.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

శివుడు ఎవరు ?

శివుడు ఎవరు ?

     ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం తోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అ౦దుకే సదా శివుడు అ౦టాము. అ౦తయు శివుడే అ౦దుకే ఆ౦దరు దేవతలు శివారాదకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలి౦గారాదన చేస్తు౦టారు. పరమశివుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అ౦తటా ఉ౦డేవాడు. శివుడు ఎ౦తవరకు విస్తరి౦చాడో కనుగొనట౦ అస౦బవ౦. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం.

మరొక ఇతిహాసములో:
"బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మ నిచ్చింది ఆది పరాశక్తి. పరాశక్తి కి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహా నంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతి లను సృష్టించాడు. ఆ ముగ్గురమ్మలను ఈ త్రిమూర్తులు పరిణయమాడారు " అని ఉంది.

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కఅర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాల కు ప్రతి రూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

శివుడు కేవలం రుద్ర (రౌద్ర) స్వరూపమే కాక, ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే - శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణా మూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
Read More

శ్రీ నారాయణ తీర్ధులు

 శ్రీ నారాయణ తీర్ధులు

ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, గురువు ఎవరో తెలియని వైనం సాయిబాబా.. మహాసమాధియైన ప్రదేశం గూర్చి ఏకాభిప్రాయం ఉన్నది. అయితే లీలాశుకుల, జయదేవుల అవతారంగా భావింపబడే నారాయణతీర్థులవారి మహాసమాధి అయిన క్షేత్రం గూర్చి భిన్నాభిప్రాయాలున్నాయి.

శ్రీనారాయణతీర్ధులు పూర్వాశ్రమ నామం తల్లావఝుల గోవిందశాస్త్రి, తండ్రి పేరు నీలకంఠశాస్త్రి, వీరిది గుంటూరు జిల్లాలోని కాజగ్రామం.

గోవింద శాస్త్రికి వివాహమైంది. అత్తవారింటికి వెళ్తుంటే కృష్ణానది వరదల్లో చిక్కుకుపోయాడు. ప్రాణసంరక్షణార్టం సన్యాసం స్వీకరించాడు. అనంతరం అత్తవారింటికి. చేరుకున్నాడు క్షేమంగా. ఆయన భార్యకు యతీశ్వరునిలాగా కన్పడ్డాడు. కారణం ఏమిటని భార్య అడిగింది. సంగతి చెప్పాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించి, తనను శిష్యురాలిగా స్వీకరింపుమని కోరింది. వారిద్దరిప్పుడు భార్యాభర్తలు కారు. గురువు శిష్యులు. అది దైవలీల!

ఆయన చేసిన రచనల వల్ల గోవిందశాస్త్రి (అంటే నారాయణతీర్థులవారు) రామగోవిందులనే శివరామతీర్ధుల వద్ద సన్యాసదీక్ష తీసుకున్నారని, వాసుదేవశాస్త్రి వద్ద సకల శాస్త్రాలు తెలుసుకున్నారని తెలుస్తుంది.

గురువు శివరామతీర్ధులు (శివరామానంద) కాశీపురవాసి. శిష్యుడు నారాయణతీర్ధులు గొప్ప కృష్ణ భకుడు, సిద్ధపురుషుడు. అనేక రచనలను చేశాడు. ఆయన రచనలు పండిత పామర మనోరంజకాలు. వాచస్పతిమిశ్ర, మధుసూధన సరస్వతులను పాండిత్య ప్రభావైభవాలలో మించినవారు నారాయణతీర్థులు,

సంస్కృతయక్షగానం శ్రీకృష్ణలీలాతరంగణి, లీలాశుకుల శ్రీకృష్ణకర్ణామృతమును, జయదేవుల గీతాగోవిందాన్ని మరిపిస్తాయి.

"కృష్ణం కలయ సఖి సుందరం...." వినని తెలుగు వారుండరేమో, తెలుగులో పారిజాతాపహరణం అనే యక్షగానాన్ని మేలటూరు భాగవతుల కోసం రాశారు. శ్రీకృష్ణలీలాతరంగిణి కృష్ణ కథను (రుక్మిణీ కళ్యాణం వరకు) 12 అంకాలుగా మలచిన యక్షగానం, ప్రదర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇది భాగవతానికి ఉన్న 12 స్కంధాలకు ప్రతీక అనే పేరున్నది.

త్యాగరాజుల గురువు శొంఠి వెంకటరమణయ్య తండ్రి నారాయణతీర్కలవారి శిష్యుడే. ఇంకా ఆయనకు గౌడ బ్రహ్మానందులు, కాశ్మీర సదానందులు, ఆంధ్రమహేశ్వర తీర్థులు.. ఇలా ఎందరో శిష్యులు ఉన్నారు. గురువును మించిన శిష్యుడు గురువు రామానందులు ఒక కుటీరంలో, శిష్యుడు నారాయణతీర్ధులు మరో కుటీరంలో దూరంగా ఉండేవారు. 

భక్తి భావనచే నారాయణతీర్థులకు కృష్ణదర్శనం అయ్యేది. అప్పుడు కుటీరమంతా వెలుగులతో నిండిపోయి ఉండేది. ఇదేమీ అర్థం కానట్టి ఇతర శిష్యులు నారాయణతీర్దులపై చాడీలు చెప్పారు. ఒకనాటి రాత్రి స్వయంగా గురువు రామానందులు శిష్యుని కుటీరంలోనికి తొంగి చూచాడు. 

ఆ "వెలుగుకు కంటి చూపుపోయింది. అక్కడే కూలబడిపోయాడు. తెల్లవారింది, నారాయణ తీర్థులు బయటకు వచ్చి గురుదేవులను చూచాడు. గురుదేవులు తాను చేసిన పనిని చెప్పి, కృష్ణదర్శనం తనకు చేయింపుమని కోరాడు శిష్యుడిని. 

తన గురువుకు కంటిచూపును, దర్శనాన్ని కలుగ చేయమని కృష్ణుడిని ప్రార్ధించాడు నారాయణ తీర్థులు, కృష్ణుడు దర్శనమిచ్చాడు. కంటిచూపు వచ్చింది గురువుకు. కృష్ణుడిని చూడగలిగాడు. 
ఏ శిష్యుడైనా గురువుకు ఇంతకంటే ఎక్కువగా ఏం రుణం తీర్చగలడు? 

కడుపునొప్పి :

ఒకసారి నారాయణతీర్థులకు కడుపునొప్పి వచ్చింది, ఎంతకూ తగ్గలేదు. స్వప్నంలో పందులు కనబడతాయని, వాటిని అనుసరింపుమని ఆదేశం వచ్చింది. తెల్లవారింది. పందులు కనబడ్డాయి. వాటి వెంట పోగా వరాహపురి వద్ద ఆగాయి. ఆ క్రితం రాత్రి గ్రామ పొలిమేరలకు వచ్చే వ్యక్తిని మేళతాళాలతో వెంకటేశ్వరాలయానికి తీసుకుపొమ్మని గ్రామ పెద్దలకు ఆదేశం వచ్చింది. అలాగే వారు వచ్చి నారాయణతీర్శలను వెంకటేశ్వరాలయానికి తీసుకుపోగానే కడుపునొప్పి మటుమాయమైంది. అక్కడనే ఆయన మహాసమాధి చెందాడంటారు. దగ్గరలోనే ఉన్న తిరుప్పందురుత్తిలో మహాసమాధి అయ్యాడని మరొక వాదన.

"కృష్ణంకలయసఖి సుందరం..." అని పాడుతూ ఆయనను స్మరిద్దాం.

సద్గురుకృప మాస పత్రిక నుంచి.

Read More

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే.

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే... చతుర్ముఖ బ్రహ్మగారు జీవుడిని సృజించే ముందు పుర్రె చేత్తో పట్టుకుని రాయడం మొదలుపెడతాడట. వీడికి చదువెంత ఉండాలి.. రాస్తాడు. వీడికి ఆయుర్దాయం ఎంత... రాస్తాడు. బలం... రాస్తాడు. ఐశ్వర్యం ఎంతుండాలి...ఇది రాసేముందు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాడట. ''గతజన్మలో ఈ పుర్రెపేరేమిటి? ఈ జీవుడు ఏ పేరుతో బతికాడు ?'' అని అడుగుతుందట అమ్మవారు. ఫలానా వాడమ్మా... అని చెబుతాడు.. ఆవిడ ఏమీ అనకపోతే...'సామాన్యం' అని రాస్తాడు.

ఆవిడ విని 'వీడా, ఒకరికి పెట్టినవాడు కాదు' అని తలదించుకుంటే... 'దరిద్రుడు' అని రాస్తాడు. పేరు వినగానే 'ఆ! వాడా.. అని ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే....'మహదైశ్వర్యవంతుడు' అని రాస్తాడట. కలిసొచ్చింది, కలిసొచ్చింది... అంటారే, ఎక్కడినుంచి వచ్చింది? అదంతా గత జన్మలతాలూకు పుణ్యం. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. అదంతా ఇక్కడిదానికి సరిపోయింది. ఆ ఐశ్వర్యాన్ని, ఆ బలాన్ని, ఆ తెలివితేటలను ఉపయోగించి ఈ జన్మలో నీవు కూడబెట్టిందేమిటి? దాన్ని పుణ్యంకింద మార్చుకోవాలిగా...!!! ఎలా..!!!

నేనిక్కడినుంచి అమెరికా వెళ్ళాలి. ఇక్కడి రూపాయలు ఎన్ని పట్టుకెళ్ళినా అక్కడ ఓ కప్పు కాఫీకూడా దొరకదు. ఇక్కడి ధనం అక్కడ పనికిరాదు. అందుకని బయల్దేరేముందే దాన్ని అక్కడి ధనం ... డాలర్లకింద మార్చుకోవాలి. అప్పుడు అది పెట్టి కాఫీ కానీ మరేదయినా కానీ తీసుకోవచ్చు. కానీ రూపాయలు అక్కడ చెల్లవు. అలాగే, ఇక్కడ సంపాదించిన ధనం, బలం, తేజస్సు, తెలివితేటలు... అన్నీ ఇక్కడితో సరి. అవి ఉత్తర జన్మలకిక పనికిరావు. మరి ఉత్తరజన్మలకూ కూడా పనికివచ్చేటట్లు మార్చుకునే ప్రక్రియ ఒకటుంది.

రూపాయలు అమెరికా డాలర్లుగా మారినట్లు, దానితో ఇక్కడి బలం, ధనం... పుణ్యధనంగా మారుతుంది. ఎలా ?నీకు ఒంట్లో బలముంది. మనగుడి కార్యక్రమానికి వెళ్ళి ఓ దేవాలయాన్ని తుడిచావు. కొంతమంది  ఏ క్షేత్రానికి వెళ్ళినా కొంతసేపు అక్కడ శ్రమించి స్వచ్ఛందంగా గుడికి, భక్తులకు సేవ చేస్తుంటారు. 63 మంది నాయనార్లలో ఒకడైన అప్పర్‌ నాయనార్‌ ఇలా చేస్తుండేవారు. ఇక్కడ బలం ఉంది. పల్లకి మోసావు. పూజా సామాగ్రిని శుభ్రపరిచావు. నీకు పాండిత్యం ఉంది.. పరుల హితం కోసం ఉపయోగించావు. 

శాస్త్రాన్ని శాస్త్రంగా ప్రబోధం చేసావు. ఇలా నీవు ఇక్కడ ఉపయోగించినదంతా పుణ్యధనంగా మారుతుంది. ఎవరు మారుస్తారు అలా... చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాసుకునే వాడొకడున్నాడు. వాడే చిత్రగుప్తుడు.  వాడెవరో కాదు, ఈశ్వరుడే. నీకిచ్చిన బలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు రాసుకుంటాడు.ఇక్కడ ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దానిని పుణ్యధనంగా మార్చుకోవడానికి ఏర్పడిన కేంద్రం– ఇంటిలో అయితే పూజగది, సమాజంలో అయితే దేవాలయం. ప్రతివాడికి ఏదో ఒక విభూతిపెట్టాడు, దానిని పరుల హితంకోరి, ఈశ్వరపరంచేయడమే పుణ్యధనంగా మార్చుకోవడం.

అటువంటి విభూతులలో ఒకటి–అతిథి. ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడిగా కనిపించినా, సామాన్యుడు మాత్రంకాడు. నీ గతజన్మ తాలూకు పాపాలను త్వరగా నశింపచేయడానికి పరమేశ్వరుడు ఏరికోరి మహాత్ములను అతిథులుగా పంపుతాడు. కనుక ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడంవల్ల నీ పాపాలన్నీ నశించి, ఉత్తర జన్మలకోసం కావలసినంత పుణ్యధనాన్ని మూటగట్టుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది.

- ✍ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
సేకరణ హిందూ ధర్మచక్రం

Read More

రేపటి నుంచి ఫాల్గునమాసం.

రేపటి నుంచి ఫాల్గునమాసం. 

పౌర్ణమినాడు ఫల్గునీ నక్షత్రం ఉన్న 'చాంద్రమాన'మాసం ఫాల్గునమాసం. ఫాల్గుణము అని వ్రాయకూడదు. ఫాల్గునము అన్న అక్షర క్రమమే సరైన శబ్ద స్వరూపము. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు పుట్టిన పాండవ మధ్యముడు ఫల్గునుడయ్యాడు. ఈ మాసం శిశిర ఋతువుకు పరాకాష్ఠ. వసంత ఋతువుకు 'ద్వారం' వంటిది.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.
Read More

కస్తూరి

కస్తూరి

కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి కలిగి ఉంటుంది.

కస్తూరిని ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.

"కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి"

అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీకృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ!  ఆ సమయంలోముందు నీకొచ్చిన సందేహం ఏమిటి అంటారా?  ఈ కస్తూరి అనేదితిలకం పేరా?  లేక తిలకాన్నే కస్తూరి అంటారా?  అదొక తిలకం బదులు వాడే ఆభరణమా?  కస్తూరి అంటే ఏమిటి?  అని.

పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావనఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి. 

"చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం
సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం

వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య
వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న
దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం"

అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడిన వాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది. 

ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం
కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

"కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె"
అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం.

కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది. ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్నివిషయాలు తెలుసు కుందాం. 

వాస్తవానికి కస్తూరి అనేది
అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలనకృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు. కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. 

ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము.

కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట.  ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.దీనిని టిబెట్, చైనా, తదితరప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు.

కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాల నుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్.  దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట.

అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.

ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది.
ఎలా అంటే:

01. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలోనూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగావాడుతున్నారు.

02. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకివాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటినొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరిరసం పట్టించేవారు.

03. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనేదీనిని తాంబూలంలో కలిపి తింటారు.

04. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట,బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికిఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.

05. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగనాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్నితగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదాచల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషిబ్రతుకుతాడని నమ్మిక.

06. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ,నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికిఇది చక్కని మందు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీముఖ్యమయినవి మాత్రం . కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు.  శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయినకుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.

కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా?  ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.

"మృగ మదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!"

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచివాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకిఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును.దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది....దీని నీతి.

"కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!"

"గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!"

అంత సరళమయిన భాష వాడారు.

అంతే కాకుండా కస్తూరిని తిలకధారణలోను, పండుగలు విశేష కార్యక్రమాలలో దేవుళ్ళకు అభిషేకం లోను వాడుతారు.  ఈ సుగంధద్రవ్యం ప్రత్యేక సువాసనే కాదు ప్రతేక ఆకర్షణని కూడా కలిగి ఉంటుంది.  కస్తూరిని ఆరోగ్యం, అభిషేకం, పూజ, హోమం మొదలైన వాటిలో వాడుతారు.  కస్తూరి పసుపు ను అందం కోసం వాడుతారు.  కస్తూరి కుంకుమ ను ఆకర్షణ కోసం వాడుతారు.  కస్తూరి కాయ ను స్థిర లక్ష్మి కోసం ప్రయోగిస్తారు.  కస్తూరి తిలకం ఆకర్షణ మరియు అభిషేకాలలో వాడుతారు.

… శ్రీ ములుగు విశ్వనాథ శర్మ
Read More

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..!!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రవణబెళగొళ ఉంది. చరిత్ర విషయానికి వస్తే.. మౌర్యచంద్రగుప్తుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్లు చెబుతారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రవణబెళగొళలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎత్తైన గొమఠేశ్వరుడి  విగ్రహం(బాహుబలి విగ్రహం) ఉంది. పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనుచూపు మేర నుంచే ఈ విగ్రహం కనిపిస్తుంది. అబూ కొండలు(రాజస్థాన్), ఉదయగిరి కొండలు (ఒడిశా) తరువాత జైనులకు పవిత్ర పుణ్యస్థలిగా శ్రవణబెళగొళ ఖ్యాతి గాంచింది. 

శ్రవణబెళగొళ మళ్లీ పర్యాటకులను ఆకర్షిస్తుండటానికి ప్రధాన కారణం గోమఠేశ్వరుడి విగ్రహం(బాహుబలి విగ్రహం). ఇక్కడ 12 ఏళ్లకోసారి లేదా పుష్కరానికోసారి భారీ వేడుక జరుగుతుంది. 58.8 అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహానికి మహామస్తకాభిషేకం చేస్తారు. ఈ వేడుక ఫిబ్రవరి 7 నుండి 26 వరకు కన్నులపండుగగా జరగనుంది. క్రీ.శ.981లో ప్రతిష్టించిన ఈ విగ్రహానికి ప్రతి 12 ఏళ్లకొకసారి అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పూలు, బంగారునాణేలతో అభిషేకం చేస్తారు. 

మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జైన మతస్థులతో పాటు ఇతర మతాలవారు కూడా ఈ భారీ వేడుకలకు హాజరుకానున్నారు. ఉత్సవంలో విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తారు.  ఆ మహత్తర ఘటాన్ని చూడాలే గానీ.. మాటల్లో వర్ణించలేము. 

శ్రవణబెళగొళ వెళ్లే పర్యాటకులు, భక్తులు సమీపంలో ఉన్న హాలిబేడు, బేలూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. అలానే శృంగేరీ, కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం, ధర్మస్థల వంటి పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. 

శ్రవణబెళగొళ ఎలా చేరుకోవాలి? 

శ్రవణబెళగొళ బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో, మైసూర్‌కు 85 కిలోమీటర్ల దూరంలో  ఉంది. బెంగళూరు నుండి శ్రవణబెళగొళకు నిత్యం ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. క్యాబ్, ప్రైవేట్ టాక్సీ లలో కూడా ప్రయాణించవచ్చు. సమీపంలో హసన్ రైల్వే స్టేషన్ కలదు.🙏🙏🙏
Read More

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం
☀☀☀☀☀☀☀☀☀☀☀
శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..!!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రవణబెళగొళ ఉంది. చరిత్ర విషయానికి వస్తే.. మౌర్యచంద్రగుప్తుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్లు చెబుతారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రవణబెళగొళలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎత్తైన గొమఠేశ్వరుడి  విగ్రహం(బాహుబలి విగ్రహం) ఉంది. పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనుచూపు మేర నుంచే ఈ విగ్రహం కనిపిస్తుంది. అబూ కొండలు(రాజస్థాన్), ఉదయగిరి కొండలు (ఒడిశా) తరువాత జైనులకు పవిత్ర పుణ్యస్థలిగా శ్రవణబెళగొళ ఖ్యాతి గాంచింది. 

శ్రవణబెళగొళ మళ్లీ పర్యాటకులను ఆకర్షిస్తుండటానికి ప్రధాన కారణం గోమఠేశ్వరుడి విగ్రహం(బాహుబలి విగ్రహం). ఇక్కడ 12 ఏళ్లకోసారి లేదా పుష్కరానికోసారి భారీ వేడుక జరుగుతుంది. 58.8 అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహానికి మహామస్తకాభిషేకం చేస్తారు. ఈ వేడుక ఫిబ్రవరి 7 నుండి 26 వరకు కన్నులపండుగగా జరగనుంది. క్రీ.శ.981లో ప్రతిష్టించిన ఈ విగ్రహానికి ప్రతి 12 ఏళ్లకొకసారి అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పూలు, బంగారునాణేలతో అభిషేకం చేస్తారు. 

మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జైన మతస్థులతో పాటు ఇతర మతాలవారు కూడా ఈ భారీ వేడుకలకు హాజరుకానున్నారు. ఉత్సవంలో విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తారు.  ఆ మహత్తర ఘటాన్ని చూడాలే గానీ.. మాటల్లో వర్ణించలేము. 

శ్రవణబెళగొళ వెళ్లే పర్యాటకులు, భక్తులు సమీపంలో ఉన్న హాలిబేడు, బేలూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. అలానే శృంగేరీ, కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం, ధర్మస్థల వంటి పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. 

శ్రవణబెళగొళ ఎలా చేరుకోవాలి? 

శ్రవణబెళగొళ బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో, మైసూర్‌కు 85 కిలోమీటర్ల దూరంలో  ఉంది. బెంగళూరు నుండి శ్రవణబెళగొళకు నిత్యం ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. క్యాబ్, ప్రైవేట్ టాక్సీ లలో కూడా ప్రయాణించవచ్చు. సమీపంలో హసన్ రైల్వే స్టేషన్ కలదు.🙏🙏🙏
Read More

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1 
 
మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రధాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు.  ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారధిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు.  అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు.  అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు.  ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు.  ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై బాణాల వాన కురిపించాడు.  ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు.  ద్రోణుడు దానిని పొడి చేసాడు.  ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు.  ద్రోణుడు దానిని కూడా విరిచాడు.  మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు.  ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారధిని, హయములను చంపి విల్లును విరిచాడు.  ధృష్టద్యుమ్నుడు రధము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు.  ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు.  ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు.  ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది.  ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు.  ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు.  ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.

సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు.  ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన , ద్రుపదుని పైన బాణములు సంధించాడు.  ధర్మరాజు ఇంతలో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు.  ఛేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు.  కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు.  కేతుమంతుని ధాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యాయి.  మిగిలి వారు పారి పోయారు.  కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు.  కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గధను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి, కేతనం విరగటమే కాక నిముషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది.  భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేసాడు.  అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రధాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా, భీమసేనుడు బెదరక ఒక్క గదా ఘాతంతో శక్రదేవుని సంహరించాడు.  కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై పదునాలుగు తోమరములు విసిరాడు.  భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేసాడు.  కళింగ రాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు.  ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు.  భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి.  భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు.  అది చూసిన కళింగరాజు ఒక్క సారిగా భీమసేనుని పైన పడమని తన గజ సన్యాలను పురికొల్పాడు.  ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తొండములు నరక సాగాడు.  రధికులను, సారధులను, రధములకు కట్టిన అశ్వములను నరక సాగాడు.
Read More

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

       🌷🌷🌷 ..... చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది...... 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం..... . చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు......శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు..... 🌷🌷🌷

             🌷🌷🌷 ..... సమస్త పాపాలను హరించివేసి ... సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది..... రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... . మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి....  దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది.... దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.....🌷🌷🌷 

      🌷🌷🌷 .....శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు..... . అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు.... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు.... . అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు..... ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు....జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు....🌷🌷🌷

       🌷🌷🌷....రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి.... 
ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి.... అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి....  వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం..... 🌷🌷🌷

       🌷🌷🌷 ..... మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు....🌷🌷🌷

💠అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది.  

💠రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

💠పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.

💠రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

💠మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి. 

💠రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

💠అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

💠రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడ…
Read More

వివాహ వేడుకలో వధూవరుల చేత ఏడడుగులు నడిపిస్తారు కదా! ఎందువల్ల?

వివాహ వేడుకలో వధూవరుల చేత ఏడడుగులు నడిపిస్తారు కదా! ఎందువల్ల?
'సప్తపది'కి ప్రత్యేకమైన అర్థమేమైనా ఉందా? 

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. 
హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకమైన అర్థం పరమార్థం ఉన్నాయి. కన్యాదానం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు వేదపండితులు. 

ఈ క్రతువు పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని 'సప్తపది' అంటారు. 

దీనికి విశేష నిర్వచనం ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

మొదటి అడుగు 
''ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు''

విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!

రెండో అడుగు 
''ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు''
 
మనిద్దరికీ కలిసి జీవించేశక్తి లభించేలా చేయుగాక!

మూడో అడుగు 
''త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు''
 
వివాహవ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక!

నాలుగో అడుగు 
''చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు''

మనకు అమితమైన ఆనందమును విష్ణువు కల్గించుగాక!

అయిదో అడుగు 
''పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు''
 
మనకు సమస్త సంపదను విష్ణువు కల్గించుగాక!

ఆరో అడుగు 
''షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు''

ఆరు రుతువులు మనకు అనుకూలంగా సుఖమిచ్చుగాక!

ఏడో అడుగు 
''సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు''
 
గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు కావల్సిన సమస్త శక్తి యక్తులు అ మహా విష్ణువు అనుగ్రహించుగాక!

''ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. నువ్వు నా స్నేహమును విడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసులతో జీవిద్దాం. మనం ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం' అంటాడు వరుడు.
అప్పుడు పెళ్లికుతూరు ఇలా అంటుంది.. 

''ఓ ప్రాణమిత్రుడా! నువ్వెప్పుడూ నాయొడల పొరపాటు లేకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు లేకుండా నీతో ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి. నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని. నువ్వు మనసైతే నేను మాటను. నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే రుత్వికుడివి. మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం'' అంటుంది.

''ఓ గుణవతీ! మన వంశాభివృద్ధి కోసం, మనకు ఉత్తమస్థితి కలగటం కోసం, మంచి బలము, ధైర్యము, ప్రజ్ఞావంతులైన వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానం ప్రసాదించు'' అని వరుడు చెబుతాడు. నీ సహధర్మచారిణిగా నాకర్తవ్యం అంటుంది వధువు. ఆతరువాతే వారిరువురూ గృహస్తధర్మానికి అర్హులవుతారు.
Read More

Excellent. Must Read...

Excellent. Must Read...

A rare conversation between 
Ramkrishna Paramahansa
 & 
Swami Vivekananda

Please share with our next generation or read it loud to family, it's one of  the best message I have come across...

1. Swami Vivekanand:- I can't find free time. Life has become hectic.
Ramkrishna Paramahansa:- Activity gets you busy. But productivity gets you free.

2. Swami Vivekanand:- Why has life become complicated now?
Ramkrishna Paramahansa:- Stop analyzing life... It makes it complicated. Just live it.

3. Swami Vivekanand:- Why are we then constantly unhappy?
Ramkrishna Paramahansa:- Worrying has become your habit. That's why you are not happy.

4. Swami Vivekanand:- Why do good people always suffer?
Ramkrishna Paramahansa:- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don't suffer.
With that experience their life becomes better, not bitter.

5. Swami Vivekanand:- You mean to say such experience is useful?
Ramkrishna Paramahansa:- Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons later.

6. Swami Vivekanand:- Because of so many problems, we don't know where we are heading…
Ramkrishna Paramahansa:- If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

7. Swami Vivekanand:- Does failure hurt more than moving in the right direction?
Ramkrishna Paramahansa:- Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

8. Swami Vivekanand:- In tough times, how do you stay motivated?
Ramkrishna Paramahansa:- Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.

9. Swami Vivekanand:- What surprises you about people?
Ramkrishna Paramahansa:- When they suffer they ask, "why me?" When they prosper, they never ask "Why me?"
  
10. Swami Vivekanand:- How can I get the best out of life?
Ramkrishna Paramahansa:- Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

11. Swami Vivekanand:- One last question. Sometimes I feel my prayers are not answered.
Ramkrishna Paramahansa:- There are no unanswered prayers. Keep the faith and drop the fear. Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.

Stay Happy Always!
Read More

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు.

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే  ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. "పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవలారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.

అపూర్వమైన సందేశం పంపిన 
 వారికి ధన్యవాదములు 🙏🙏🙏
Read More

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

ఓం నమః శివాయ
Read More

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)


అనాదిమల సంసార రోగ                         వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ                        బ్రహ్మణే లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ                            స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ                     బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రళయార్ణవ సంస్థాయ                                ప్రళయోత్పత్తి హేతవే!             
నమశ్శివాయ శాంతాయ                                 బ్రహ్మణే లింగ మూర్తయే!!       
జ్వాలామాలావృతాంగాయ                             జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ                             బ్రహ్మణే లింగ మూర్తయే!!
మహాదేవాయ మహతే                             జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ                           బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రధాన పురుషేశాయ                                      వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ                              బ్రహ్మణే లింగ మూర్తయే!!
నిర్వికారాయ నిత్యాయ                                              సత్యాయామలతేజసే!            
నమశ్శివాయ శాంతాయ                         బ్రహ్మణే లింగ మూర్తయే!!
వేదాంతసార రూపాయ                           కాలరూపాయ ధీమతే!
నమశ్శివాయ శాంతాయ                         బ్రహ్మణే లింగ మూర్తయే!!

ॐ నమః శివాయచః శంకరాయచః నమోనమః

Virus-free. www.avast.com
Read More

*ఆది దేవుని భిక్షా పాత్రగా కపాలం 🌸*

*ఆది  దేవుని  భిక్షా పాత్రగా  కపాలం 🌸*

*బ్రహ్మకు ఆదిలో ఐదుశిరస్సులుండేవి. శివునికి ఒక్కటే! (ఈ వివాహం నాటికి,
బ్రహ్మకు ఇంకా ఐదుతలలున్న సంగతిని కొన్ని పురాణాలు ప్రస్తావిస్తున్నప్పటికీ) ఈ
కథాంశం ముందు జరిగినదా? తర్వాత జరిగినదా అనే శంక ప్రక్కన పెట్టి, సావధానంగా
వినమని - మన ఋషివరేణ్యులను కోరుతున్నాను.*

*ఒకప్పుడు - బ్రహ్మకూ, శివునికీ మాటపట్టింపువచ్చి నేను అధికుడనంటే - నేను
అధికుడననే అహంకారం ప్రబలమైంది. 'నేను వచ్చిన తరువాతనే, ఈ సృష్టిలో కొచ్చిన
నువ్వు నాకంటే అధికుడవెలా అవుతావు? చూశావా! నాకు ఐదు శిరసులున్నాయి' అన్నాడు
బ్రహ్మ. 'నేనూ చూపించగలను ఐదుతలల్నీ! అంటూ శివుడు తన పంచముఖాన్ని చూపించాడు.*

*ఆ పంచముఖాలూ ఇవి : 1. సద్యోజాత, 2. వామదేవ, 3. అఘోర, 4. తత్పురుష, 5. ఈశాన.*

*దేవతలకు ఎన్నడూ ఐదు ముఖాలూ వరుసగా ఉండవు. నాలుగు దిక్కులకూ నాలుగు,
ఊర్థ్వముగా (పైకి)చూచునట్లు ఇంకొకటీ ఒక పుష్పాకృతిలో ఈ ముఖాల అమరిక ఉంటుంది.
కనుకనే సర్వదిక్కులనూ, సర్వ విశ్వాన్నీ వీక్షించే ఆ మహాశివుడు సర్వతోముఖుడను
నామాంతరము చేత కూడ సుప్రసిద్థుడు. ఆయనకు తెలియని అంశంగాని, ఆయన వివరించలేని
అంశంగాని లేవు. ఎవరేది ఎంత దాచాలన్నా సర్వేశుని వద్ద దాచలేరు.*

*బ్రహ్మకు ఆ విధంగా శివపంచముఖ దర్శనం కలిగినప్పటికీ, అసూయకొద్దీ ఈశ్వరునింకా
రెచ్చగొà
Read More

ఏం జరిగినా ఎదుర్కోగలను అన్న కాన్ఫిడెన్స్ మనిషి విజయానికి పునాదులు, ఈ పునాదులు బలంగా ఉంటేనే జీవితం అనే భవనం దృఢంగా ఉంటుంది.

1.FAITH
వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్లారు. కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు ఇదే విశ్వాసం.

2.TRUST
తండ్రి బిడ్డను పైకి ఎగరేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది, అదే నమ్మకం.

3.HOPE
రేపు మనం బతికుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. ఇదే ఆశ.

4.CONFIDENCE
రేపు ఏం జరుగుతుందో తెలియదు, మన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూలతలను ఎలా ఓడించాలో ఆలోచిస్తుంటాం. ఇదే కాన్ఫిడెన్స్.

చేసే పనిమీద విశ్వాసం,
చేయగలను అనే నమ్మకం,
చేస్తే బాగుపడతాను అనే ఆశ,
ఏం జరిగినా ఎదుర్కోగలను అన్న కాన్ఫిడెన్స్ మనిషి విజయానికి పునాదులు, ఈ పునాదులు బలంగా ఉంటేనే జీవితం అనే భవనం దృఢంగా ఉంటుంది.
Read More

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.
బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి
ధర్మరాజు ఇలా అడిగాడు.
"పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము
పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు.

భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు
ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము
చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి
ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో
గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి
చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే
నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిద మాటలను అర్ధము చేసుకున్న
విప్రకుమారుడు "ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది.
లేకుంటే అలా ఎందుకు అంటుంది? " అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు
వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి
కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని
చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి
తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్ష�±
Read More

ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం *ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం *

 ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
*ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం *
*లఘు స్తోత్రమ్*
*సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |*
*ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||*
*పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |*
*సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||*
*వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |*
*హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||*

*ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |*
*సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||*

*సంపూర్ణ స్తోత్రమ్*
*సౌరాష్ట్రదేశే విశదే‌உతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |*
*భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||*

*శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగే‌உపి సదా వసంతమ్ |*
*తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || 2 ||*

*అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |*
*అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || 3 ||*

*కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |*
*సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే || 4 ||*

*పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |*
*సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||*

*యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |*
*సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్త�°

Virus-free. www.avast.com
Read More

Powered By Blogger | Template Created By Lord HTML