.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మే 2026, మంగళవారం

*కాకబలి :*

 *కాకబలి :*


దురదృష్టవశాత్తు కొంతమంది చిన్న పిల్లలు అకస్మాత్తుగా చనిపోతారు. అలాంటి అభాగ్యులైన బిడ్డలకు పితృపక్షంలో వచ్చే త్రయోదశినాడు ఒక ప్రత్యేకమైన శాంతి ప్రక్రియను చేస్తారు. దీనిని "కాకబలి” అని పిలుస్తారు. ఆ మర్నాడు ఆ బిడ్డల ఆత్మశాంతికోసం శ్రార్ధకర్మలను నిర్వహిస్తారు.


సాధారణంగా, భారతదేశంలోని హైందవులు- గయ/కాశి/ప్రయాగ/కురుక్షేత్ర/నైమిశారణ్యం/రామేశ్వరం- క్షేత్రాలలో తమ పితృదేవతలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు శ్రార్ధకర్మలు చెయ్యటం జరుగుతుంది. కలకత్తా నగరంలోని జగన్నాధ్ ఘాట్ వద్ద పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు.


ఈలోకంలో ఏ సుఖాలు అనుభవించకుండానే చనిపోయిన చిన్న పిల్లలకు మరియు సుఖాలను విసర్జించి సన్యాసులుగా మారిపోయిన వారికి పితృపక్షంలోని ద్వాదశినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. ఆయుధాలచేత చనిపోయినవారికి, హింసాత్మక చావు పొందినవారికి పితృపక్షంలోని చతుర్దశి తిధినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. దీనిని "ఘాతచతుర్దశి” (గాయముల/దెబ్బల) అని పిలుస్తారు.


ఏ తిధినాడు చనిపోయాడు/చనిపోయింది అనే ప్రశ్న లేకుండా, చనిపోయిన పెద్దలందరికీ (పితృదేవతలు) పితృపక్షంలోని చివరి రోజు అయిన అమావాస్యనాడు చేసే శ్రార్థప్రక్రియను “సర్వపిత్రి అమావాస్య" అనే పేరుతో పిలుస్తారు. ఈ తిధి రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే, గయా క్షేత్రంలో శ్రార్ధకర్మలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం వస్తుందని హైందవ మంత్రశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML