- వైశాఖ శుద్ధ అష్టమీ - శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_*
*_శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ_
వైశాఖ శుద్ధ అష్టమిని "బగళాష్టమి" అంటారు. ఈ రోజు దశమహావిద్యల్లో ఒకరైన బగళాముఖి అమ్మవారి జయంతి.
చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తి భండాసుర సంహారానికి లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెకు సహకరించిన పది మహాశక్తులైన
1)కాళీ
2)తార
3)షోడశి
4)భువనేశ్వరి
5)భైరవి
6)ఛిన్నమస్త
7)ధూమవతి
8)బగళాముఖి
9)మాతంగి
10)కమలాత్మిక
దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగింది. తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. ఆ చరిత్రను బ్రహ్మాండపురాణం వివరంగా చెబుతుంది. ఉత్తర భారతదేశంలో *"పీతాంబరి"* అనే పేరుతో శత్రువులను సైతం మనకు అనుకూలంగా మార్చే తల్లిగా బగళాముఖి దేవీని ప్రత్యేకంగా పూజిస్తారు.
*_బగళాముఖి ధ్యానశ్లోమ్_*
*సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం*
*హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపక గ్యుతాం*
*హస్త్రైర్ముద్గరపాశవజ్రరశనాః సంబిభ్రతీం భూషణైః*
*వ్యాప్తంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే*
బగళాముఖి సింహాసనంపై ఆశీనురాలై మూడుకన్నులతో, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బంగారం వర్ణ శరీరం తో, శిరస్సున కిరీటంతో పాటు చంద్రరేఖను, మెడలో కలవపూల మాలను ధరించినదై, కొరడా, పాశం, వజ్రం భోజన పాత్రలను నాలుగు చేతులలో ధరించి మూడులోకాలలోనూ వ్యాపించినది, భక్త రక్షణ కోసం అన్నింటినీ స్తంభింప చేయగలిగిన శక్తి కలది.
స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద, ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
అరిషడ్వర్గాల రూపంలో మనలోనే దాగిఉండే అంతర్గత శత్రువులను శిక్షించి, మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరికీ హానీ చేయనివిగా, అందరికీ మేలు చేసేవిగా ఉండాలని, మనలో కోపాన్ని, దుర్వాక్కులను నశింపజేయమని ఈ అమ్మవారిని మనం ప్రార్థిస్తే సత్ఫలితాలు పొందుతారు.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, మధ్యప్రదేశ్ లోని దతియా, గుజరాత్ లోని వడోదరలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో అతి ప్రాచీనమైన బగళాముఖి ఆలయాలున్నాయి.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ మాత్రే నమః 𝕝𝕝卐𝕝𝕝_*

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి