.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

13, ఏప్రిల్ 2026, సోమవారం

తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)

 🙏 తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)


🛕 1. Thiruparankundram Murugan Temple 🙏

✨ ఇది మురుగన్ స్వామి వివాహ స్థలం 💍

👉 ఇక్కడ స్వామి దేవసేన అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు

🏔️ ఇది రాక్ కట్ (గుట్టలో చెక్కిన) పురాతన ఆలయం

🌟 పాపాలు తొలగి, వివాహ సమస్యలు తగ్గుతాయని నమ్మకం


🌊 2. Tiruchendur Subramanya Swamy Temple 🌊🔥

✨ ఇది సముద్ర తీరంలో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి సూరపద్మాసురుడిని సంహరించారు ⚔️

🌊 సముద్ర స్నానం చేసి దర్శనం చేస్తే పాప విమోచనం

🙏 శత్రు బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం


⛰️ 3. Palani Murugan Temple 🛕

✨ ఇది చాలా ప్రసిద్ధి గల పళని మలై ఆలయం

👉 స్వామి పేరు: దండాయుధపాణి 🙏

🍯 ప్రసిద్ధి: పంచామృతం ప్రసాదం

🌟 కోరికలు నెరవేరే క్షేత్రంగా పేరు


🪔 4. Swamimalai Murugan Temple 🪔

✨ ఇక్కడ మురుగన్ స్వామి శివుడికి “ఓం” అర్థం చెప్పారు 📖

👉 “గురు”గా నిలిచిన ఆలయం 🙏

🌟 విద్య, జ్ఞానం కోసం భక్తులు ఎక్కువగా వస్తారు


🛕 5. Tiruttani Murugan Temple 🕊️

✨ ఇది శాంతి ప్రసాదించే ఆలయం

👉 యుద్ధం తర్వాత మురుగన్ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు 😌

🌟 కోపం తగ్గి, మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం


🌳 6. Pazhamudircholai Murugan Temple 🌳🍃

✨ ఇది అడవిలో ఉన్న పవిత్ర ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి వల్లీ, దేవసేనతో కలిసి ఉంటారు 💞

🌿 ప్రకృతి మధ్యలో దర్శనం చాలా పవిత్రంగా ఉంటుంది

🌟 కుటుంబ సుఖశాంతి కోసం దర్శనం చేస్తారు


🙏 ముగింపు

✨ ఈ 6 ఆలయాలు (అరుపడైవీడు) దర్శనం చేస్తే

👉 జీవితం లో శుభాలు, విజయాలు, శాంతి వస్తాయని నమ్మకం 🙏✨

Read More

ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*

 *🌞ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*


 1. సూర్యుడు – జీవానికి మూలం


సర్వలోకాలకు ప్రాణాధారం సూర్యుడు. భూమిపై జీవం, ఆహారం, వర్షం—ఇవన్నీ సూర్యుడి శక్తివల్లే జరుగుతాయి. అందుకే వేదాలలో సూర్యుని “ప్రత్యక్ష దైవం”గా పూజిస్తారు.


 2. పురాణాలలో సూర్యుని మహిమ


 అక్షయపాత్ర కథ


ధర్మరాజు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనతో వచ్చిన ప్రజలకు ఆహారం ఎలా ఇవ్వాలో తెలియక సూర్యుని ప్రార్థించాడు.

అప్పుడు సూర్యుడు ఆయనకు అక్షయపాత్రను ఇచ్చాడు.


 ఆ పాత్ర ప్రత్యేకత:


ఎప్పుడూ ఖాళీ కాదు

ఎన్ని మందికి అయినా ఆహారం సరిపోతుంది


ఇది “సంపద” అంటే కేవలం డబ్బు కాదు, ఆహారం, సమృద్ధి అని సూచిస్తుంది.


 శమంతక మణి కథ


సత్రాజిత్తు అనే రాజు సూర్యుడిని ఆరాధించి శమంతక మణి పొందాడు.


 ఆ మణి ప్రత్యేకత


ప్రతిరోజూ బంగారం ఉత్పత్తి చేస్తుంది

ఇది ధనసంపదకు సంకేతం.


 3. జ్ఞానం


ఆంజనేయుడు కూడా సూర్యుడిని గురువుగా తీసుకుని వేదాలు నేర్చుకున్నాడు.


గాయత్రీ మంత్రం కూడా చెబుతుంది


సూర్యుడు మన బుద్ధిని ప్రేరేపిస్తాడు

అంటే జ్ఞానం = నిజమైన సంపద



🧘‍♂️ 4. సూర్యారాధన & యోగం


🌞 సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం చేయడం వల్ల

శరీరానికి శక్తి పెరుగుతుంది

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

ఆరోగ్యం మెరుగవుతుంది


 శరీరం + మనస్సు + ప్రాణం → సమతుల్యం అవుతాయి


 5. సూర్య శక్తి ప్రభావం


సూర్యశక్తి మనలో

శక్తి కేంద్రాలను (చక్రాలు) జాగృతం చేస్తుంది

ఆహారం మీద ఆధారాన్ని తగ్గిస్తుంది (యోగ స్థితి)

అంతర్గత శాంతి కలిగిస్తుంది


 ఇది “యోగ శరీరం”గా మారడం అని అంటారు


 6. సూర్య కిరణాలు & రంగులు (చికిత్స)

సూర్యకాంతి 7 రంగులలో ఉంటుంది:


 నారింజ రంగు

వేడి పెంచుతుంది

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది

చలి సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది



 ఆకుపచ్చ రంగు 

కండరాలు బలపడతాయి

మెదడు శక్తి పెరుగుతుంది

కీళ్ళ నొప్పులు తగ్గుతాయి


నీలం రంగు

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

పిత్త సంబంధిత రోగాలు తగ్గిస్తుంది


 ఈ విధంగా “కలర్ థెరపీ”లో సూర్యకాంతిని ఉపయోగిస్తారు


 7. మనస్సు నియంత్రణలో సూర్యుడు

మనస్సును చంద్రుడు నియంత్రిస్తాడు

చంద్రుడికి వెలుగు ఇచ్చేది సూర్యుడు


కాబట్టి: సూర్యుడు → చంద్రుడు → మనస్సు → కర్మలు

 అంటే సూర్యారాధన వల్ల మన జీవితం సరిగ్గా నడుస్తుంది


సూర్యారాధన వల్ల:

💰 ధనసంపద

🧠 జ్ఞానం

🧘‍♂️ ఆధ్యాత్మిక శాంతి

💪 ఆరోగ్యం

😊 మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయి.


