.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

8, జులై 2023, శనివారం

కపిలతీర్థం తిరుపతి

            కపిలతీర్థం తిరుపతి 

                  ➖➖➖✍️



శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది కపిలతీర్థము.


కపిల తీర్ధమునకు ‘చక్రతీర్థం‘ లేదా ‘ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు.


కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి,  భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు.


అందువలన ఇది 'కపిలలింగం'గా పేరొందింది.


త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది.


ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.


కార్తిక మాసం నందు వచ్చు కార్తీక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


ఈ ఆలయం తి.తి.దే. వారి ఆధ్వర్యంలో పని చేస్తున్నది.


శివరాత్రి పండుగ మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


తెలుగునాట వున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది వుండటం విశేషం. 


హరిహరులకు ఏ బేధం లేదని నిరూపిస్తూ నిలచిన ఈ తీర్థ రాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో వుంది.


శేషాచల పర్వతపాదాన వున్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు, యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు.


కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్రతీర్థంలో నిలచినట్లు స్థలపురాణం చెబుతోంది.


కపిలుని తపస్సుకు మెచ్చి నిలచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు.


కామాక్షీ సమేతుడై నిలచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు.


తిరుమల గిరుల నుంచి గల గల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25అడుగుల ఎత్తు నుంచి ఆలయపుష్కరిణిలోకి దూకే ఆకాశ గంగ శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు.


ఇప్పుడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెపుతారు.

అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.


వైష్ణవతీర్థం విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.


విజయనగర పరిపాలన చివరిరోజుల్లో అక్కడ్నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసమేర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్టగావించిందని చెబుతారు.


ఈ ఆలయప్రాంగణంలో కపిలేశ్వరస్వామితో పాటు, కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వ రుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు కూడాకొలువై వున్నారు.


తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం ‘కపిల తీర్ధం.’ ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశంలో ఉంది.


ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.


తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, పాపవినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది.


ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.


విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.

సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.


పుణ్య స్నానం ఇక్కడి తీర్థంలో ఆచరించిన వారి పాపాలు పటాపంచలౌతాయని భక్తుల విశ్వాసం.


విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.✍️

ఓం శివాయ నమః

ఓం నమో  వేంకటేశాయ !!

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML