.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

#శ్వాసకు....#ఆయుష్షుకూ



#శ్వాసకు....#ఆయుష్షుకూ
ఉన్న సంబంధం

మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు.100 నుండి 120 సం.. బ్రతుకుతాడు. తాబేలు 3 సార్లు శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకుతుంది.

ఐతే శ్వాస లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగుతుంది....? దీనిని నేను స శాస్త్రీయంగా వివరిస్తాను.... అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణం లోనూ మైట్రోకాన్ద్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.
ఈ మైట్రోకాన్ద్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు, గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీనిద్వారా ఉష్ణం జనిస్తుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తి.ఇలా శరీరంలోని కాలిగోరు నుండి తలవెంట్రుకలు చివరవరకూ ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది. ఇలా ఒక్కొక్క కణం నిముషానికి15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది. ఎందుకంటే మనం నిముషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి. ఇలాంటి కణం 3రోజులు ఏకధాటిగా పనిచేసి,
తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది. ఇలాంటి మృత కణాలు, మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఒక మృతకణం బయటికి వెళ్లిందో...ఆ స్థలంలో ఒక కొత్తకణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......ఉదాహరణకు మన గుండెలో 1000 మృతకణాలు తయారయ్యాయి అనుకుంటే....ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్మి, మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే, ఆ స్థలంలో కణాలు తయారవుతాయి. పాత వాటిని ఖాళీ చేస్తేనే ...కొత్తవి రాగల్గుతాయి. అందుకే ప్రతిదినం మన విసర్జన క్రియ అతి ముఖ్యమైనది. ఎవరైతే మలవిసర్జన సరిగా చెయ్యరో.... వారి శరీరం నిండా ఈ మృత కణాలు(toxins) నిండిపోయి...సరిగా ఉష్ణం జనించక.....తీవ్ర రోగాల బారిన పడతారు....కనుక ఈ టాక్సిన్ లను .....బయటికి పంపే డిటాక్సీఫీకేషన్(విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3రోజులు జీవిస్తుంది.
అదే కణం 14సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే, 5 రోజులు జీవిస్తుంది.
13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే, 7 రోజులు జీవిస్తుంది.
ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ, మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది. ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పనిచేయిస్తే...త్వరగా పాడైపోతుందో.....పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో....అలాగే ఈ కణాలు కూడా.

భారతీయ యోగులు ...కణం యొక్క జీవిత కాలాన్ని 3 నుండి 21 రోజుల వరకు పెంచి 2100 సంవత్సరాలు కూడా జీవించగలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునేకొద్దీ....శరీరంలోని ప్రతీ కణంపై, తీవ్ర పనిఒత్తిడి పడి... ఆ కణం త్వరగా పాడైపోతుంది. ప్రాణ యామ సాధన ద్వారా... శ్వాసల సంఖ్యను తగ్గించి, కణాల పనిరోజులని పెంచగల్గితే.....మన శరీరం లోని ప్రతి అవయం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే....అవయవాలు అంటే కణాల సముదాయమే.
ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క ఆయుష్షు పెరిగితే....మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.

మనం ఒక్క శ్వాసను తవగించ గల్గితే, 20 సంవత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చు.
యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే....తాము ఈరోజు మరణించేదీ....ముందే చెబుతారు.

కానీ ఒక్క శ్వాసను తగ్గించడం అనేది అంత సామాన్య విషయం కాదు....ప్రాణ యామం చెయ్యడం ముఖ్యం కాదు. ఏ ప్రాణం యామం తర్వాత ఏ ప్రాణాయామం చెయ్యాలి? అన్న సీక్వెన్స్ చాలా ముఖ్యం. తిరుమల కృష్ణమాచార్య లాంటి యోగులు ప్రాణాయామం , యోగ సీక్వెన్స్ లను తయారు చేశారు. పతంజలి అష్టాంగ యోగం నందు, ఈ క్రమపద్ధతి వివరంగా ఉంది. కానీ దాదాపు ఏకొద్దిమందికి మాత్రమే, ఈ సీక్వెన్స్ గురించి తెలుసు.
క్రమబద్ధీకరణతో కూడిన ప్రాణాయామమే గొప్ప ఫలితాలనిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML