.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

23, ఏప్రిల్ 2026, గురువారం

ఒక నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంత్ర శాస్త్ర రహస్యాన్ని కథారూపంగా తెలియచేశారు

 ఒక నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంత్ర శాస్త్ర రహస్యాన్ని కథారూపంగా తెలియచేశారు. ఒక వ్యక్తి ఉన్నట్లుండి రోగగ్రస్తుడై మరణశయ్యపై ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు ఆ ఊరికి వచ్చిన ఒక ధ్యాన యోగికి అతనిని చూపించారు. ఆయన ధ్యానంలో చూడగా అతనిని పీడిస్తున్న ఒక పిశాచి కన్పించింది. దానితో ఆయన మాట్లాడిన తీరును చూడండి.


యోగి : నీవెవరు? నీ వితనిని ఎందుకు పీడిస్తున్నావు ?


పిశాచి : నేను వారాహిని. ఒక దేవతను. నన్నొక మాంత్రికుడు ఇతనిని చంపమని ప్రయోగించాడు.


యోగి :వారాహి గొప్ప దేవత, ఇటువంటి నీచమైన పనులు చేయదు. నీవెవరు?


పిశాచి : 'మంత్రాధీనంతు దైవతం' అన్న మాట నీకు తెలియదా? దేవతలు మంత్రాధీనులు. మాకు మంచి చెడులతో పనిలేదు. మంత్ర సిద్ధుడు కోరిన పని చేయటం మా కర్తవ్యం.


యోగి : కావచ్చు. నిన్ను చూస్తే నీవు అసలైన వారాహివి కాదని స్ఫురిస్తున్నది. నా యోగ శక్తితో ఆజ్ఞాపిస్తున్నాను. నీవెవరు? నిజం చెప్పు.


పిశాచి : నీ యోగ శక్తి బలమైనది. నిజం చెప్తున్నా. నేను మరణించిన ఒక స్త్రీని. ప్రేతమునై శ్మశానంలో తిరుగుతున్నాను. ఒక మాంత్రికుడు అక్కడకు వచ్చి వారాహి సాధన చేశాడు. అతని మంత్ర శక్తికి నేను వశమయినాను. అత డితనిని హింసించి చంపమని ఆజ్ఞాపించాడు. అందుకే ఇలా చేస్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు.


యోగి : ఇతనిని విడిచిపెట్టి వెళ్ళు. నా ఆజ్ఞ.


పిశాచి : తప్పదు కనుక వెడుతున్నాను.


తరువాత ఆరోగి వ్యాధి పోయి జీవించాడు. ఇక్కడ గమనించవలసినదేమిటంటే ఒక తీవ్ర దేవతా మంత్రాన్ని ఇంట్లోనో దేవాలయంలోనే చేస్తే ఎప్పటికో గాని సిద్ధించకపోవచ్చు. శ్మశానంలో చేస్తే ఏ భూతమో ప్రేతమో మంత్ర దేవతా రూపాన్ని ధరించి సాధకుని కోరికలు తీరుస్తుంది. అదీకాక, దివ్య క్షేత్రాల దగ్గర ఉన్న మహాశ్మశానాలలో అసలు దేవతలు కూడా రుద్ర భైరవ శక్తి మండలాలకు చెందినవారు ఉంటారు. వారు సాధకుని ధైర్యాన్ని పరీక్షించి, సిద్ధులను ప్రసాదిస్తారు.

Read More

Read More

వైశాఖ శుద్ధ అష్టమీ - శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ

 - వైశాఖ శుద్ధ అష్టమీ - శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_*

*_శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ_

వైశాఖ శుద్ధ అష్టమిని "బగళాష్టమి" అంటారు. ఈ రోజు దశమహావిద్యల్లో ఒకరైన బగళాముఖి అమ్మవారి జయంతి.

చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తి భండాసుర సంహారానికి లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెకు సహకరించిన పది మహాశక్తులైన 


1)కాళీ                 

2)తార 

3)షోడశి               

4)భువనేశ్వరి 

5)భైరవి                 

6)ఛిన్నమస్త 

7)ధూమవతి           

8)బగళాముఖి 

9)మాతంగి             

10)కమలాత్మిక


దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగింది. తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. ఆ చరిత్రను బ్రహ్మాండపురాణం వివరంగా చెబుతుంది. ఉత్తర భారతదేశంలో *"పీతాంబరి"* అనే పేరుతో శత్రువులను సైతం మనకు అనుకూలంగా మార్చే తల్లిగా బగళాముఖి దేవీని ప్రత్యేకంగా పూజిస్తారు.


*_బగళాముఖి ధ్యానశ్లోమ్_*


*సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం* 

*హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపక గ్యుతాం* 

*హస్త్రైర్ముద్గరపాశవజ్రరశనాః సంబిభ్రతీం భూషణైః*

*వ్యాప్తంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే*


బగళాముఖి సింహాసనంపై ఆశీనురాలై మూడుకన్నులతో, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బంగారం వర్ణ శరీరం తో, శిరస్సున కిరీటంతో పాటు చంద్రరేఖను, మెడలో కలవపూల మాలను ధరించినదై, కొరడా, పాశం, వజ్రం భోజన పాత్రలను నాలుగు చేతులలో ధరించి మూడులోకాలలోనూ వ్యాపించినది, భక్త రక్షణ కోసం అన్నింటినీ స్తంభింప చేయగలిగిన శక్తి కలది.


స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద, ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

  

అరిషడ్వర్గాల రూపంలో మనలోనే దాగిఉండే అంతర్గత శత్రువులను శిక్షించి, మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరికీ హానీ చేయనివిగా, అందరికీ మేలు చేసేవిగా ఉండాలని, మనలో కోపాన్ని, దుర్వాక్కులను నశింపజేయమని ఈ అమ్మవారిని మనం ప్రార్థిస్తే సత్ఫలితాలు పొందుతారు. 


హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, మధ్యప్రదేశ్ లోని దతియా, గుజరాత్ లోని వడోదరలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో అతి ప్రాచీనమైన బగళాముఖి ఆలయాలున్నాయి.


*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ మాత్రే నమః 𝕝𝕝卐𝕝𝕝_*

Read More

చిత్తూరు జిల్లా : తిరుపతి 🔅 శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం : తిరుపతి

 🕉 


🔅 చిత్తూరు జిల్లా : తిరుపతి


🔅 శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం :

 తిరుపతి

   

🔅 తాతయ్యగుంట గంగమ్మదేవి తిరుపతిలోని అవిలాలలో జన్మించిందని నమ్ముతారు. తాతయ్యగుంట గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని చెల్లెలుగా పూజిస్తారు.


👉 ప్రతి గ్రామంలోని అందరు అన్నోన్యమైత్రి బావంతో ఆరాధించడానికి వీలుగా గ్రామ దేవతా పూజ ఏర్పడింది.

ఒకప్పుడు గ్రామస్తులే స్వయంగా పూజించేవారు,తర్వాత క్రమంగా మందిరాలు, ఆలయాలు ఏర్పడినాయి. మునుపు వేప చెట్టు క్రిందనో,కొండ క్రిందనో,ఎతైన ఒక పెద్ద బండనో,రాయినో వుంచి,దాన్నే గ్రామ దేవతగా బావించేవారు.తర్వాత విగ్రహాలు వచ్చాయి.    ఇప్పటికి చాలా గ్రామంలో గుడిగోపురాలు లేకుండా,విగ్రహాలు లేకుండా,పెద్ద బండలే గ్రామ దేవతలుగా పూజలు అందుకొంటున్న సంగతి మనం గమనించవచ్చు


👉 గ్రామ సంరక్షణకు,మశూచి మొదలగు వ్యాధుల నివారణకు,దుష్టశక్తులను రానివ్వకుండా,జంతువులను వింత వ్యాధులనుండి సంరక్షించుటకు,వర్షాలు వచ్చి భూములు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండడానికి,పంటలకు తెగుళ్ళు రాకుండా ఉండుటకు- ఇలా అనేక శుభ ఫలితాలకై గ్రామ దేవతలను పూజించుట ఆచారంగా ఏర్పడింది. 


👉 తిరుపతి స్థానిక నివాసితులు 'జాతర' ఆచారబద్ధంగా ఆచరిస్తారు. 

తిరుపతి ప్రజలకు ముఖ్యమైన పండుగ తిరుపతి గంగమ్మ జాతర. పండుగ సమయంలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 

తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మే మొదటి పక్షం రోజులలో జరుపుకునే వార్షిక పండుగ.


👉అన్ని చోట్లా వున్న గంగమ్మకు, తిరుపతిలో ఎంతో వైభవంగా జాతర జరుపుకుంటున్న గంగమ్మకు చాలా ప్రత్యేకతలు ,విశిష్టతలు ఉన్నాయి.

 ఇక్కడి గంగమ్మకు చాలా చారిత్రక నేపధ్యం ఉంది.

 ఇక్కడి తిరుపతిలో  కొలువైన ఇద్దరు "గంగమ్మలు"  మహా మహిమ గలవారె.


👉తాళ్ళపాక గంగమ్మను పెద్ద గంగమ్మగా అని ,తాతయ్య గుంట గంగమ్మను చిన్న గంగమ్మగా అని పిలుస్తుంటారు


👉 తాళ్ళపాక గంగమ్మ గుడి తాళ్ళపాక చెరువు గట్టు (తిరుపతి)ఫై వుంది. ఈ చేరువునే- నేడు ఆర్.టి.సి. బస్ స్టేషన్ అయింది.తాతయ్య గుంట గంగమ్మ గుడి తుడా ఆఫీసుకు ముందు వైపున ఉంది.

భక్త్తులు  విశేషంగా తమ మొక్కుబడులు  తాతయ్య గుంట గంగమ్మకే సమర్పిస్తుంటారు


👉ఈ ఇద్దరు గంగమ్మల చరిత్ర ,ఇక్కడికి ఎలా వచ్చిందో సంగ్రహంగా చూద్దాం

 పూర్వం తిరుమలఫై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి అనే  ఒక వైష్ణవ భక్తుణ్ణి ``తాతా! తాతా అని పిలిచేవారట! అందువల్ల ఆ భక్తుని పేరు తాతచార్యులుగా రూపొందింది.


క్రి.శ.16 వ శతాబ్దంలో ఆ తాతచార్యుల వారి వంశస్తులకు కైంకర్యం కోసం లబించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది.

ఆ తాతాచార్యుల వంశస్తులచే  చెరువు(గుంట) గట్టున ప్రతిష్టించిన గంగమ్మ కనుక `తాతయ్య గుంట గంగమ్మ'  అనే పేరు వచ్చింది.


👉 పూర్వం తిరుమలకు యాత్ర చేసే భక్తులు మొదట ఈ గ్రామ దేవతను పూజించి ,పిదప తిరుమలకు బయలుదేరేవారని పెద్దలు అంటారు. గంగమ్మ శ్రీవారి చెల్లలని అందుకే ఒక సోదరుడు తన సోదరికి పుట్టినరోజు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు నుండి(సారే) చిర,రవిక,పసుపు,కుంకుమ,గాజులు,మున్నగు, మంగళ ద్రవ్యాలు, జాతరకు ముందురోజు గంగమ్మకు పంపడం ఈనాటికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం.


👉అది పరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణంవైపున రెండు కి.మీ దూరంలో వున్న అవిలాల గ్రామంలో పుట్టిందని అంటారు.ఇప్పటికి అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు రానిదే గంగమ్మ జాతర జరిపించుకోదు అని చెప్పి...అమ్మవారికి జాతర చేయరు. 

కనుక ఆ గ్రామం నుండి విధిగా అమ్మవారికీ మంగళ ద్రవ్యాలు ప్రతి ఏడు వస్తాయి.


 👉ప్రసిద్ద వైష్ణవచారుడైన తాతాచార్యులు అన్నమాచార్యుల స్వగ్రామమైన తాళ్ళపాక నుండి గంగమ్మను తెచ్చి,తిరుపతిలో నిలిపినందున తాళ్ళపాక గంగమ్మ అయిoదని ప్రతీతి.


🔅తిరుపతి గంగమ్మ జాతర వెనక ఉన్న చరిత్ర : 


👉జానపద కథల ప్రకారం, "పాలెగాడు" అని పిలువబడే స్థానిక నాయకుడు అందమైన స్త్రీలను ప్రలోభపెట్టేవాడని , అతని ఆదేశాల ప్రకారం, కొత్తగా పెళ్లయిన స్త్రీలు తమ మొదటి వివాహ రాత్రి అతనితో గడపవలసి వచ్చింది. 

తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించిన జగన్మాతను మహిళలు వేడుకున్నారు.


ఆమె పెద్దయ్యాక పాలెగాడు తన కామపు చూపును గంగమ్మపై వేశాడు. ఆ తర్వాత గంగమ్మ తిరస్కరించినప్పుడు ఆమెను  ప్రజల దృష్టికి లాగి పాలెగాడు అవమానించాడు. ఆమె తన భయపెట్టే “విశ్వరూపం” అతనికి చూపించినప్పుడు, మరణం నుండి తప్పించుకోవడానికి, పాలెగాడు పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు. అతని కోసం వెతుకుతూ గంగమ్మ మూడు రోజుల పాటు అనేక వేషధారణలు వేసుకుంది. మరియు నాల్గవ రోజు, ఆమె పాలెగాడు, అతని యజమాని (దొర) వలె ధరించి ఆకర్షించింది. ఆమెను తన యజమాని అని తప్పుగా భావించి, పాలెగాడు ప్రజల్లోకి వచ్చాడు, ఆమె చేత చంపబడ్డాడు.


👉ఈ చిరస్మరణీయ ఘట్టానికి గుర్తుగా, జగన్మాతకు గంగమ్మ దేవి రూపంలో కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి వాసులు జాతర వేడుకలు నిర్వహిస్తున్నారు...

ఈనాటికి 3 రోజుల పాటు తిరుపతి ప్రజలు వివిధ వేషధారణలతో అమ్మవారిని పూజిస్తారు

Read More

వైశాఖ మాసం ప్రారంభం* --------------------------------------- *వైశాఖమాస స్నాన సంకల్పము*

 ------------------------- వైశాఖ మాసం ప్రారంభం*

---------------------------------------    *వైశాఖమాస స్నాన సంకల్పము*

---------------------------------------- 

*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||*

*సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |*

*నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||*

*వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |*

*తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||*

*వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |*

*మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||*

*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |*

*ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||*

----------------------------------------

*ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా /గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే , వసంతఋతౌ , వైశాఖమాసే , ....పక్షే , ....తిథౌ, ......వాసర యుక్తాయాం , శుభనక్షత్ర, శుభయోగ , శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య , ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్థాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వేషాం పాపానాం అప నోద నార్థంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్థం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్థం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే*

---------------------------------------

*సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము*

----------------------------------------

*గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి*

*ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||*

*పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి*

*మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ ||*

*అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం*

*స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||*

*విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం*

*వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||*

*అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ*

*భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||*

*త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా*

*యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||*

*యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః*

*సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||*

*నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా*

*విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ ||*

*భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*

*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*

*స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||*

*సమస్త జగదాధార శంఖచక్ర గదాధర*

*దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||*

*నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే*

*నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||*

*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ*

*ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||*

---------------------------------------

*స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను*

---------------------------------------

*వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |*

*అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||*

*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*

*ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||*

*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*

*గృహాణార్ఘ్యం మయాదత్తం యథోక్త ఫలదోభవ ||*

---------------------------------------

*దానమంత్రం*

----------------------------------------

*ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ* *అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం , శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను*.

------------------------------------

*దాన పరిగ్రహణ మంత్రం*

--------------------------------------

*ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్థాత్* *అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య* *ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి* *దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి* *స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును*

-------------------------------------

*నదీస్నానమాచరించే సమయములో చదువవలసిన మంత్రము*

-------------------------------------

*పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ*

*సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం*

---------------------------------------

*మృత్తికా లేపన మంత్రం*

----------------------------------------

*అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం*

----------------------------------------

*స్నానమాచరించే సమయములో స్నానానుజ్ఞ మంత్రము* 

---------------------------------------

*ఉధృతాపి వరాహేన కృష్ణేన శతబాహునా ఆరుహ్య మమగాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యందేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వమాం*

---------------------------------------

*నదిలో నాభివరకు దిగినతరువాత పఠించవలసిన మంత్రము*

--------------------------------------

*గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ*

*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు*

---------------------------------------

*నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా*

*విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ*

*భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*

*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*

*స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం*

----------------------------------------

*స్నానమాచరించే సమయములో తలుచుకోవలసిన నామాలు*

----------------------------------------

*పావని,హ్రదిని,నళిని,సీత,సుచెక్షువు,సింధువు,గంగ,పద్మావతి,భోగవతి,స్వర్ణరేఖ,కౌశికి,దక్ష, పృధివి,సుభగా,విశ్వకాయ,శివామృత,*

*విద్యాధరి,సుప్రసన్న,లోకప్రసాదిని,క్షేమ, వైష్ణవి,శాంతిదా,గోమతి,సతి,సావిత్రి,తులసి, దుర్గ,మహాలక్ష్మి,సరస్వతి,రాధిక,లోపాముద్రా, దితి,రతి,అహల్యా,అదితి,సంఙ్ఞ,స్వధా, స్వాహా,అరుంధతి,                        శతరూపా,దేవహూతి.*

---------------------------------------               *వైశాఖ మాసం ప్రారంభం*

-------------------------------------

*వైశాఖ మాసం విశిష్టత*

--------------------------------------

*వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో  వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు ఏర్పడింది.ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు  స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ*

----------------------------------------

 *కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు* *చెబుతున్నాయి.వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి.*

*కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.*

*సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు.*

-------------------------------------

*అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.*

---------------------------------------

   *’వైశాఖే మాధవో, రాధో’*

---------------------------------------

*ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.*

-----------------------------------      *ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!*

*అదే విధంలో*

---------------------------------------

*"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన*

*ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్.*

----------------------------------------

*అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.*

---------------------------------------

*తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!*

*విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!*

--------------------------------------

*మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!*

*త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!*

--------------------------------------

*వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.*

------------------------------------

*ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.*

----------------------------------------

*ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.*          ---------------------------------------      *వైశాఖ పురాణం ప్రారంభo*                               ----------------------------------------     *వైశాఖ పురాణము లోని అధ్యాయములు*

-------------------------------------                                       *1 . వైశాఖమాస ప్రశంస*

*2 . వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాటి ఫలితములు*

*3 . వివిధ దానములు - వాటి మహత్యములు*

*4 . వైశాఖ ధర్మ ప్రశoస*

*5 . వైశాఖమాస విశిష్టత౮

*6 . జలదాన మహత్యము - గృహగోధికా కథ*

*7 . వైశాకమాస  దానములు*

*8 . పిశాచ మోక్షము*

*9 . సతీదేహ త్యాగము*

*10 . దక్షయజ్ఞనాశము కామదహనము*

*11 . రతి దుఃఖము - దేవతల ఊరడింపు*

*12 . కుమార జననము*

*13 . అశూన్య శయన వ్రతము*

*14 . ఛత్రదాన మహిమ*

*15 . వైశాకవ్రత మహిమ*

*16 . యముని పరాజయము*

*17 . యమదుఃఖ నిరూపణము*

*18 . విష్ణువు యముని ఊరడించుట*

*19 . పిశాచత్వ విముక్తి*

*20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి*

*21. పాంచాలరాజు సాయుజ్యము*

*22 . దంతిల కోహల శాపవిముక్తి*

*23 . కిరాతుని పూరజన్మ*

*24 . వాయుశాపము*

*25 . భాగవత ధర్మములు*

*26 . వాల్మీకి జన్మ*

*27 . కలిధర్మములు - పితృముక్తి*

*28 . అక్షయతృతీయ విశిష్టత*

*29 . శునీ మోక్షప్రాప్తి*

*30 . పుష్కరిణి - ఫలశ్రుతి---------------------------------------  *వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము*

----------------------------------------

*వైశాఖమాస ప్రశంస:*

----------------------------------------

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

--------------------------------------

*సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవు లాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.*

----------------------------------------

*నారదుడనేను రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది*

--------------------------------------

*విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.*

-------------------------------------

*అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను, అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింప జేయుచుందురు.*

-----------------------------------

*వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము*       -------------------------------------

Read More

మన ధర్మంలో ప్రతి చిన్న పని వెనుక ఒక గొప్ప సైన్స్, ఆధ్యాత్మికత దాగి ఉంటాయి.

 మనం రోజూ చేసే భోజనం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.

అదొక పవిత్రమైన "యజ్ఞం" అని మీకు తెలుసా? 


మన ధర్మంలో ప్రతి చిన్న పని వెనుక ఒక గొప్ప సైన్స్, ఆధ్యాత్మికత దాగి ఉంటాయి. పూర్వకాలంలో (కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ) భోజనం చేసేటప్పుడు "ఆపోశనం", "పరిషేచనం" అని చేసేవారు. అసలు ఆ అద్భుతమైన ఆచారం వెనుక ఉన్న గొప్ప పరమార్థం ఏంటో ఇక్కడ చూద్దాం 👇:


💧 1. పరిషేచనం (విస్తరి చుట్టూ ప్రదక్షిణ): భోజనానికి ముందు కంచం లేదా విస్తరి చుట్టూ మంత్రం చదువుతూ నీరు చల్లుతారు. (పగలు పగలైతే "సత్యం త్వర్తేన పరిషించామి" అని, రాత్రి అయితే "ఋతం త్వా సత్యేన పరిషించామి" అని చదువుతారు). ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారానికి క్రిమికీటకాల నుండి ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది.


🙏 2. అమృత తుల్యం: ఆ తర్వాత కుడిచేతి గుంటలో కొద్దిగా నీరు తీసుకుని "అమృతమస్తు అమృతోపస్తరణమసి" అని చదువుతూ తాగుతారు. అంటే మనం తినబోయే అన్నం అమృతంగా మారి మన శరీరానికి వంటపట్టాలని దీని అర్థం.


🔥 3. ప్రాణాహుతులు (ఆరు ముద్దలు): భోజనం మొదలుపెట్టే ముందు పవిత్రమైన గాయత్రీ మంత్రం ధ్యానిస్తూ.. ఓం ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా.. అని ఆరు మంత్రాలు చదువుతూ ఆరు చిన్న ముద్దలను పంటికి తగలకుండా మింగుతారు.


✨ 4. అసలైన అర్థం (The Inner Meaning): మనం భోజనాన్ని ఎందుకు ఒక యజ్ఞం అంటారంటే.. మన శరీరమే ఒక యాగశాల. లోపల జీర్ణక్రియకు సహాయపడే 'జఠరాగ్ని' ఒక యజ్ఞగుండం లాంటిది. లోపల ఉన్న పంచప్రాణాలే యాగ దేవతలు. మనం తినే ఆ మొదటి ఆరు ముద్దలు ఆ దేవతలకు మనం సమర్పించే పవిత్రమైన నైవేద్యం!


🙌 5. ముగింపు: భోజనం పూర్తయ్యాక చివరగా కుడిచేతిలో కొద్దిగా నీరు తీసుకుని "అమృతాపిధానమసి" అని తాగి, మనకు ఈ అన్నం పెట్టిన వారికి, పండించిన రైతులకు "అన్నదాతా సుఖీభవ" అని మనసారా కృతజ్ఞతలు చెప్పాలి.




