యేసు శిష్యులు మిగిలిన పదకొండు మంది అతనిని కొట్టి చంపారనేది చారిత్రిక సత్యం....దానికి వక్రీకరించి ఇలా రాశారు...రాసుకున్నారు సరే అందరూ ఒకరకంగా రాయకుండా ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకున్నాడు..

అసలు యేసుని పాపుల కోసం సిలువ వేయబడటానికే దేవుడు పంపించాడు అని చెప్పుకుంటారు కదా!!!!...

"దేవుడు కోరుకున్నదే యూదా చేశాడు........ దేవుడి నిర్ణయాన్ని అమలు చేసి యేసు సిలువ వేయబడటానికి కారణమైన యుధాని పాపిగా,విలన్ గా చూపించారెందుకు"???

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?
Read More

Powered By Blogger | Template Created By Lord HTML