 అందుకే మన పూర్వీకులు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయమని చెప్పారు.

Read More

_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_*

 *_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_* 


*_సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం._*


 *_దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది._*


*_శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు._*


*_తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట._*

Read More

చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు

 *🌹 చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు 🌹


*ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి చెడు కాలం రాబోయే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందని ఆయన వివరించారు. ఈ సూచనలను మనం గమనించి ముందే జాగ్రత్త పడితే రాబోయే పెద్ద పెద్ద ఆపదల నుండి తప్పించుకోవచ్చని ఆయన బోధించారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.*


*మొదటి సంకేతం ఏమిటంటే ఇంట్లో అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోవడం. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కానీ ఏదైనా కారణం లేకుండా తులసి మొక్క ఎండిపోతుంటే అది ఆర్థిక కష్టాలకు మరియు దరిద్రానికి సూచన అని చాణక్యుడు చెప్పారు. ఇది రాబోయే విపత్తు గురించి మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.*


*రెండోది ఇంట్లో జరిగే అనవసర గొడవలు. ప్రశాంతంగా ఉండే కుటుంబంలో అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయంటే అది చెడు కాలానికి సంకేతం. ఎక్కడైతే నిత్యం కలహాలు జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. దీనివల్ల మనిషి మానసిక ప్రశాంతత కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది చివరకు ఆస్తి నష్టానికి మరియు సమాజంలో గౌరవం పోవడానికి దారితీస్తుంది.*


*మూడో ముఖ్యమైన విషయం పెద్దలను గౌరవించకపోవడం. ఎప్పుడైతే మనిషికి అహంకారం పెరిగి తన కన్నవారిని లేదా గురువులను కించపరచడం మొదలుపెడతాడో అప్పుడే అతని పతనం మొదలవుతుంది. చెడు కాలం వచ్చే ముందు మనిషికి తన మంచి కోరే పెద్దలు కూడా శత్రువుల్లా కనిపిస్తారు. వారి మాటలను పట్టించుకోకుండా ప్రవర్తించడం వల్ల సర్వనాశనం తప్పదని చాణక్యుడు హెచ్చరించారు.*


*నాలుగోది గాజు వస్తువులు లేదా అద్దం పగిలిపోవడం. ఇంట్లో అకస్మాత్తుగా పదేపదే అద్దాలు పగిలిపోవడం కూడా శుభసూచకం కాదు. ఇది రాబోయే భారీ ఆర్థిక నష్టాన్ని లేదా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. వ్యాపారం చేసేవారు ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.*


*చివరిగా ఐదవ సంకేతం ఇంట్లో అపవిత్రత పెరగడం. సాధారణంగా శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ చెడు సమయం వచ్చే ముందు ఆ ఇంట్లో వారు క్రమశిక్షణ కోల్పోయి అపరిశుభ్రంగా ఉండటం లేదా ఇంట్లో వ్యర్థాలను పేరుకుపోయేలా చేయడం చేస్తారు. ఇది ఇంటి ప్రశాంతతను దెబ్బతీసి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది.*


*ఈ ఐదు లక్షణాలు మన జీవితంలో లేదా మన ఇంట్లో కనిపిస్తున్నాయంటే మన లైఫ్ పతనం దిశగా సాగుతోందని అర్థం చేసుకోవాలి. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ సంకేతాలను గుర్తించిన వెంటనే మన ప్రవర్తనను మార్చుకుని పెద్దల సలహాలు పాటిస్తూ భక్తితో మెలిగితే ఆ కష్టాల నుండి మనం బయటపడవచ్చు. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం.*

🌹🌹🌹🌹🌹.                                      

Read More

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!

 *





కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!


హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.


1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!


2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!


3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!


4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!


5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!


6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!


7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!


8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!


ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.













దివ్య మూలిక : అమావాస్య, ఆదివారం మంగళ, శుక్ర అమావాస్య రోజులలోగాని అత్తిపత్తి చెట్టును పూజించి కార్యసిద్ధికై ఆ చెట్టు వేరుని (మొక్క చనిపోకుండా తీసుకోవాలి) సేకరించి భార్యభర్తలు ధరించిన కలహాలు లేని కాపురంగా సాగిపోతుంది. ఇద్దరు స్నేహితులు ధరిస్తే జీవితాంతం వరకు విడిపోరు. వ్యాపార స్థలంలో దీన్నుంచితే శాశ్వత కష్టమర్లు ఆ షాపుకు పెక్కుమంది పెరుగు దురు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందును*

Read More

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*

 *"ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*



*అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు .

*నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . *ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. "ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . "భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. "ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . 


*అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. "విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. "మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . "పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. "చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. "ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  


*మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. "మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . "అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. "ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . "మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. "అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే. .


            సర్వేజనాః సుఖినోభవంతు


- శివోహం 🙏

Read More

Powered By Blogger | Template Created By Lord HTML