నిజం చెప్పండి... భోజనం చేసే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లడం (పరిషేచనం) లేదా దేవుడిని తలచుకుని ప్రాణాహుతులు తీసుకోవడం లాంటి ఆచారాలను మీరు ఎప్పుడైనా చూశారా? లేదా 


సర్వే జనాః సుఖినోభవంతు 

 లోకా సమస్తా సుఖినోభవంతు

Read More

13, ఏప్రిల్ 2026, సోమవారం

తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)

 🙏 తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)


🛕 1. Thiruparankundram Murugan Temple 🙏

✨ ఇది మురుగన్ స్వామి వివాహ స్థలం 💍

👉 ఇక్కడ స్వామి దేవసేన అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు

🏔️ ఇది రాక్ కట్ (గుట్టలో చెక్కిన) పురాతన ఆలయం

🌟 పాపాలు తొలగి, వివాహ సమస్యలు తగ్గుతాయని నమ్మకం


🌊 2. Tiruchendur Subramanya Swamy Temple 🌊🔥

✨ ఇది సముద్ర తీరంలో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి సూరపద్మాసురుడిని సంహరించారు ⚔️

🌊 సముద్ర స్నానం చేసి దర్శనం చేస్తే పాప విమోచనం

🙏 శత్రు బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం


⛰️ 3. Palani Murugan Temple 🛕

✨ ఇది చాలా ప్రసిద్ధి గల పళని మలై ఆలయం

👉 స్వామి పేరు: దండాయుధపాణి 🙏

🍯 ప్రసిద్ధి: పంచామృతం ప్రసాదం

🌟 కోరికలు నెరవేరే క్షేత్రంగా పేరు


🪔 4. Swamimalai Murugan Temple 🪔

✨ ఇక్కడ మురుగన్ స్వామి శివుడికి “ఓం” అర్థం చెప్పారు 📖

👉 “గురు”గా నిలిచిన ఆలయం 🙏

🌟 విద్య, జ్ఞానం కోసం భక్తులు ఎక్కువగా వస్తారు


🛕 5. Tiruttani Murugan Temple 🕊️

✨ ఇది శాంతి ప్రసాదించే ఆలయం

👉 యుద్ధం తర్వాత మురుగన్ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు 😌

🌟 కోపం తగ్గి, మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం


🌳 6. Pazhamudircholai Murugan Temple 🌳🍃

✨ ఇది అడవిలో ఉన్న పవిత్ర ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి వల్లీ, దేవసేనతో కలిసి ఉంటారు 💞

🌿 ప్రకృతి మధ్యలో దర్శనం చాలా పవిత్రంగా ఉంటుంది

🌟 కుటుంబ సుఖశాంతి కోసం దర్శనం చేస్తారు


🙏 ముగింపు

✨ ఈ 6 ఆలయాలు (అరుపడైవీడు) దర్శనం చేస్తే

👉 జీవితం లో శుభాలు, విజయాలు, శాంతి వస్తాయని నమ్మకం 🙏✨

Read More

ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*

 *🌞ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*


 1. సూర్యుడు – జీవానికి మూలం


సర్వలోకాలకు ప్రాణాధారం సూర్యుడు. భూమిపై జీవం, ఆహారం, వర్షం—ఇవన్నీ సూర్యుడి శక్తివల్లే జరుగుతాయి. అందుకే వేదాలలో సూర్యుని “ప్రత్యక్ష దైవం”గా పూజిస్తారు.


 2. పురాణాలలో సూర్యుని మహిమ


 అక్షయపాత్ర కథ


ధర్మరాజు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనతో వచ్చిన ప్రజలకు ఆహారం ఎలా ఇవ్వాలో తెలియక సూర్యుని ప్రార్థించాడు.

అప్పుడు సూర్యుడు ఆయనకు అక్షయపాత్రను ఇచ్చాడు.


 ఆ పాత్ర ప్రత్యేకత:


ఎప్పుడూ ఖాళీ కాదు

ఎన్ని మందికి అయినా ఆహారం సరిపోతుంది


ఇది “సంపద” అంటే కేవలం డబ్బు కాదు, ఆహారం, సమృద్ధి అని సూచిస్తుంది.


 శమంతక మణి కథ


సత్రాజిత్తు అనే రాజు సూర్యుడిని ఆరాధించి శమంతక మణి పొందాడు.


 ఆ మణి ప్రత్యేకత


ప్రతిరోజూ బంగారం ఉత్పత్తి చేస్తుంది

ఇది ధనసంపదకు సంకేతం.


 3. జ్ఞానం


ఆంజనేయుడు కూడా సూర్యుడిని గురువుగా తీసుకుని వేదాలు నేర్చుకున్నాడు.


గాయత్రీ మంత్రం కూడా చెబుతుంది


సూర్యుడు మన బుద్ధిని ప్రేరేపిస్తాడు

అంటే జ్ఞానం = నిజమైన సంపద



🧘‍♂️ 4. సూర్యారాధన & యోగం


🌞 సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం చేయడం వల్ల

శరీరానికి శక్తి పెరుగుతుంది

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

ఆరోగ్యం మెరుగవుతుంది


 శరీరం + మనస్సు + ప్రాణం → సమతుల్యం అవుతాయి


 5. సూర్య శక్తి ప్రభావం


సూర్యశక్తి మనలో

శక్తి కేంద్రాలను (చక్రాలు) జాగృతం చేస్తుంది

ఆహారం మీద ఆధారాన్ని తగ్గిస్తుంది (యోగ స్థితి)

అంతర్గత శాంతి కలిగిస్తుంది


 ఇది “యోగ శరీరం”గా మారడం అని అంటారు


 6. సూర్య కిరణాలు & రంగులు (చికిత్స)

సూర్యకాంతి 7 రంగులలో ఉంటుంది:


 నారింజ రంగు

వేడి పెంచుతుంది

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది

చలి సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది



 ఆకుపచ్చ రంగు 

కండరాలు బలపడతాయి

మెదడు శక్తి పెరుగుతుంది

కీళ్ళ నొప్పులు తగ్గుతాయి


నీలం రంగు

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

పిత్త సంబంధిత రోగాలు తగ్గిస్తుంది


 ఈ విధంగా “కలర్ థెరపీ”లో సూర్యకాంతిని ఉపయోగిస్తారు


 7. మనస్సు నియంత్రణలో సూర్యుడు

మనస్సును చంద్రుడు నియంత్రిస్తాడు

చంద్రుడికి వెలుగు ఇచ్చేది సూర్యుడు


కాబట్టి: సూర్యుడు → చంద్రుడు → మనస్సు → కర్మలు

 అంటే సూర్యారాధన వల్ల మన జీవితం సరిగ్గా నడుస్తుంది


సూర్యారాధన వల్ల:

💰 ధనసంపద

🧠 జ్ఞానం

🧘‍♂️ ఆధ్యాత్మిక శాంతి

💪 ఆరోగ్యం

😊 మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయి.


 అందుకే మన పూర్వీకులు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయమని చెప్పారు.

Read More

_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_*

 *_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_* 


*_సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం._*


 *_దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది._*


*_శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు._*


*_తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట._*

Read More

చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు

 *🌹 చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు 🌹


*ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి చెడు కాలం రాబోయే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందని ఆయన వివరించారు. ఈ సూచనలను మనం గమనించి ముందే జాగ్రత్త పడితే రాబోయే పెద్ద పెద్ద ఆపదల నుండి తప్పించుకోవచ్చని ఆయన బోధించారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.*


*మొదటి సంకేతం ఏమిటంటే ఇంట్లో అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోవడం. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కానీ ఏదైనా కారణం లేకుండా తులసి మొక్క ఎండిపోతుంటే అది ఆర్థిక కష్టాలకు మరియు దరిద్రానికి సూచన అని చాణక్యుడు చెప్పారు. ఇది రాబోయే విపత్తు గురించి మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.*


*రెండోది ఇంట్లో జరిగే అనవసర గొడవలు. ప్రశాంతంగా ఉండే కుటుంబంలో అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయంటే అది చెడు కాలానికి సంకేతం. ఎక్కడైతే నిత్యం కలహాలు జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. దీనివల్ల మనిషి మానసిక ప్రశాంతత కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది చివరకు ఆస్తి నష్టానికి మరియు సమాజంలో గౌరవం పోవడానికి దారితీస్తుంది.*


*మూడో ముఖ్యమైన విషయం పెద్దలను గౌరవించకపోవడం. ఎప్పుడైతే మనిషికి అహంకారం పెరిగి తన కన్నవారిని లేదా గురువులను కించపరచడం మొదలుపెడతాడో అప్పుడే అతని పతనం మొదలవుతుంది. చెడు కాలం వచ్చే ముందు మనిషికి తన మంచి కోరే పెద్దలు కూడా శత్రువుల్లా కనిపిస్తారు. వారి మాటలను పట్టించుకోకుండా ప్రవర్తించడం వల్ల సర్వనాశనం తప్పదని చాణక్యుడు హెచ్చరించారు.*


*నాలుగోది గాజు వస్తువులు లేదా అద్దం పగిలిపోవడం. ఇంట్లో అకస్మాత్తుగా పదేపదే అద్దాలు పగిలిపోవడం కూడా శుభసూచకం కాదు. ఇది రాబోయే భారీ ఆర్థిక నష్టాన్ని లేదా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. వ్యాపారం చేసేవారు ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.*


*చివరిగా ఐదవ సంకేతం ఇంట్లో అపవిత్రత పెరగడం. సాధారణంగా శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ చెడు సమయం వచ్చే ముందు ఆ ఇంట్లో వారు క్రమశిక్షణ కోల్పోయి అపరిశుభ్రంగా ఉండటం లేదా ఇంట్లో వ్యర్థాలను పేరుకుపోయేలా చేయడం చేస్తారు. ఇది ఇంటి ప్రశాంతతను దెబ్బతీసి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది.*


*ఈ ఐదు లక్షణాలు మన జీవితంలో లేదా మన ఇంట్లో కనిపిస్తున్నాయంటే మన లైఫ్ పతనం దిశగా సాగుతోందని అర్థం చేసుకోవాలి. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ సంకేతాలను గుర్తించిన వెంటనే మన ప్రవర్తనను మార్చుకుని పెద్దల సలహాలు పాటిస్తూ భక్తితో మెలిగితే ఆ కష్టాల నుండి మనం బయటపడవచ్చు. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం.*

🌹🌹🌹🌹🌹.                                      

Read More

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!

 *





కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!


హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.


1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!


2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!


3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!


4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!


5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!


6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!


7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!


8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!


ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.













దివ్య మూలిక : అమావాస్య, ఆదివారం మంగళ, శుక్ర అమావాస్య రోజులలోగాని అత్తిపత్తి చెట్టును పూజించి కార్యసిద్ధికై ఆ చెట్టు వేరుని (మొక్క చనిపోకుండా తీసుకోవాలి) సేకరించి భార్యభర్తలు ధరించిన కలహాలు లేని కాపురంగా సాగిపోతుంది. ఇద్దరు స్నేహితులు ధరిస్తే జీవితాంతం వరకు విడిపోరు. వ్యాపార స్థలంలో దీన్నుంచితే శాశ్వత కష్టమర్లు ఆ షాపుకు పెక్కుమంది పెరుగు దురు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందును*

Read More

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*

 *"ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*



*అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు .

*నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . *ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. "ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . "భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. "ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . 


*అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. "విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. "మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . "పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. "చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. "ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  


*మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. "మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . "అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. "ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . "మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. "అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే. .


            సర్వేజనాః సుఖినోభవంతు


- శివోహం 🙏

Read More

23, సెప్టెంబర్ 2025, మంగళవారం

అక్షరాభ్యాస ముహూర్తం

 అక్షరాభ్యాస ముహూర్తం 


అక్షరాభ్యాసం అంటే చిన్నారికి మొదటిసారి విద్యారంభం చేసే శుభసమయం. దీన్ని విద్యారంభ ముహూర్తం లేదా విద్యారంభం అని కూడా అంటారు. సాధారణంగా 2 నుండి 5 సంవత్సరాల వయస్సులో పిల్లలకు ఈ శుభకార్యం చేస్తారు.



ఎప్పుడు చేస్తారు?


విజయదశమి రోజు (దసరా) – సర్వోత్తమ ముహూర్తం, ఎటువంటి తిథి-నక్షత్ర దోషాలు చూడకపోయినా సరిపోతుంది.


వసంత పంచమి (శ్రీ సరస్వతి దేవి పూజా రోజు) – విద్యకు శ్రేష్ఠమైన సమయం.


అక్షయ తృతీయ – అన్ని విద్యారంభాలకూ మంగళకరమైన రోజు.


శుభ తిథులు, శుభ నక్షత్రాల్లో కూడా చేయవచ్చు (తిథి, నక్షత్రం తప్పుగా ఉండకూడదు).


 తిథులు


శుభ తిథులు: ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి


తప్పించుకోవాల్సిన తిథులు: అమావాస్య, చతుర్థి, అష్టమి, నవమి



 నక్షత్రాలు


ఉత్తమ నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి


వర్జ్య నక్షత్రాలు: భరణి, కృత్తిక, అశ్లేష, జ్యేష్ఠ, ముల, శతభిషం



 లగ్నాలు


మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ లగ్నాలు అనుకూలం.


వృష్చిక, మకర లగ్నాలను సాధారణంగా తప్పిస్తారు.

Read More

యుద్ధ ముహూర్తం

 యుద్ధ ముహూర్తం 


యుద్ధం అనేది సాధారణ శుభకార్యం కాదు. అందువల్ల దీనికి ముహూర్తం నిర్ణయించడం అరుదైన జ్యోతిష్య శాస్త్రపద్ధతి. కానీ వేదాలు, స్మృతులు, గృహ్యసూత్రాలు, పురాణాలలో "యుద్ధ ముహూర్తం" ప్రస్తావన ఉంది. ముఖ్యంగా కౌటిల్య అర్థశాస్త్రం, మనుస్మృతి, మహాభారతం, బృహత్సంహితా, శుక్రనీతిసారం, జాతకపారిజాతం మొదలైన గ్రంథాలు యుద్ధ సమయ విశ్లేషణను ఇచ్చాయి.



 1. యుద్ధ ముహూర్తం ప్రాముఖ్యత


యుద్ధం ప్రారంభించే ముందు రాజులు జ్యోతిష్యుల ద్వారా ముహూర్తం నిర్ణయించుకునేవారు.


శత్రువు బలహీనంగా ఉండే కాలంలో, దుష్ట గ్రహబలహీనత ఉన్నప్పుడు యుద్ధం శ్రేయస్కరం.


చంద్రుడు, మంగళుడు, గురువు స్థితి యుద్ధంలో ముఖ్యపాత్ర.




 2. యుద్ధ ముహూర్తంలో ప్రధాన నియమాలు


శుభ యుద్ధ ముహూర్తం


తిథులు: ద్వితీయ, తృతీయ, పంచమి, షష్టి, దశమి, త్రయోదశి → యుద్ధానికి అనుకూలం.


వారాలు: మంగళవారం, ఆదివారం, గురువారం → శక్తిదాయకం.


నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, అనూరాధ, ధనిష్ఠ, శ్రవణం → విజయప్రదం.


యోగాలు: శుభ, సిద్ద, శోభన, అమృత యోగాలు శ్రేయస్కరాలు.


లగ్నాలు: మేష, సింహ, వృశ్చిక, ధనుస్సు లగ్నాలు యుద్ధంలో విజయం ఇస్తాయి.



అశుభ యుద్ధ ముహూర్తం


తిథులు: అమావాస్య, చతుర్థి, అష్టమి, నవమి, ద్వాదశి, పౌర్ణమి → నష్టప్రదం.


నక్షత్రాలు: భరణి, కృత్తిక, అశ్లేష, జ్యేష్ఠ, మూల, శతభిషం → హానికరం.


యోగాలు: గండ, విస్ఘటి, అతిగండ, శూల → అపజయం.


అమంగళ గ్రహబలము: శుక్రుడు బలవంతుడైతే యుద్ధం శత్రువుకు శ్రేయస్కరం అవుతుంది.




 3. ప్రాచీన గ్రంథాల సూచనలు



యుద్ధంలో చంద్రుని స్థానం అత్యంత ముఖ్యమైనది.


శత్రు రాశిలో చంద్రుడు ఉంటే యుద్ధం ప్రారంభించరాదు.


స్వరాశి, ఉచ్ఛరాశి, మిత్రరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు యుద్ధం శ్రేయస్కరం.



(b) కౌటిల్య అర్థశాస్త్రం:


యుద్ధం చేయడానికి ముందు అమావాస్య, పౌర్ణమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వర్జ్యం.


శత్రువు నిద్రలో లేదా అశుభ సమయంలో యుద్ధం ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.



(c) మహాభారతం – భీష్మపర్వం:


పాండవులు, కౌరవులు కూడా జ్యోతిష్యుల ద్వారా యుద్ధ సమయం నిర్ణయించుకున్నారు.


"మంగళవారం, ద్వితీయ తిథి, ఉత్తమ నక్షత్రంలో యుద్ధం విజయం ఇస్తుంది" అని చెప్పబడింది.



(d) శుక్రనీతిసారం:


శత్రువుతో యుద్ధానికి ముందుగా రాజ్య చక్రవర్తి తన జ్యోతిష్యుడి సలహా తీసుకొని ముహూర్తం నిర్ణయించాలి.


అశుభ ముహూర్తంలో ప్రారంభమైన యుద్ధం ఎంత బలమున్నా ఓటమిని ఇస్తుంది.




4. యుద్ధ ముహూర్త ఫలితాలు (గ్రంథోక్తం)


ఉదయం / సాయంత్రం ప్రారంభం → విజయం.


రాత్రివేళ యుద్ధం → నష్టప్రదం.


సూర్యోదయానికి దగ్గరగా ప్రారంభమైతే → శత్రు భయం తొలగిపోతుంది.


మంగళ గ్రహబలం ఉన్నప్పుడు → ధైర్యం, శక్తి, విజయం.


శుక్ర బలం ఎక్కువైతే → శత్రువు పైచేయి సాధిస్తాడు.

Read More

బృహత్సంహితా ప్రకారం యుద్ధ సూచనలు

 బృహత్సంహితా ప్రకారం యుద్ధ సూచనలు


సూచన శుభం / అశుభం ఫలితం (యుద్ధంలో)


సూర్యుడు ఎర్రగా, ప్రకాశవంతంగా ఉదయిస్తే శుభం రాజుకు విజయం


సూర్యుడు మబ్బులో, కాంతి లేని విధంగా ఉంటే అశుభం ఓటమి, నష్టం


చంద్రుడు శుభరాశిలో, మిత్రరాశిలో ఉంటే శుభం యుద్ధ విజయం


చంద్రుడు పాపగ్రహ సంయోగంలో ఉంటే అశుభం అపజయం


గాలి తూర్పు/ఉత్తర దిశ నుండి వీచితే శుభం శత్రు భయం తగ్గిపోతుంది


గాలి పశ్చిమ/దక్షిణం నుండి వీచితే అశుభం సైన్యంలో గందరగోళం


పక్షులు కుడి వైపు ఎగిరితే శుభం సైన్యానికి ధైర్యం, విజయం


పక్షులు ఎడమ వైపు ఎగిరితే అశుభం శత్రువు బలవంతం అవుతాడు


మెరుపులు కుడివైపు కనబడితే శుభం రాజుకు జయం


మెరుపులు ఎడమవైపు కనబడితే అశుభం ఓటమి, నష్టం


గర్జనలు దక్షిణ దిశలో వస్తే అశుభం యుద్ధంలో నష్టాలు


గర్జనలు ఉత్తర దిశలో వస్తే శుభం విజయవంతం అవుతాడు


ఆకాశంలో ఇంద్రధనుస్సు శత్రు వైపున ఉంటే శుభం శత్రువు ఓడిపోతాడు


ఇంద్రధనుస్సు రాజు వైపున ఉంటే అశుభం అపజయం సంభవిస్తుంది


ఏనుగులు, గుర్రాలు ఉత్సాహంగా ఉంటే శుభం సైన్య బలం పెరుగుతుంది


జంతువులు అలసటగా, భయంతో ప్రవర్తిస్తే అశుభం సైన్యం క్షీణిస్తుంది

Read More

మహాభారతంలో యుద్ధ ముహూర్తం

 మహాభారతంలో యుద్ధ ముహూర్తం


గ్రంథ ఆధారాలు: భీష్మ పర్వం, ఉధ్యోగ పర్వం

పండితులు చెప్పిన ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం శరదృతువులో, మార్గశిర మాసం, బహుల పక్షం, అమావాస్య సమీపంలో ప్రారంభమైంది.



గ్రహ స్థితులు (యుద్ధారంభ సమయంలో)


1. అమావాస్య సమీపం – చంద్రుడు కనబడని స్థితి.


ఇది అశుభముగా పరిగణించబడుతుంది.


ధర్మపక్షానికి కఠిన యుద్ధం జరగబోతుందనే సూచన.




2. శనిగ్రహం రోహిణి నక్షత్రంలో సంచారం


శనిగ్రహం రోహిణిలో ఉంటే ప్రపంచంలో కలహాలు, యుద్ధాలు, దుర్భిక్షాలు వస్తాయని వేద జ్యోతిష్య సూత్రం.


ఇది మహాయుద్ధ సూచన.




3. కుజుడు (మంగళుడు) స్వగ్రహంలో (వృశ్చిక రాశి)


కుజుడు రక్తం, యుద్ధం, సైన్యం, హింస సూచకుడు.


వృశ్చికంలో ఉండటం వలన యుద్ధం తీవ్రమైన రక్తపాతం కలిగించింది.




4. శుక్రుడు, గురువు ప్రతికూల స్థానంలో


శాంతి, క్షమ, సద్వివేకం తగ్గి – యుద్ధం తప్పదనే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి.




5. రాహు – కేతు ప్రధాన స్థితులు


రాహు మిథునంలో, కేతు ధనుస్సులో ఉండి, రెండు శత్రు శిబిరాల మధ్య ఘర్షణను మరింతగా ప్రేరేపించాయి.




భీష్మ వచనం (మహాభారతం - భీష్మ పర్వం)


> "శని రోహిణీలో సంచరించుచున్నాడు, అశ్విని యందు సూర్యుడు, మంగళుడు వృశ్చికరాశిలో ప్రకాశించుచున్నాడు.

ఇలాంటి సమయములో యుద్ధం తప్పదని గ్రహాలే చెప్పుచున్నాయి."




 తాత్పర్యం


కురుక్షేత్ర యుద్ధం దోషములతో నిండిన ముహూర్తంలో జరిగింది.


అందుకే 18 రోజులలోనే 64 కోట్ల (గ్రంథాల ప్రకారం) యోధులు మరణించారు.

Read More

పంచక నక్షత్రాలు

 1. పంచక నక్షత్రాలు


మొదట మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి.

పంచక నక్షత్రాలు:


1. ధనిష్ఠ



2. శతభిషం



3. పూర్వాభాద్రపద



4. ఉత్తరాభాద్రపద



5. రేవతి



ఈ 5 నక్షత్రాల్లో చంద్రుడు ఉంటే, అది పంచక కాలం.


2. పంచక దోషం ఏ పనికి?


ప్రతి నక్షత్రంలో ఒక ప్రత్యేక పనికి దోషం ఉంటుంది.


నక్షత్రం దోషం ఫలితం


ధనిష్ఠ గృహ నిర్మాణం, మేడలు అగ్ని ప్రమాదం

శతభిషం దక్షిణ ప్రయాణం అనారోగ్యం

పూర్వాభాద్రపద వస్త్రాలు, చీరలు ఆర్థిక నష్టం

ఉత్తరాభాద్రపద పడకలు, మంచం, మేడ పనులు ప్రమాదం

రేవతి శవకార్యం మరణాలు పెరుగుట



 3. పంచక రహితం చేయుటకు పరిహారాలు


పంచక దోషాన్ని రహితం చేయడానికి పంచక రహిత ముహూర్తం వాడతారు.


శవకార్యం (రేవతి పంచకం)

→ ఒక శవంతో పాటు 5 గడ్డలు కలిపి దహనం చేయాలి.


గృహనిర్మాణం (ధనిష్ఠ పంచకం)

→ పైకప్పు మొదలుపెట్టే ముందు 5 ఇటుకలు లేదా రాళ్లు ప్రతీకాత్మకంగా వేయాలి.


వస్త్ర వ్యాపారం/కొత్త బట్టలు (పూర్వాభాద్రపద పంచకం)

→ 5 వస్త్రాలు దానం చేయాలి.


ప్రయాణం (శతభిషం పంచకం)

→ ప్రయాణానికి ముందు 5 గడ్డి కత్తులు/కొబ్బరి తీసుకొని దానం చేయాలి.


పడకలు, మేడ పనులు (ఉత్తరాభాద్రపద పంచకం)

→ 5 చెక్క ముక్కలు దానం చేసి, ఆ తరువాత పనులు ప్రారంభించాలి.



ఇలా చేస్తే, పంచక దోషం తొలగి – అది పంచక రహితం ముహూర్తం అవుతుంది.



 4. ముహూర్తం లెక్క


పంచక నక్షత్రాల్లో చంద్రుడు ఉన్న సమయాన్ని (పంచకం) పంచక ముహూర్తం అంటారు.


ఆ సమయంలో పరిహారాలు చేసిన తర్వాత చేసే సమయం పంచక రహిత ముహూర్తం.


అంటే “పంచకం రహితమైన సమయం” అని అర్థం.



పంచక కాలం అశుభం. కానీ గ్రంథాలు పరిహారాలను చెప్పాయి. ఆ పరిహారాలు చేసిన తర్వాత ముహూర్తం “పంచక రహితం” అవుతుంది. దాంతో శుభపనులు నిరభ్యంతరంగా సాగుతాయి.

Read More

ముహూర్తం చూడడం ఎలా?

 ముహూర్తం చూడడం ఎలా?


శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః

మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//


          మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన   విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది.  కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.


ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.

౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు

వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.


ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం”  గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు.  అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.


  ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు  గ్రహించాలి.

Read More

చంద్ర బలం

 చంద్ర బలం

ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.


జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి

శుక్ల పక్షంలో :  2-5-9

క్రిష్ణ  పక్షంలో :  4-8-12

శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.


అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

Read More

ఏకవింశతి మహాదోషాలు (21 దోషాలు)

 ఏకవింశతి మహాదోషాలు (21 దోషాలు) 


జ్యోతిష్యంలో ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు తప్పనిసరిగా చూసే 21 మహా దోషాలు ఉన్నాయి. వీటిని ఏకవింశతి మహాదోషాలు అంటారు. వీటిలో ఏదైనా ఒకటి ఉన్నా ముహూర్తం అశుభమవుతుంది.


 ఏకవింశతి మహాదోషాల జాబితా


(ప్రామాణిక గ్రంథాలు: ముహూర్త చింతామణి, ధర్మసింధు, నిర్ణయ సింధు)


1. తిథి దోషం



2. వార దోషం



3. నక్షత్ర దోషం



4. యోగ దోషం



5. కరణ దోషం



6. వర్జ్యం



7. గండాంతం



8. యమగండం



9. రాహుకాలం



10. గులికకాలం



11. గజకేశర దోషం (ముహూర్త సంబంధం లో ప్రత్యేక విధంగా)



12. శూన్య పంచకం



13. గండ పంచకం



14. అశ్లేష ముహూర్తం



15. గణదోషం



16. నక్షత్ర శాపం



17. రవిశప్తమి (సూర్యోదయ సమయం 7వ తిథి)



18. చంద్రాస్తమ దోషం (చంద్రుడు అస్తమించు సమయం)



19. సూర్యాస్తమ దోషం (సూర్యుడు అస్తమించే సమయం)



20. పంచక దోషం



21. బానప్రవేశ దోషం (చంద్రుడు 22వ నక్షత్రంలో)




 దోషాల ప్రాముఖ్యత


ఈ 21 దోషాలు అశుభకార్యాలకు (ఉదా: శవకార్యం, తపస్సు) అనుకూలంగా ఉండవచ్చు.


కానీ శుభకార్యాలకు (ఉదా: వివాహం, గృహప్రవేశం, శిశు జననం, వ్యాపారారంభం) వీటిని తప్పక నివారించాలి.



 దోష నివారణ


1. కొంతమంది దోషాలకు మంత్ర జపం, దానం, జపోపచారం ద్వారా పరిహారం చేయవచ్చు.



2. కొన్ని దోషాలు (ఉదా: రాహుకాలం, యమగండం, గులికకాలం) పూర్తిగా తప్పించడమే ఉత్తమం.



3. పంచకంలో పరిహారాలు (5 వస్తువులు ప్రతీకగా దహనం/దానం) చేస్తే అది రహితం అవుతుంది.



“ఏకవింశతి మహాదోషాలు” అనేవి ముహూర్త శాస్త్రంలో శుభకార్యాలకు తప్పనిసరిగా నివారించవలసిన 21 ప్రధాన అశుభకాలాలు. వీటిని తప్పించి మాత్రమే శుభముహూర్తం నిర్ణయిస్తారు

Read More

ముహూర్తం జాతక దోషాలను తొలగిస్తుందా? ముహూర్తం (శుభ సమయం) అనేది జాతకంలో

 ముహూర్తం జాతక దోషాలను తొలగిస్తుందా?


ముహూర్తం (శుభ సమయం) అనేది జాతకంలో ఉన్న దోషాలను పూర్తిగా తొలగించదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది, అనగా దోష ఫలితాలు కఠినంగా రాకుండా, అనుకూల మార్పులు కలిగేలా చేస్తుంది.


1. జాతక దోషాలు (కుండలి దోషాలు)


కుజ దోషం, షష్ఠాష్టక దోషం, గజకేసరి భంగం వంటివి వ్యక్తిగత జాతకంలో కనిపిస్తాయి.


ఇవి కర్మఫల రూపంలో వస్తాయి కాబట్టి పూర్తిగా మాయమవ్వవు.


2. ముహూర్తం పాత్ర


శుభమైన తిథి, నక్షత్రం, లగ్నం, యోగం, కరణం, దినాధిపతి మొదలైన అంశాలను ఎంచుకోవడం ద్వారా దోషాల తాటికీ ప్రతికూలత తగ్గుతుంది.


ఉదాహరణకు: వివాహంలో కుజదోషం ఉంటే, శుభ ముహూర్తంలో కుజుడు శుభ స్థితిలో ఉండేలా చూసి పెళ్లి చేస్తే దోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది.


3. గ్రంథాల ప్రకారం


ముహూర్త చింతామణి, ధర్మసింధు, కాళామృతం వంటి గ్రంథాలు చెబుతున్నాయి:

"జాతక దోషం శక్తిగా ఉన్నా, శుభ ముహూర్తంలో ఆ క్రియ మొదలుపెడితే దాని దుష్ప్రభావం చాలా తగ్గిపోతుంది."


4. ఉదాహరణలు


గృహప్రవేశం: జాతకంలో వాస్తు దోషం ఉన్నా, శుభ ముహూర్తంలో ప్రవేశం చేస్తే శాంతి వస్తుంది.


వివాహం: రాశి-గుణ మేళం లోపం ఉన్నా, శోభన ముహూర్తం ఎంచుకుంటే సఖ్యత పెరుగుతుంది.


5. పరిహారాల తో కలిపి



ముహూర్తం తో పాటు శాంతి, దానాలు, జపాలు, హోమాలు చేస్తే దోష నివారణ మరింత బలంగా ఉంటుంది.


ముహూర్తం అనేది జాతక దోషాలను తొలగించదు, కానీ వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు శుభఫలాలను పెంచుతుంది. ఇది కర్మ శక్తి – కాల శక్తి – దేవ శక్తి మధ్య సమన్వయం.

Read More

శంఖు స్థాపన ముహూర్తం ఎలా నిర్ణయించాలి?

 శంఖు స్థాపన ముహూర్తం ఎలా నిర్ణయించాలి?


1. తిథి


ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ → శ్రేష్ఠమైన తిధులు.


అమావాస్య, అష్టమి, చతుర్థి, నవమి, ద్వాదశి → వర్జ్యం.



2. నక్షత్రం


ఉత్తమ నక్షత్రాలు: రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, రేవతి.


కృత్తిక, అశ్లేష, మఖ, మూల, శతభిషం, జ్యేష్ఠ → తప్పించాలి.



3. వారము


సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం → శ్రేయస్కరం.


మంగళవారం, శనివారం వర్జ్యం.



4. యోగం – కరణం


శోభన యోగం, సుభ యోగం, సిద్ధ యోగం శ్రేష్ఠం.


బవ, బాలవ, కౌలవ, తైతిల, గరజ, వణిజ కరణాలు శ్రేష్ఠం.



5. లగ్నం


శుభ లగ్నాలు (మేష, వృషభ, మిథున, సింహ, కన్య, ధనుస్సు, కుంభం) లో శంఖు స్థాపన శ్రేయస్కరం.


లగ్నాధిపతి బలవంతుడు కావాలి.

: గృహప్రవేశ ముహూర్తం – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 


గృహ ప్రవేశం అంటే కొత్త ఇల్లు లోకివెళ్ళి మొదటి సారి నివాసం ఉండటం. జ్యోతిష్యం ప్రకారం ఇది ఒక అత్యంత పవిత్రమైన శోభన కర్మ. ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత గృహ ప్రవేశానికి శుభ ముహూర్తం ఎంచుకోవడం చాలా ముఖ్యం.


గృహ ప్రవేశానికి శాస్త్రోక్త ప్రాముఖ్యం


1. గృహంలోకి ప్రవేశించే సమయానికే ఆ ఇంటి వాస్తు, జ్యోతిష్య శక్తులు ప్రభావం చూపుతాయి.



2. శుభ ముహూర్తంలో ప్రవేశిస్తే – ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌఖ్యం, వంశవృద్ధి కలుగుతాయి.



3. అశుభ ముహూర్తంలో చేస్తే – రోగాలు, విఘ్నాలు, దారిద్ర్యం, కుటుంబ కలహాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది.





గృహ ప్రవేశానికి అనుకూల కాలాలు


1. ఉత్తమ మాసాలు (చాంద్రమానం ప్రకారం)


వసంత రుతువు → వైశాఖ, జ్యేష్ఠ → అత్యుత్తమం


శరదృతువు → మాఘ, ఫాల్గుణ → శ్రేష్ఠం


హేమంత రుతువు → మాఘ, ఫాల్గుణ → మంచివి



తప్పించవలసిన మాసాలు: ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర (ఇవి దేవతల విశ్రాంతి, దక్షిణాయన, విష్ణు శయన మాసాలు).




2. తిథులు


శుభం: ద్వితీయ, తృతీయ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ.


వర్జ్యం: చతుర్థి, అష్టమి, నవమి, ద్వాదశి, అమావాస్య.



3. నక్షత్రాలు


ఉత్తమ నక్షత్రాలు: రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి.


వర్జ్య నక్షత్రాలు: కృత్తిక, అశ్లేష, మఖ, మూల, జ్యేష్ఠ, శతభిషం.




4. వారాలు


శ్రేష్ఠం: సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.


వర్జ్యం: మంగళవారం, శనివారం. (కొన్ని ప్రాంతాలలో మంగళవారం వీధి ప్రవేశంకి అనుకూలం అంటారు, కానీ గృహ ప్రవేశానికి కాదు).




5. లగ్నాలు


మేష, వృషభ, మిథున, సింహ, కన్య, ధనుస్సు, కుంభ లగ్నాలు శుభం.


లగ్నాధిపతి బలంగా ఉండాలి.


8వ, 12వ భావాల్లో పాపగ్రహాలు లేకుండా చూసుకోవాలి..

Read More

22, సెప్టెంబర్ 2025, సోమవారం

బారసాల ముహూర్తం నిర్ణయం

 బారసాల ముహూర్తం నిర్ణయం


1. సాధారణంగా


పుట్టిన 11వ రోజు లేదా 12వ రోజు బారసాల చేసుకుంటారు.


కొన్నిచోట్ల 16వ రోజు లేదా 21వ రోజు కూడా చేస్తారు.


పుట్టిన శిశువు శరీరం బలంగా మారి స్నానానికి సిద్ధం అయ్యే సమయానికే ముహూర్తం నిర్ణయిస్తారు.




2. మంచి తిథులు


ద్వితీయ, తృతీయ, పంచమి, షష్టి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి.


అమావాస్య, చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి తప్పించాలి.




3. మంచి వారాలు


సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూలం.


మంగళవారం, శనివారం తప్పించుకోవాలి.




4. నక్షత్రాలు


అశ్విని, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర మంచి నక్షత్రాలు.


కృత్తిక, ఆర్ద్ర, జ్యేష్ఠ, ముల, పూర్వాభాద్ర వంటివి నివారించాలి.




5. ముహూర్తం చూసేటప్పుడు


శిశువు జన్మనక్షత్రం, లగ్నం అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయించాలి.


పితృదోష, దినదోష, నక్షత్రదోష రాకూడదు.


గృహంలో శుభం కలిగించే సమయాన్ని ఎంచుకోవాలి.




6. ప్రత్యేకంగా


కొన్ని కుటుంబాల్లో గోత్రాచార ప్రకారం 21వ రోజునే బారసాల తప్పనిసరిగా చేస్తారు.

Read More

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఉద్యోగ_లాభకర_శ్రీలక్ష్మీ_వేంకటేశ్వర_మంత్రము

 *ఉద్యోగ_లాభకర_శ్రీలక్ష్మీ_వేంకటేశ్వర_మంత్రము*

‎ఉద్యోగం రావడానికి ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు,ప్రమోషన్స్ కోసం.

‎ ఉద్యోగ లాభకర శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర మంత్రము:-

‎ "ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ వేంకటేశాయ తిరుమలనివాసాయ రామకృష్ణ గోవిందావతారాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరంజ్యోతిషే మమ శతృసంహారణాయ సకలైశ్వర్యప్రదాయ మమ చింతిత ఫలం దేహి దేహి కలిదోష నివారణాయ హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వాహా".

‎ఉపాసనా విధానము :-

‎ఉద్యోగ సాధక మంత్రము లక్ష్మీ వెంకటేశ్వర మంత్రముతో ‎ఉద్యోగం రావడానికి ప్రతిరోజు ఉదయము 108 సార్లు చేయాలి. అలాగే శనివారం విశేషంగా

‎ఇంట్లో ధ్యానము చేయువారు నిత్యము పై మంత్రాన్ని ఉదయము 108 సార్లు, ధ్యానించాలి. 

‎ఉద్యోగంలో ఇబ్బంది, ప్రమోషన్ రాకపోవడం, మరియు ఉన్నత అధికారులు, తోటి ఉద్యోగులతో సమస్య ఉన్నప్పుడు, 

‎ 72 రోజులు  పైన మంత్రాన్ని 108 సార్లు ధ్యానించాలి. శనివారం ఒక్కరోజు బెల్లం పాయసం నివేదన చేయండి. మిరియాలు, 11రూపాయలు చిల్లర నాణేలు, చెరువులో,నదీలో లేదా నదీ ప్రవాహంలో వేయగలరు. 21వ రోజు నుండి మార్పు ఉంటుంది, శనివారం పూజ మాత్రం 7 శనివారములు చేయండి.

Read More

కూష్మాండ అంటే గుమ్మడి కాయ

 కూష్మాండ అంటే గుమ్మడి కాయ 


కూష్మాండ దీపం అంటే ఎంటి ?ఎలా వెలిగిస్తారు ? దేని కోసం వెలిగిస్తారు ? 

 

. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నర ఘోష ,శని దోషం, ఆర్ధిక సమస్యలు, ఇంట్లో నెగిటి్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం 

పిల్లలు మాట వినకపోవడo మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం, మంచి పరిహారం ఉంది ఇది అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే .


 ఒక చిన్న గుమ్మడి  (బూడిద)  కాయ తీసుకుని చిన్నది పెద్దది కాదు . దాన్ని అడ్డగ కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి  అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి . 


ఆ దీపానికి పంచ ఉపచర పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి 


ఎప్పుడు చెయ్యాలి ఈ దీపారాధన 

బహుళ అష్టమి రోజున కానీ 

అమావాస్య రోజున కానీ చెయ్యాలి 


ధన యోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి 

జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చెయ్యాలి

 

ఎన్ని సార్లు చెయ్యాలి 19 అష్టములు కానీ 

19 అమావాస్య లు కానీ చెయ్యాలి 

ప్రసాదం గా ఎండు ఖర్జూరం పెట్టాలి 

 

ఆ రోజు నాక్తం ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి 

ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో చెయ్యాలి .

సంకల్ప మాత్రం చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవాలి 

  

మీ జీవితం లో ఉన్న పూర్తి దృష్టి గ్రహ వాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి 

ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది...

Read More

శ్రీ దేవీ శరన్నవరాత్రులు 1వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ" అలంకారం

 *_𝕝𝕝ॐ𝕝𝕝 22/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 1వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


*_శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ_*

*≈≈≈━❀꧁  🔆  ꧂❀━≈≈≈*


*_శ్లో||  హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!_*


త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.


*𝕝𝕝ॐ𝕝𝕝 _oఓo శ్రీమాత్రే నమః_ 𝕝𝕝卐𝕝𝕝*

Read More

9 రోజుల నవరాత్రి మరియు 9 పరిహారాలు 1. శైలపుత్రి మాత - శివ కుటుంబాన్ని పూజించడం

 9 రోజుల నవరాత్రి మరియు 9 పరిహారాలు


1. శైలపుత్రి మాత - శివ కుటుంబాన్ని పూజించడం ద్వారా వ్యాధుల నుండి ఉపశమనం పొందండి.


2. బ్రహ్మచారిణి మాత - నెయ్యి దీపం వెలిగిస్తే దీర్ఘాయువు, శాంతి లభిస్తాయి.


3. మా చంద్రఘంట గంట ధ్వనితో ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించండి.


4. కూష్మాండ మాత - సూర్యుడికి అర్ఘ్యం అర్పిస్తే వ్యాధులు, దోషాలు మరియు దారిద్య్రం తొలగిపోతాయి.


5. స్కందమాత తల్లి - చిన్న పిల్లలకు చక్కెర మిఠాయిలు పంచండి, పిల్లల ఆనందం మరియు రక్షణ ఉంటుంది.


6. కాత్యాయణి మాత రజస్వల అయిన అమ్మాయిలకు బట్టలు దానం చేస్తే వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి.


7. కాళరాత్రి మాత - నల్ల నువ్వులను దానం చేయండి, భయం మరియు పాపాల నుండి ఉపశమనం లభిస్తుంది.


8. మహాగౌరి అమ్మవారు - తెల్లని వస్తువులను దానం చేస్తే అందం మరియు అదృష్టం పెరుగుతాయి.


9. సిద్ధిదాత్రి మాత - దుర్గా సప్తశతి పారాయణం చేయండి, మీ అన్ని పనులలో విజయం లభిస్తుంది.

Read More

దేవాలయం లో విగ్రహ ప్రతిష్ఠ

  


దేవాలయం లో విగ్రహ ప్రతిష్ఠ (ప్రాణ ప్రతిష్ఠ / విగ్రహ ప్రతిష్టాపన) ముహూర్తం నిర్ణయం ఒక పెద్ద శాస్త్రం. దీన్ని ఆగమ శాస్త్రం, వాస్తు శాస్త్రం, పంచాంగ శాస్త్రం ఆధారంగా నిర్ణయిస్తారు. 



1) విగ్రహ ప్రతిష్ఠకు ప్రధాన ఆధారాలు


1. ఆగమ శాస్త్రం – శైవ, శాక్త, వైష్ణవ, గణపత్య, సౌర, శాక్తాదీ ఆగమాలు ప్రతిష్ఠ విధానం చెబుతాయి.



2. వాస్తు శాస్త్రం – దేవాలయం నిర్మాణం, దిశలు, గర్భగృహం, ద్వారం వంటివి అనుసరించాలి.



3. పంచాంగ శాస్త్రం – శుభ ముహూర్తం కోసం తిథి, నక్షత్రం, లగ్నం, యోగం, కరణం మొదలైనవి పరిశీలించాలి.



2) పంచాంగం ఆధారంగా ముహూర్తం నిర్ణయం


(A) తిథి


శుభ తిథులు: ద్వితీయ, తృతీయ, పంచమి, షష్ఠి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి.


వర్జ్య తిథులు: అమావాస్య, పూర్ణిమ, అష్టమి, చతుర్దశి.



(B) నక్షత్రం


ఉత్తమ నక్షత్రాలు: రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర ఫల్గుని, హస్త, స్వాతి, అనూరాధ, ముల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి.


వర్జ్య నక్షత్రాలు: కృత్తిక, అశ్లేష, జ్యేష్ఠ, మఖ, మూల, ధనిష్ఠ – వీటిలో కర్కశ ఫలితాలు రావచ్చు.



(C) వారము


సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం – మంగళకరంగా పరిగణించబడతాయి.


శనివారం, మంగళవారం (క్రూర గ్రహ ప్రభావం) సాధారణంగా తప్పించుకోవాలి.



(D) లగ్నం


శుభ లగ్నాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీనం.


తప్పించవలసినవి: వృశ్చికం, మకరం, కుంభం.



(E) యోగం & కరణం


శుభ యోగాలు: శోభన, సుభ, శివ, సిధ్ధి, ధ్రువ.


వర్జ్య యోగాలు: వైధృతి, వ్యతిపాతం.


శుభ కరణాలు: బవ, బాలవ, కౌలవ, తైతిల, గరజ, వణిజ, విశ్టి (భద్ర) తప్ప.




3) ప్రత్యేక ఆచారాలు


ముందుగా స్థల శుద్ధి, భూమి పూజ చేసి, ఆలయం సిద్ధం చేస్తారు.


ఆ తర్వాత కలశ స్థాపన, ధ్వజారోహణం, యాగ శాల ప్రతిష్ఠ జరుగుతుంది.


ప్రాణ ప్రతిష్ఠ కోసం అధికారి పండితులు, ఆగమ శాస్త్ర నిపుణులు ఉండాలి.


హోమాలు, జపాలు, వేద మంత్రోచ్ఛారణ ద్వారా విగ్రహంలో చైతన్యం (ప్రాణ ప్రవేశం) చేస్తారు.



4) సమయ పరిశీలన


రాహుకాలం, యమగండం, గులిక ముహూర్తంలో చేయరాదు.


సాధారణంగా సూర్యోదయం తర్వాత పూర్వాహ్నం (ఉదయం 6–11 మధ్య) ముహూర్తం ఎంచుకుంటారు.


అభిజిత్ ముహూర్తం (మధ్యాహ్నం 11:45 – 12:30 మధ్య సూర్య గతి) కూడా ప్రతిష్ఠకు ఉపయోగిస్తారు.



5) ముహూర్తం నిర్ణయం ప్రక్రియ


1. ఆలయ దేవత స్వభావం (శివ ఆలయం, విష్ణు ఆలయం, అమ్మవారి ఆలయం మొదలైనవి) గుర్తించాలి.



2. ఆ దేవతకి అనుకూలమైన తిథి, నక్షత్రం ఎంచుకోవాలి.


ఉదా: విష్ణు ఆలయం – ద్వాదశి, రోహిణి నక్షత్రం శ్రేష్ఠం.


శివాలయం – ప్రదోష కాలం, సప్తమి/త్రయోదశి.


దుర్గాలయం – అష్టమి, నవమి, చతుర్దశి.




3. ఆలయం దిశ, స్థానం ఆధారంగా వాస్తు శాస్త్ర నిపుణులు సూచన చేస్తారు.



4. స్థానిక పంచాంగకర్త, ఆగమ శాస్త్ర పండితులు సమన్వయం చేసి ముహూర్తం ఖరారు చేస్తారు.



6) ముగింపు


దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం సాధారణ పంచాంగం చూసి నిర్ణయించరాదు.

ఇది ఒక విశిష్టమైన, దేవత ఆధారిత, ఆగమ శాస్త్ర ప్రక్రియ. కాబట్టి స్థానిక పండితులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచన తీసుకొని మాత్రమే ఖరారు చేయాలి.



Read More

13, సెప్టెంబర్ 2025, శనివారం

కుండలిని

 *కుండలిని:-*


*1. మూలాధారచక్రం* : 

☸️☸️☸️☸️☸️☸️☸️

మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.


2. *స్వాధిష్ఠాన చక్రం* : 


ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.


3. *మణిపూరక చక్రం* : 


బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.


4. *అనాహత చక్రం* : 


ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.


5. *విశుద్ధచక్రం* : 


ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.


6. *ఆజ్ఞాచక్రం* : 


ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.


7. *సహస్రారం* : 


ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

A Best Collection from Brahmana Samaakya.

=============||==============

Read More

శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏

 శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏


నమస్తే త్రిజగద్వన్ద్యే సంగ్రామే జయదాయిని ।

ప్రసీద విజయం దేహి కాత్యాయని నమోఽస్తుతే ॥


“మూడులోకాలచే పూజింపబడే కాత్యాయనీ దేవీ!

నీకు నా నమస్కారము,

యుద్ధరంగం లో నాకు విజయాన్ని ప్రసాదించు.


సర్వశక్తిమయే దుష్టరిపునిగ్రహకారిణి|

దుష్టజృమ్భిణి సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్తమైన శక్తుల రూపంలో నిండిన ఓ దేవీ!

నీకు నా నమస్కారములు.”

దుష్టులైన శత్రువులను సంహరించు, యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


త్వమేకా పరమాశక్తిః సర్వభూతేష్వవస్థితా|

దుష్టాన్సంహర సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్త భూతాలలో వ్యాపించి ఉన్న “ఓ పరమశక్తి నీకు నా నమస్కారం.”

యుద్ధ రంగములో దుష్టులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించుము.


రణప్రియే రక్తభక్షే మాంసభక్షణకారిణి।

ప్రపన్నార్తిహరే యుద్ధే జయందేహి నమోఽస్తుతే॥


రక్తమాంసాలను భుజించే భయానకరూపిణి! 

ఓ రణప్రియ! నీకు నా నమస్కారం.”

నిన్ను శరణుజొచ్చిన వారి కష్టాలను తొలగించు.

యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఖట్వాంగాసికరే ముండమాలాద్యోతితవిగ్రహే ।

యే త్వాం స్మరన్తి దుర్గేషు తేషాం దుఃఖహరా భవ ॥


చేతులలో ఖట్వాంగం (మృత్యుదండం) మరియు ఖడ్గం పట్టినదానవు, మెడలో కపాల మాలలతో ప్రకాశించే దివ్య స్వరూపిణివి. కష్ట సమయాల లోను, ప్రమాదపు అంచుల లోను నిన్ను స్మరించే వారి యొక్క దుఃఖాలను తొలగించు.”


త్వత్పాదపంకజాద్దైన్యం నమస్తే శరణప్రియే|

వినాశాయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


శరణాగతులను రక్షించుట యందు ఆసక్తికల ఓ దేవి , నీ పాద పద్మములను ధ్యానించి నమస్కరిస్తున్నాను నా శత్రువులను నశింపచేసి నాకు విజయాన్ని ప్రసాదించు.”


చిన్త్యవిక్రమేఽచిన్త్యరూపసౌన్దర్యశాలినీ ।

అచిన్త్యచరితేఽచిన్త్యే జయందేహి నమోఽస్తుతే॥


ఓ అచిన్త్యశక్తి! నీకు నా నమస్కారం.”ఆలోచించలేనంత మహావిక్రమం కలిగిన దానవు, మనస్సు తో ఊహించని నిగూఢ కార్యములు చేయు దానవు వర్ణించలేనంత సౌందర్యరూపిణివి , యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


యే త్వాం స్మరన్తి దుర్గేషు దేవీం దుర్గవినాశినీమ్ ।

నావసీదన్తి దుర్గేషు జయం దేహి నమోఽస్తుతే ॥


దుర్గవినాశినీ దేవీ! నీకు నమస్కారం.

కష్ట సమయాలలో నిన్ను స్మరించే వారు ఎన్నడూ కృశించరు. వారికి ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదించు.


మహిషాసృక్ప్రియే సంగ్యే మహిషాసురమర్దినీ ।

శరణ్యే గిరికన్యే మే జయం దేహి నమోఽస్తుతే ॥


మహిషాసురమర్దినివి , శరణాగతులకు ఆశ్రయమైన దానవు హిమగిరికుమార్తె అయిన ఓ పార్వతీ దేవి నీకు నమస్కారం.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ప్రసన్నవదనే చణ్డి చణ్డాసురవిమర్దినీ ।

సంగ్రామే విజయం దేహి శత్రూన్ జహి నమోఽస్తుతే ॥


ప్రసన్నమైన వదనముగల దానవు , చండాసురుని సంహరించిన దానవు అయిన ఓ చండికా దేవి నీకు నమస్కారం !

నా శత్రువులను జయించి యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


రక్తాక్షి రక్తదశనే రక్తచర్చితగాత్రకే ।

రక్తబీజనిహన్త్రీ త్వం జయందేహి నమోఽస్తుతే॥


ఎరుపు కళ్ళుగల దానవు 

ఎరుపు పళ్ళుగల దానవు 

 రక్తముతో అలంకరింపబడిన శరీరముగల దానవు 

రక్తబీజాసురుని సంహరించినవు అయిన దేవీ నాకు యుద్ధంలో విజయాన్ని ప్రసాదించు. 


నిశుమ్భశుమ్భసంహన్త్రి విశ్వకర్త్రి సురేశ్వరి ।

జహి శత్రూన్ రణే నిత్యం జయందేహి నమోఽస్తుతే॥


“ఓ సురేశ్వరి! నిశుంబుడు, శుంబుడను అను దుష్టులను సంహరించిన దేవీ!

జగత్తు నకు సృష్టికర్తవు నీవే. యుద్ధంలో నా శత్రువులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


భవాన్యేతత్సర్వమేవ త్వం పాలయసి సర్వదా ।

రక్ష విశ్వమిదం మాతర్హత్వైతాన్ దుష్టరాక్షసాన్॥


“ఓ భవాని! ఈ జగత్తు నంతా ఎల్లప్పుడూ నీవే పాలిస్తున్నావు.

మాతా! 

ఈ దుష్టరాక్షసులను సంహరించి మా విశ్వాన్ని రక్షించు.”


త్వం హి సర్వగతా శక్తిర్దుష్టమర్దనకారిణి ।

ప్రసీద జగతాం మాతర్జయం దేహి నమోఽస్తుతే ॥


 నీవు సర్వవ్యాపక శక్తివి, దుష్టులను సంహరించే దానవు, జగన్మాతా 

నీకు నమస్కారము 

కరుణించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


దుర్వృత్తవృన్దదమిని సద్వృత్తపరిపాలినీ ।

నిపాతయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


దుర్మార్గులను అణచివేసి దుష్టశక్తులను నశింపజేసి ఆపదల నుండి కాపాడి సద్గుణులను రక్షించే తల్లి”నీకు నమస్కారం 

నా శత్రువులను నశింపజేసి నాకు విజయాన్ని ప్రసాదించు. 


కాత్యాయని జగన్మాతః ప్రపన్నార్తిహరే శివే ।

సంగ్రామే విజయం దేహి భయేభ్యః పాహి సర్వదా ॥


“ఓ జగన్మాతా కాత్యాయనీ! శరణాగతుల యొక్క కష్టాలను తొలగించే శివస్వరూపిణి!

అన్ని భయాలనుండి ఎల్లప్పుడూ రక్షించు.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే శ్రీరామకృతా కాత్యాయనీస్తుతిః॥

సేకరణ

Read More

అంతర్వేది లక్ష్మీ నృసింహుడు*

 *అంతర్వేది లక్ష్మీ నృసింహుడు* 


విష్ణుమూర్తి అవతారాల్లో నృసింహ అవతారం విభిన్నమైనదే కాదు విశిష్టమైనది కూడా, సింగం మనిషి, సంగం మృగర కలిసిన అవతారం కనుక ఈ అవతారం అపురూపమైనది కూడా. భక్తుని కోసం విభిన్నమైన అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తుని నమ్మకాన్ని నిజం చేసిన స్వామికి అంతర్వేది కూడా ఓ వేదికయింది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీనరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.


అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కోవెల భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం ప్రస్థావన పురాణాలలో కూడా ఉంది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు. ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.


సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరం పొందుతాడు.


ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి కింద పడిన రక్తపు బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవిస్తారు. ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే వారిని, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరించాడు. వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తావలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడని ప్రతీతి.


ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్టాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు శిలా శాసనాలవల్ల తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జనుడు తీర్థయాత్రలు చేస్తూ 'అంతర్వేది' దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన 'విజయయ విలాసము'లో, శ్రీనాధ కవిసార్వభౌముడు 'హరి విలాసం'లో రచించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం 300 ఏళ్ళకు పూర్వం నిర్మంచినట్టు తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం శిథిలమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది.

Read More

శ్రీప్రత్యంగిరా_దేవి

 #శ్రీప్రత్యంగిరా_దేవి

శ్రీ ప్రత్యంగిరా దేవి రావణుని వంశ కుల దైవం.


ప్రత్యంగిరా దేవి కాళీ దేవి యొక్క ఉగ్ర రూపం. శరభ మరియు గండభేరుండ అవతారల మధ్య భీకర యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. వారి యుద్ధం కారణంగా మూడు లోకాలలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అప్పుడు మాత ఆదిశక్తి, విశ్వ క్షేమమే ధ్యేయంగా, సింహం వంటి ముఖం ఉన్న భీకర అవతారాన్ని ధరించింది. ఇందులో శివుని శరభ అవతారం, విష్ణువు యొక్క రెండు అవతారాలు (నరసింహ మరియు గండభేరుండ) శక్తులు ఉన్నాయి. ఈ రూపం చాలా విస్తృతమైనది, అతని ముందు విశ్వం చాలా సూక్ష్మంగా ఉంది. ప్రత్యంగిర యొక్క ఉగ్ర రూపాన్ని ధరించి, తల్లి ఆదిశక్తి శరభ మరియు గండభేరుండ అవతారం వద్దకు వెళ్లి పెద్దగా చప్పుడు చేసింది. వారిద్దరూ యుద్ధాన్ని ఆపి, వారి అసలు అవతారలకు తిరిగి వచ్చారు. ఆ విధంగా మాత ఆదిశక్తి శివుడు మరియు విష్ణువు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికింది. ఆమె రావణుడి వంశ దేవత కూడా. అక్కడ అమ్మవారిని నికుంబలా అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మాతా ప్రత్యంగిర గురించి చాలా తక్కువగా తెలుసు. దక్షిణాదిలో ఉపంగిర అమ్మల్ 

అని కూడా పిలుస్తారు.. ప్రత్యంగిరాను ఎక్కువగా పూజిస్తారు. అక్కడ చాలా దేవత ఆలయాలు ఉన్నాయి. ప్రత్యంగిర అనే పదం రెండు పదాల కలయిక. ఏ రకమైన దాడి / తంత్రం / చేతబడిని తిప్పికొట్టడం అంటే, తల్లి ప్రత్యంగిరాను పూజించడం ద్వారా, ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం, చేతబడి మొదలైనవి తొలగించబడతాయి.

Read More

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది..?*🙏

 *పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది..?*🙏


 *స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్ - గరుడ పురాణం*🙏🙏🙏


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. 


కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులోచెబుతున్నాడు.


*"ప్రేత రూపం విడిపించని కులాన్ని ( కులం = వంశం ) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు.*


శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. 


ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


*ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి పితృ దేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*🙏🙏🙏 


ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. 


*ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.*


తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు నైనా చేసి తీరాలి.


*శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ మహాలయ పక్షం పదిహేను  చేయలేని వారు కనీసం  మహాలయ అమావాస్య తిథి నాడు తర్పణం శ్రాద్ధం చేసి తీరాలి.*🙏🙏🙏


🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️

Read More

మానవ శరీరంలోని వివిధ అవయవాలకు అధిష్టాన దేవతలు,

 మానవ శరీరంలోని వివిధ అవయవాలకు అధిష్టాన దేవతలు, కొన్ని ముఖ్యమైన అవయవాలు, వాటికి సంబంధించిన దేవతలు..


గుండె: విష్ణువు


మెదడు: బ్రహ్మ


కళ్ళు: సూర్యుడు


చెవులు: దిక్కులు


చేతులు: ఇంద్రుడు


పాదాలు: విష్ణువు


పొట్ట: అగ్నిదేవుడు


మూత్రపిండాలు: వరుణుడు


శ్వాసకోశాలు: వాయువు


చర్మం: చంద్రుడు, భూమి


జ్ఞానేంద్రియాలు: బ్రహ్మ మరియు ఇతర దేవతలు


సప్త మాతృకలు శరీరం లో సప్త ధాతువులు కి మరియు 27నక్షత్రాలు వారికి యోగిని ఇవ్వడానికి ఉంటారు...

డైలీ 7 సార్లు సప్త మాతృకలు స్తోత్రం చదవడం వల్ల జాతకం లో ఉన్న యోగాలు దోషాలు వల్ల పని చేయక పోతే పని చేసేలాగా చేస్తారు...

Read More

మణిద్వీపవర్ణన

 మణిద్వీపవర్ణన

         


మహాశక్తి మణిద్వీప నివాసినీ

ముల్లోకాలకు మూలప్రకాశినీ |

మణిద్వీపములో మంత్రరూపిణీ

మన మనసులలో కొలువైయుంది || ౧ ||


సుగంధ పుష్పాలెన్నో వేలు

అనంత సుందర సువర్ణ పూలు |

అచంచలంబగు మనో సుఖాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨ ||


లక్షల లక్షల లావణ్యాలు

అక్షర లక్షల వాక్సంపదలు |

లక్షల లక్షల లక్ష్మీపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౩ ||


పారిజాతవన సౌగంధాలు

సూరాధినాధుల సత్సంగాలు |

గంధర్వాదుల గానస్వరాలు

మణిద్వీపానికి మహానిధులు || ౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


పద్మరాగములు సువర్ణమణులు

పది ఆమడల పొడవున గలవు |

మధుర మధురమగు చందనసుధలు

మణిద్వీపానికి మహానిధులు || ౫ ||


అరువది నాలుగు కళామతల్లులు

వరాలనొసగే పదారు శక్తులు |

పరివారముతో పంచబ్రహ్మలు

మణిద్వీపానికి మహానిధులు || ౬ ||


అష్టసిద్ధులు నవనవనిధులు

అష్టదిక్కులు దిక్పాలకులు |

సృష్టికర్తలు సురలోకాలు

మణిద్వీపానికి మహానిధులు || ౭ ||


కోటిసూర్యుల ప్రచండ కాంతులు

కోటిచంద్రుల చల్లని వెలుగులు |

కోటితారకల వెలుగు జిలుగులు

మణిద్వీపానికి మహానిధులు || ౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కంచు గోడల ప్రాకారాలు

రాగి గోడల చతురస్రాలు |

ఏడామడల రత్నరాశులు

మణిద్వీపానికి మహానిధులు || ౯ ||


పంచామృతమయ సరోవరాలు

పంచలోహమయ ప్రాకారాలు |

ప్రపంచమేలే ప్రజాధిపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౦ ||


ఇంద్రనీలమణి ఆభరణాలు

వజ్రపుకోటలు వైఢూర్యాలు |

పుష్యరాగమణి ప్రాకారాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౧ ||


సప్తకోటిఘన మంత్రవిద్యలు

సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు |

శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౨ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మిలమిలలాడే ముత్యపు రాశులు

తళతళలాడే చంద్రకాంతములు |

విద్యుల్లతలు మరకతమణులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౩ ||


కుబేర ఇంద్ర వరుణ దేవులు

శుభాల నొసగే అగ్నివాయువులు |

భూమి గణపతి పరివారములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౪ ||


భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు

పంచభూతములు పంచశక్తులు |

సప్తఋషులు నవగ్రహాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౫ ||


కస్తూరి మల్లిక కుందవనాలు

సూర్యకాంతి శిల మహాగ్రహాలు |

ఆరు ఋతువులు చతుర్వేదాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౬ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మంత్రిణి దండిని శక్తిసేనలు

కాళి కరాళీ సేనాపతులు |

ముప్పదిరెండు మహాశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౭ ||


సువర్ణ రజిత సుందరగిరులు

అనంగదేవి పరిచారికలు |

గోమేధికమణి నిర్మితగుహలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౮ ||


సప్తసముద్రములనంత నిధులు

యక్ష కిన్నెర కింపురుషాదులు |

నానాజగములు నదీనదములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౯ ||


మానవ మాధవ దేవగణములు

కామధేనువు కల్పతరువులు |

సృష్టి స్థితి లయ కారణమూర్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౦ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కోటి ప్రకృతుల సౌందర్యాలు

సకల వేదములు ఉపనిషత్తులు |

పదారురేకుల పద్మశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౧ ||


దివ్యఫలములు దివ్యాస్త్రములు

దివ్యపురుషులు ధీరమాతలు |

దివ్యజగములు దివ్యశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౨ ||


శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు

జ్ఞానముక్తి ఏకాంత భవనములు |

మణినిర్మితమగు మండపాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౩ ||


పంచభూతములు యాజమాన్యాలు

ప్రవాళసాలం అనేక శక్తులు |

సంతానవృక్ష సముదాయాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


చింతామణులు నవరత్నాలు

నూరామడల వజ్రపురాశులు |

వసంతవనములు గరుడపచ్చలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౫ ||


దుఃఖము తెలియని దేవీసేనలు

నటనాట్యాలు సంగీతాలు |

ధనకనకాలు పురుషార్ధాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౬ ||


పదునాలుగు లోకాలన్నిటి పైన

సర్వలోకమను లోకము కలదు |

సర్వలోకమే ఈ మణిద్వీపము

సర్వేశ్వరికది శాశ్వత స్థానం || ౨౭ ||


చింతామణుల మందిరమందు

పంచబ్రహ్మల మంచముపైన |

మహాదేవుడు భువనేశ్వరితో

నివసిస్తాడు మణిద్వీపములో || ౨౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మణిగణఖచిత ఆభరణాలు

చింతామణి పరమేశ్వరిదాల్చి |

సౌందర్యానికి సౌందర్యముగా

అగుపడుతుంది మణిద్వీపములో || ౨౯ ||


పరదేవతను నిత్యముకొలచి

మనసర్పించి అర్చించినచో |

అపారధనము సంపదలిచ్చి

మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||


నూతన గృహములు కట్టినవారు

మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |

చదివిన చాలు అంతా శుభమే

అష్టసంపదల తులతూగేరు || ౩౧ ||


శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి

మణిద్వీప వర్ణన చదివిన చోట |

తిష్టవేసుకుని కూర్చొనునంట

కోటిశుభాలను సమకూర్చుటకై || ౩౨ ||

 

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము

Read More

ఆయాఅద్భుతమైన దేవాలయాలజాబితా.!

 @ ఓం శ్రీ మాత్రే నమః @


.ఆయాఅద్భుతమైన దేవాలయాలజాబితా.!

 1.తిరుపరకుంద్రం

 2.తిరుచెందూర్

 3.పళని

 4.స్వామిమలై

 5.తిరుత్తని

 6.సోలైమలై(పాలముధిచోలై)

 7.మారుధమలై

 8.వడపళని(చెన్నై)

 9.వైదీశ్వరన్ కోవిల్ ముత్తుకుమారసామి

 10.నాగపట్నం సిక్కల్

 11.త్రిచి వయలూర్

 12.ఈరోడ్ సెన్నిమలై

 13.గోపి పచమలై

 14.కరూర్ వెన్నైమలై

 15.కర్ణాటకకుక్కేసుబ్రమణ్యఆలయం

 16.కర్ణాటకఘాటిసుబ్రమణ్యఆలయం

 17.కేరళహరిపాడ్ ఆలయం

Read More

అభిషేక_మహిమలు

 *అభిషేక_మహిమలు*


*గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలాలు పొందవచ్చో చెప్పబడినది.....!!*


రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం,మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.


వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ,రాజ్యాన్ని పొందవచ్చు.


స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.


నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.


యవగోదూమశాలిజలింగం అనగా 

జొన్నలు,గోధుమలు,బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది,ధనం వర్ధిల్లుతుంది.


సీతాఖండలింగం- పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.


తిలపిష్టలింగం- నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.


భస్మలింగం- భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.


గుడలింగం- బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.


వంశాంకురలింగం- వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.


పిష్ఠలింగం- పిండిలింగం విద్యాప్రదం.


దధిదుగ్ధలింగం-పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద,సుఖం వస్తాయి.


ధాన్యలింగం-ధాన్యప్రదం.


ధాత్రీలింగం-ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.


ఫలలింగం-ఫలప్రదం.


నవనీత(వెన్న)లింగం-కీర్తి,సౌభాగ్యకరం.

దూర్వాకుండజ(గరిక)లింగం-అపమృత్యునివారకం.


కర్పూరలింగం- ముక్తిప్రదం.


అయస్కాంతలింగం-అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.


మౌకికలింగం-ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.


సువర్ణలింగం-బంగారు లింగం మహాముక్తిప్రదం.


రజతలింగం- వెండిలింగం సంపత్కరం.


పిత్తలలింగం- కాంస్యలింగం(ఇత్తడి,కంచు లింగాలు)ముక్తినిస్తాయి.


త్రపులింగం- ఆయసలింగం,


సీసలింగం(తగరం,తుత్తం,ఇనుము) శతృనాశకాలు.


అష్టధాతులింగం- సర్వసిద్ధిప్రదం.


అష్టలోహలింగం- కుష్ఠు వ్యాధిహరం.


వైఢూర్యలింగం- శతృగర్వ నివారకం.


స్ఫటికలింగం-సర్వకామప్రదం.


పాదరసలింగం- మహైశ్వర్యప్రదం.

రాగి,సీసం,శంఖం,ఇనుము,గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.

లింగపూజ పార్వతీపరమేశ్వరుల పూజ.

Read More

ద్వాదశ రాశుల అబీష్ట సిద్ధి కోసం 🌺🕉️

 🕉️🌺ద్వాదశ రాశుల అబీష్ట సిద్ధి కోసం 🌺🕉️


🕉️మేష రాశి  వారికి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన తల్లి నామం


ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్దా పరమేశ్వరి

మూల ప్రకృతి రావ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ !!

చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా !

గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా!!

సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా!

సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ!!

నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ !!


మేష రాశి వారు ఎవరైనా కావచ్చు లలితా నామం లోని ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల సర్వ శుభాలు కలుగుతుంది.. మీకు ఇన్ని ఆటంకాలు తొలగి క్షేమంగా ఉంటారు ఈ రాసి వారికి ఇది అభిష్టసిద్ది మంత్రం....


*****************

🕉️వృషభ రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితానామం .


ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా

వరదావామనయనా వారుణీ మదవిహ్వాలా !!

కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ!

సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా!!

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ!

సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ!!

కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే!

వృతప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోస్తుతే!!


ఇది మీకు సకల కార్యములో విజయము కలిగించే అమ్మ నామం నమ్మకంతో జపించండి..

*********************

🕉️మిథున రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా!

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా!!

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా!

అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా!!

సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా!

కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ!!

యదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః!!


ఇది మిధున రాశి వారికి అన్నిటా శుభాన్ని కలిగించే మంత్రం నిత్యం జపించవలసిన తల్లి నామం.


********************

🕉️కర్కాటక రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన  లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం విదాత్ర్యైనమః

బాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా!

రోగపర్వతదంభోళి ర్మ్రుత్యుదారుకుఠారికా!!

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రరూపిణీ!

భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రపర్తినీ!!

పంచమి పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ!

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ!!

లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్ఠి స్వధే ధ్రువే!

మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తతే


ఇది కర్కాటక రాశి వారికి అన్నిటా అనుకూలమైన మంత్రం నమ్మకము గా జపించి అమ్మవారి అనుగ్రహము పొందండి.


************************

🕉️సింహ రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా!!

ధర్మాధరా ధనాధ్యక్షా ధనధాన్య వివర్థినీ!

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ!!

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ!

సుమంగళీ సుఖకరీ సువేషాడ్యా సువాసినీ!!

మేధే సరస్వతీ వారే భూతి భాభ్రవి తామసి!

నియతే త్వం ప్రసీదే నారాయణి నమోస్తుతే


ఇది ఈ రాసి వారికి సకల కార్య సిద్ది మంత్రం నిత్యం జపించుకోవడం వల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది.


*********************

🕉️కన్యరాశి  వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితా నామం..


ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వరై నమః

భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ!

పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ!!

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా!

రంజనీ రమణీ రస్యా రణత్మింకిణీమేఖలా!!

వజ్రేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ!!

సర్వస్య బుద్ధిరూపేణ జ్ఞానస్య హృది సంస్థితే!

స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే!!


ఇది ఈ రాశి వారికి అన్నిటా శుభాన్ని కలిగించే అమ్మ నామం..

*****************


🕉️తులా రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితానామం


ఓం ఐం హ్రీం శ్రీం సిద్దేశ్వర్యై నమః

అనాహతాబ్జనిలయా శ్యామభా వదనద్వయా!

దంష్ట్రోజ్వలా క్షమాలాదిధరా రుధిరసంస్థితా!!

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా!

మహానీయా దయామూర్తి సామ్రాజ్యశాలినీ !!

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా!

యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరా!!

ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్!

పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే!!


ఇది ఈ రాశి వారందరూ జపించవలసిన తల్లి నామం.

******************


🕉️వృశ్చిక రాశి వారి అభీష్టసిద్ది మంత్రం  జపించ వలసిన లలితా నామం


ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమః

కదంబమంజరీక్లుప్త కర్ణపూర్ణమనోహరా!

తాటంకయుగళీభూత తపనోడుపమండలా!!

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ!

సుదాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ!!

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా!

నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా!!

సృష్టిస్థితి వినాశనాం శక్తిభూతే సనాతని!

గణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే!!


ఈ నామం ఈ రాశి వారికి అన్ని బాధలు దూరం చేసి సకల శుభాలను కలిగిస్తుంది.


*************

🕉️ధనస్సు రాశి వారి అభిష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమః

ఆరుణారుణకౌసుంభవస్త్ర బాస్వత్కటీతటీ!

రత్నకింకిణికారంయ్యరశనాదామభూషితా!!

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ!

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ!!

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా!

సర్వేశ్వరీ సర్వమాయీ సర్వమంత్రస్వరూపిణీ!!

శరణాగత దీనార్తపరిత్రాణ పరాయణే!

సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే!!


ఈ రాశి వారికి సకల జయాలను కలిగించే తల్లి నామం.

****************


🕉️మకర రాశి వారి అభీష్ట సిద్ది మంత్రం జపించ వలసిన లలితానామం


ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమః

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా!

మహాబుద్ది ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ!!

శృతిసీమంతసింధూరీ కృతపాదాబ్జధూళికా!

సకలాగమసందోహశుక్తి సంపుటమౌక్తికా!!

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా!

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమన్డలవాసినీ!!

యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః


ఇది ఈ రాశి వారికి సకల శుభాలను కలిగించే తల్లి నామం.

****************


🕉️కుంభరాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం.


ఓం ఐం హ్రీం శ్రీం శుభాకర్యై నమః

నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా!

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా!!

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా!

నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామానిరుపప్లవా!!

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా!

పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా!!

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే!

భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గేదేవి నమోస్తుతే!!


ఈ రాశి వారికి సకల శుభాలను కలిగించే తల్లి నామం.

************

🕉️మీనరాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించ వలసిన లలితా నామం..


ఓం ఐం హ్రీం శ్రీం సుధాసృత్యై నమః

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా!

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా!!

మహేశ్వరమహాకల్ప మహాతాండవసాక్షిణీ!

మహాకామేశమహిషీ మహాత్రిపుర సుందరీ!!

సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ!

స్వాహా స్వదా మతి ర్మేధా శృతిః స్మృతి రనుత్తమా!!


ఈ రాశి వారందరికీ శుభాలను కలిగించే తల్లి నామాన్ని అంత వరకైనా రోజు జపం చేసుకోండి 


🌹🙏శక్తి ఆరాధన శ్రీ చక్ర ఉపాసన.🙏🌹

Read More

Powered By Blogger | Template Created By Lord HTML