.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

భగవంతుడు సర్వాంతర్యామి

భగవంతుడు సర్వాంతర్యామి
భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అని అన్ని మతాలు నిర్దంద్వంగా అంగీకరిస్తాయి. కానీ, భగవంతుణ్ణి విగ్రహరూపంతో ఆరాధించే ప్రక్రియను మాత్రం ఇతర మతాలు సహించలేవు. అంగీకరించలేవు కూడా. ..? పైపెచ్చు హిందువులు రాళ్ళనీ, రప్పలనీ పూజాస్తారంటూ నోటికొచ్చినట్లుగా విమర్శించే వారు కోకొల్లలు.
ఈ విమర్శలకు హిందూధర్మంలో నాకు చక్కని సమాధానం దొరికింది. శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వ్యక్తిని తాకినట్లే. వ్యక్తి స్పందిస్తాడు తప్ప, అవయవం స్పందిచదు కదా! వ్యక్తి కంటికి కనబడడు. శరీరంలో భాగమైన అవయవాన్ని ముట్టుకుంటే చాలు కనబడని వ్యక్తి స్పందిస్తాడు.
ఈ శరీరంలో నీవుండే చోటేది? నీ ఉనికికి కేంద్రమేది? అని వ్యక్తిని ప్రశ్నిస్తే.. తన ఉనికి ఈ శరీరమంతా వ్యాపించి ఉంది అని వివరిస్తాడు. ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉన్న దేహంలోనే వ్యక్తి అంతటా వ్యాపించి ఉన్నపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ సర్వాంతర్యామిగా ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉండడంలో అతిశయోక్తి లేదు. అన్నీ తానే అయినపుడు దేనిని పూజించినా దానికి ఆయన స్పందిచడంలో ఆశ్చర్యమే లేదు. విగ్రహాన్ని పూజిస్తే పరమాత్ముణ్ణి పూజించడమే అవుతుంది.
అందుకే! హిందువులు సగుణాన్ని ఆరాధిస్తున్నా, వారు నిర్గుణానికి ఎంత మాత్రమూ దూరం కారనే సత్యాన్ని హిందూధర్మం చాటుతోంది.
స్వామి పరిపూర్ణానంద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML